WI vs IND: ‘తిలక్ వర్మకు వద్దని చెప్పి హార్దిక్ భారీ షాట్లు ఆడాడు’.. పాండ్య తీరును తప్పుబట్టిన మాజీ క్రికెటర్
విండీస్తో మూడో టీ20లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. హార్దిక్ సిక్స్ కొట్టడంతో మరో ఎండ్లో ఉన్న తిలక్ వర్మ అర్ధ శతకానికి ఒక పరుగు దూరంలో నిలిచిపోయాడు. దీంతో పాండ్య వ్యవహరించిన తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో (WI vs IND) కీలకమైన మూడో టీ20లో భారత్ విజయం సాధించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. సూర్యకుమార్ యాదవ్ (83)తోపాటు కొత్త కుర్రాడు, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Varma) (49) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) (20) సిక్స్ కొట్టి భారత్కు విజయాన్ని అందించాడు. భారత్ 14 బంతుల్లో కేవలం 2 పరుగులు చేయాల్సి ఉండగా పాండ్య సిక్స్ కొట్టడంతో మరో ఎండ్లో ఉన్న తిలక్ వర్మ అర్ధ శతకానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఒక్క పరుగు చేస్తే అతడి ఖాతాలో వరుసగా రెండో అర్ధశతకం చేరేది. తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్య స్వార్థపూరితంగా వ్యవహరించాడని అభిమానులు నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ చివరి బంతి కాదు కదా.. నెట్రన్రేట్ మెరుగుపర్చుకోవాల్సిన అవసరం లేదుగా అంటూ హార్దిక్పై ట్రోలింగ్ చేస్తున్నారు. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) కూడా హార్దిక్ పాండ్య వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మోదీ మొన్న అన్నారు.. క్రికెటర్లు ఎప్పుడో పాటించారు!
ద్వైపాక్షిక సిరీస్లో నెట్ రన్ రేట్ గురించి ఆందోళన లేనప్పుడు అతడు ఎందుకు భారీ షాట్ ఆడాడో అర్థం కాలేదన్నాడు. తిలక్ వర్మను భారీ షాట్లు ఆడొద్దని చెప్పి.. హార్దికే పెద్ద షాట్లు ఆడాడని చోప్రా పేర్కొన్నాడు. ‘‘సూర్యకుమార్ ఔటైన తర్వాత హార్దిక్ పాండ్య బ్యాటింగ్కు వచ్చాడు. అప్పటికే క్రీజులో ఉన్న తిలక్ వర్మ వద్దకు వెళ్లి నాటౌట్గా ఉండటం ముఖ్యమని చెప్పాడు. కానీ, హార్దికే భారీ షాట్లు ఆడాడు. ఇక్కడ నెట్ రన్రేట్ అవసరం లేదు. ఎలా గెలిచినా పెద్దగా పోయేదేమి లేదు. తిలక్ వర్మను వద్దని చెప్పి తానే పెద్ద షాట్లు ఆడాడు. 14 బంతుల్లో రెండు పరుగులు కావాలి. హార్దిక్ సింగిల్ తీసి తిలక్కు అవకాశం ఇస్తే అతడు సిక్స్ కొట్టి ముగించేవాడేమో’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
హార్దిక్ అందుకే ఇలా చేశాడేమో?
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని జట్టులో టీమ్ఇండియా కొత్త జట్టును రూపొందించే దిశగా కసరత్తు మొదలెట్టింది. కాబట్టి, వ్యక్తిగత మైలురాళ్ల గురించి చింతించకుండా జట్టు సంస్కృతిని నిర్మించడంలో భాగంగా హార్దిక్ అలా చేసి ఉంటాడని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
‘‘ఆటగాళ్ల మైలురాళ్లు, అర్ధ సెంచరీ చేయడం, నాటౌట్గా ఉండటం వంటి పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఓ జట్టు సంస్కృతిని వాళ్లు తీసుకురావాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడ నాటౌట్గా ఉండటం అనవసరమైన విషయం’’ అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమానులారా మ్యాచ్ ముగిసినా వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా మ్యాచ్ ముగిసినా వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి