IND vs SL: ఓటమికి అర్ష్దీప్ ఒక్కడే బాధ్యుడు కాదు.. !
శ్రీలంకతో రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా (Team India) ఓటమికి అర్ష్దీప్ ఒక్కడినే బాధ్యుడిని చేస్తే.. బ్యాటర్లను కాపాడినట్లే. మిడిల్ ఆర్డర్, పార్ట్టైం బ్యాటర్లు ఆడినట్లు మన టాప్ ఆర్డర్ ఆడలేదు. బంతితో, బ్యాట్తో భారత్ ఓపెనింగ్ ఏమాత్రం బాగోలేదు.
ఇంటర్నెట్డెస్క్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా(Team India)ను టాప్ ఆర్డర్ వైఫల్యం, అదనపు పరుగులే ముంచేశాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి తోడు పవర్ప్లేలో మన బౌలింగ్తోపాటు, బ్యాటింగ్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఒక దశలో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు, సీమర్లు శ్రీలంక బ్యాటర్లను అదుపు చేసినా.. తిరిగి స్లాగ్ ఓవర్లలో బంతి సీమర్ల చేతికి వచ్చాక భారీగా పరుగులు సమర్పించుకొన్నారు. 200 పరుగుల లక్ష్య ఛేదన ఏ జట్టుకైనా ఒత్తిడి పెంచుతుంది. కానీ, ప్రణాళిక ప్రకారం ఆడితే టీ20ల్లో ఇదే ఛేదించలేని లక్ష్యం కాదు.
కుదరుకోని ఓపెనింగ్ జోడీ..
టీమ్ ఇండియా(Team India) ఇటీవల కాలంలో ఆడిన టీ20 మ్యాచ్ల్లో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొన్న సందర్భం దాదాపు ఒక్కటి కూడా లేదు. టీ20 ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో కూడా భారత్ పవర్ ప్లే రన్రేట్ 6 అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పవర్ ప్లే ముగిసే సరికే 39 పరుగులకు టాప్ ఆర్డర్ పెవిలియన్కు చేరుకొంది. భారత్ విజయం సాధించిన తొలి మ్యాచ్లో కూడా పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. మ్యాచ్ను దాదాపు ఏకపక్షం చేయాల్సిన తొలి 6 ఓవర్లను టాప్ ఆర్డర్ వైఫల్యంతో వృథా చేస్తూనే ఉన్నారు. కొత్తగా అవకాశం దక్కించుకొన్న ఆటగాళ్లు శుబ్మన్గిల్, రాహుల్ త్రిపాఠిలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. గిల్, త్రిపాఠి ఇద్దరూ ఆవేశపడి వికెట్లను సమర్పించుకొన్నారు. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా(Team India) తరఫున తొలి ఆరుగురు బ్యాటర్లలో ఒక్క సూర్యకుమార్ను పక్కన పెడితే మిగిలిన ఐదుగురు కలిసి చేసిన స్కోరు 33 పరుగులు..! రోహిత్, కోహ్లీలను పక్కన పెట్టి ఇచ్చిన అవకాశాలను కొత్త బ్యాటర్లు నేలపాలు చేసుకొన్నారు.
వైడ్లు.. నోబాల్స్ కొంప ముంచాయి..
శ్రీలంక బ్యాటింగ్లో 20వ ఓవర్ ప్రారంభ సమయానికి 186/6 స్కోర్తో ఉంది. టీమ్ ఇండియా(Team India) కూడా బ్యాటింగ్ సమయంలో 20వ ఓవర్ మొదలయ్యే సరికి 186/6 స్కోర్ వద్దే ఉంది. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక మధ్య ఒక్కటే తేడా. అవి నోబాల్స్..! శ్రీలంక 10 వైడ్ బాల్స్ వేసింది.. కానీ, ఒక్క నోబాల్ కూడా ఇవ్వలేదు. ఇక భారత బౌలర్లు నాలుగు వైడ్లు, ఏడు నోబాల్స్ వేశారు. ముఖ్యంగా ఈ ఏడు నోబాల్స్.. వాటికి ఇచ్చిన ఫ్రీ హిట్లతో కలిపి మొత్తం 38 పరుగులు సమర్పించుకొన్నారు. ఇందులో 18.5 ఓవర్లో శానక ఇచ్చిన క్యాచ్ కూడా నోబాల్ రూపంలో వృథాగా మారి పోయింది. దీంతో చివరి ఓవర్లో శానక రెచ్చిపోయి ఒక్కడే 19 పరుగులు సాధించాడు. దీంతో ఆ జట్టు 206 పరుగులను చేరుకొంది. టీ20ల్లో 200 పరుగులు మానసికంగా ప్రత్యర్థులను దెబ్బతీసే స్కోరు. నోబాల్స్ లేకపోతే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.
పాండ్యా నీకిది తగునా..!
ఈ మ్యాచ్ ఓటమిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పాత్రను విస్మరించలేం. బౌలింగ్ వనరుల వినియోగంలో ప్రణాళికా లోపం కచ్చితంగా కనిపిస్తోంది. తొలి ఓవర్ వేసిన పాండ్యా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన అర్ష్దీప్ తొలి ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. సహజంగా అతడి ఆత్మవిశ్వాసంపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో అతడిని 19వ ఓవర్ వరకు పక్కన పెట్టాడు. సాధారణంగా టీ20ల్లో 19, 20వ ఓవర్లు బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడతారు. అలాంటి సమయంలో అర్ష్దీప్ చేతికి బంతి ఇచ్చాడు.. అప్పటికే భీకర షాట్లతో రెచ్చిపోయిన శానక అర్ష్దీప్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో రెండు ఓవర్లకు 6.50 ఎకానమీతో 13 పరుగులే ఇచ్చిన కెప్టెన్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్లో కూడా వివిధ కారణాలతో చివరి ఓవర్ వేయడానికి పాండ్యా ఇష్టపడలేదు. రెండో మ్యాచ్లో అలాంటి కారణాలు ఏమీ లేకపోయినా కీలక సమయంలో బంతిని తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు..