ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

Eenadu icon
By Sports News Desk Updated : 30 Oct 2025 02:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

సార్‌బ్రూకెన్‌ (జర్మనీ): హైలో ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో లక్ష్యసేన్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్యసేన్‌ 21-16, 22-20తో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. శంకర్‌ ముత్తుసామి సుబ్రమణ్యన్‌ 21-14, 18-21, 21-16తో లియోంగ్‌ జున్‌ (మలేసియా)పై గెలుపొందాడు. కిదాంబి శ్రీకాంత్‌ 19-21, 11-21తో కిరణ్‌ జార్జ్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా, రక్షితశ్రీ, శ్రియాంషి వలిశెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో ఉన్నతి 21-4, 21-13తో జూలియానా వియానా (బ్రెజిల్‌)పై, రక్షిత 21-14, 21-16తో క్లారా అజుర్మెండి (స్పెయిన్‌)పై, శ్రియాంషి 21-19, 21-12తో లైన్‌ హాజ్‌మార్క్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించారు. అన్మోల్‌ ఖార్బ్‌ 24-26, 21-23తో జూలీ  జాకబ్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడింది.

Tags :
Published : 30 Oct 2025 02:40 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని