అనూషకు స్వర్ణం

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్‌ మల్లాల అనూష జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి సిరీస్‌ అథ్లెటిక్స్‌ టోర్నమెంట్లో

Published : 22 May 2022 04:03 IST

ఇండియన్‌ గ్రాండ్‌ప్రిలో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్‌ మల్లాల అనూష జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఒడిషాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి సిరీస్‌ అథ్లెటిక్స్‌ టోర్నమెంట్లో అనూష ట్రిపుల్‌ జంప్‌ స్వర్ణం సాధించింది. ఆమె ఈ పోటీలో 12.9 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన పూర్వ (12.6 మీ), శర్వారి (12.26 మీ) తర్వాతి రెండు స్థానాలు సాధించారు. అనూష విజయవాడలో కోచ్‌ కృష్ణమోహన్‌ వద్ద శిక్షణ పొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని