సౌదీలో తొలి స్కై స్టేడియం

Eenadu icon
By Sports News Desk Published : 28 Oct 2025 03:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దుబాయ్‌: స్టేడియం అంటే నేల మీద ఉంటుంది.. కానీ సౌదీ అరేబియా ఆకాశంలో కట్టబోతోంది. 2034 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ ఈ సరికొత్త ఆలోచన చేసింది. ఇది భూమి నుంచి 350 మీటర్ల ఎత్తులో ఉండబోతోంది. ఈ స్టేడియంలో 46 వేల మంది అభిమానులు కూర్చునే అవకాశం ఉంటుంది. రూ.8,800 కోట్ల భారీ వ్యయంతో ఈ స్టేడియం కట్టాలనేది సౌదీ ప్రణాళిక. 2032 నాటికి ఈ స్టేడియం పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ప్రయత్నం ఫలిస్తే ప్రపంచంలో ఇదే తొలి స్కై స్టేడియంగా నిలవనుంది. 48 జట్లు పోటీపడే 2034 ప్రపంచకప్‌నకు సౌదీలోని అయిదు నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ స్టేడియానికి సంబంధించిన ఊహాచిత్రాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని