Mohammed shami: అది నా పని కాదు.. మహ్మద్ షమి అసహనం

కోల్కతా: ఆస్ట్రేలియా పర్యటనకు తనను పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల భారత పేసర్ మహ్మద్ షమి అసహనం వ్యక్తం చేశాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు అందుబాటులో ఉన్నానంటే తాను ఫిట్గా ఉన్నట్లేనని షమి అన్నాడు. ఫిట్నెస్ గురించి సెలెక్షన్ కమిటీకి సమాచారం అందించడం తన పని కాదని తెలిపాడు. ఈ నెల 19న ఆరంభం కానున్న పర్యటనలో మూడు వన్డేలు, అయిదు టీ20ల్లో భారత్, ఆసీస్ తలపడనన్నాయి. షమి ఫిట్నెస్పై సందేహాలతోనే అతణ్ని జట్టులోకి ఎంపిక చేయట్లేదని వార్తలొస్తున్న నేపథ్యంలో అతను స్పందించాడు. ‘‘ఎంపిక నా చేతుల్లో లేదని గతంలో కూడా చెప్పా. నాకేమైనా ఫిట్నెస్ సమస్యలు ఉండుంటే బెంగాల్ తరఫున ఆడుతూ ఉండకూడదు. దీని గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు 50 ఓవర్ల క్రికెట్లోనూ బరిలో దిగగలను. ఫిట్నెస్ గురించి చెప్పడం.. అడగడం.. సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు.. పని కాదు. ఎన్సీఏకు వెళ్లి సిద్ధమవడం.. మ్యాచ్లాడటమే నా పని’’ అని షమి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. - 
                                    
                                        

వాళ్ల వెనుక అతడు
భారత మహిళల క్రికెట్ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం. కానీ ఇప్పుడు భారత్ మారింది. - 
                                    
                                        

కల తీరెలే కప్పందగా..
భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్. ప్రతీక రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె.. తన తొలి మ్యాచ్లో విఫలమైనా ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. - 
                                    
                                        

వచ్చింది.. గెలిపించింది
వారం ముందు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచకప్ వీక్షకురాలు. టీవీలో భారత జట్టు ఆట చూస్తూ ఉంది. కానీ ఉన్నట్లుండి అంతా మారిపోయింది. ఆమె టీవీ లోపలికి వెళ్లిపోయింది. భారత జట్టులో సభ్యురాలై ప్రపంచకప్లో ఆడేసింది. - 
                                    
                                        

కొత్త బంగారు లోకం
ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం దగ్గర్నుంచి.. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందే వరకు! రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్థితి నుంచి.. రక్షణ వలయం లేకుండా బయటికి వెళ్లలేని దశ వరకు! ప్రత్యక్ష ప్రసారమే లేని రోజుల నుంచి. - 
                                    
                                        

మన వనిత.. విశ్వవిజేత
ఆట ఏదైనా ప్రపంచకప్ అంటే.. ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు, బంతి పట్టిన ప్రతి అమ్మాయీ దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారీ నిరాశే. - 
                                    
                                        

హర్మన్ డెవిల్స్
అప్పట్లో కపిల్ నేతృత్వంలో పురుషుల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచ కప్ను అందించిన జట్టును ‘కపిల్ డెవిల్స్’ అన్నారు. అసలు అంచనాలే లేకుండా అద్వితీయ ప్రదర్శన చేస్తూ అరివీర భయంకర వెస్టిండీస్ను ఓడించి 1983లో అద్భుతం చేసింది ఆ భారత జట్టు. - 
                                    
                                        

దొరికింది ఓ ఆణిముత్యం
భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. - 
                                    
                                        

మహిళల క్రికెట్లో మలుపు
వన్డే ప్రపంచకప్లో భారత్ విజయం యావత్ మహిళల క్రికెట్ను మార్చబోతోందని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. 1983లో కపిల్ సేన విజయం ప్రపంచ క్రికెట్ను మార్చినట్లుగానే.. - 
                                    
                                        

మనకొకటి..
అర్ష్దీప్ జట్టులో ఉండాలి.. గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఆస్ట్రేలియాతో సిరీస్లో 0-1తో వెనకబడిన దశలో అతడికి చోటు లభించింది. ఆ అవకాశాన్ని అతడు వమ్ము చేయలేదు. - 
                                    
                                        

అప్పుడు కపిల్.. ఇప్పుడు అమన్
దక్షిణాఫ్రికా గెలవాలంటే 54 బంతుల్లో 79 పరుగులు చేయాలి. అయినా ఆ జట్టు ధీమాగా ఉంది. సెంచరీ చేసిన కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇంకా క్రీజులో ఉండడమే ఇందుకు కారణం. - 
                                    
                                        

టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు కేన్ విలియమ్సన్ టీ20లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున 93 టీ20లు ఆడిన కేన్.. 2575 పరుగులు సాధించాడు. 2011లో జింబాబ్వేపై పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ బ్యాటర్. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు: శశిథరూర్
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
 - 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 


