IND vs SL: ఓటమికి అర్ష్దీప్ ఒక్కడే బాధ్యుడు కాదు.. !
శ్రీలంకతో రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా (Team India) ఓటమికి అర్ష్దీప్ ఒక్కడినే బాధ్యుడిని చేస్తే.. బ్యాటర్లను కాపాడినట్లే. మిడిల్ ఆర్డర్, పార్ట్టైం బ్యాటర్లు ఆడినట్లు మన టాప్ ఆర్డర్ ఆడలేదు. బంతితో, బ్యాట్తో భారత్ ఓపెనింగ్ ఏమాత్రం బాగోలేదు.
ఇంటర్నెట్డెస్క్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా(Team India)ను టాప్ ఆర్డర్ వైఫల్యం, అదనపు పరుగులే ముంచేశాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి తోడు పవర్ప్లేలో మన బౌలింగ్తోపాటు, బ్యాటింగ్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఒక దశలో మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు, సీమర్లు శ్రీలంక బ్యాటర్లను అదుపు చేసినా.. తిరిగి స్లాగ్ ఓవర్లలో బంతి సీమర్ల చేతికి వచ్చాక భారీగా పరుగులు సమర్పించుకొన్నారు. 200 పరుగుల లక్ష్య ఛేదన ఏ జట్టుకైనా ఒత్తిడి పెంచుతుంది. కానీ, ప్రణాళిక ప్రకారం ఆడితే టీ20ల్లో ఇదే ఛేదించలేని లక్ష్యం కాదు.
కుదరుకోని ఓపెనింగ్ జోడీ..
టీమ్ ఇండియా(Team India) ఇటీవల కాలంలో ఆడిన టీ20 మ్యాచ్ల్లో పవర్ ప్లేను సద్వినియోగం చేసుకొన్న సందర్భం దాదాపు ఒక్కటి కూడా లేదు. టీ20 ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో కూడా భారత్ పవర్ ప్లే రన్రేట్ 6 అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పవర్ ప్లే ముగిసే సరికే 39 పరుగులకు టాప్ ఆర్డర్ పెవిలియన్కు చేరుకొంది. భారత్ విజయం సాధించిన తొలి మ్యాచ్లో కూడా పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది. మ్యాచ్ను దాదాపు ఏకపక్షం చేయాల్సిన తొలి 6 ఓవర్లను టాప్ ఆర్డర్ వైఫల్యంతో వృథా చేస్తూనే ఉన్నారు. కొత్తగా అవకాశం దక్కించుకొన్న ఆటగాళ్లు శుబ్మన్గిల్, రాహుల్ త్రిపాఠిలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. గిల్, త్రిపాఠి ఇద్దరూ ఆవేశపడి వికెట్లను సమర్పించుకొన్నారు. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా(Team India) తరఫున తొలి ఆరుగురు బ్యాటర్లలో ఒక్క సూర్యకుమార్ను పక్కన పెడితే మిగిలిన ఐదుగురు కలిసి చేసిన స్కోరు 33 పరుగులు..! రోహిత్, కోహ్లీలను పక్కన పెట్టి ఇచ్చిన అవకాశాలను కొత్త బ్యాటర్లు నేలపాలు చేసుకొన్నారు.
వైడ్లు.. నోబాల్స్ కొంప ముంచాయి..
శ్రీలంక బ్యాటింగ్లో 20వ ఓవర్ ప్రారంభ సమయానికి 186/6 స్కోర్తో ఉంది. టీమ్ ఇండియా(Team India) కూడా బ్యాటింగ్ సమయంలో 20వ ఓవర్ మొదలయ్యే సరికి 186/6 స్కోర్ వద్దే ఉంది. ఈ మ్యాచ్లో భారత్, శ్రీలంక మధ్య ఒక్కటే తేడా. అవి నోబాల్స్..! శ్రీలంక 10 వైడ్ బాల్స్ వేసింది.. కానీ, ఒక్క నోబాల్ కూడా ఇవ్వలేదు. ఇక భారత బౌలర్లు నాలుగు వైడ్లు, ఏడు నోబాల్స్ వేశారు. ముఖ్యంగా ఈ ఏడు నోబాల్స్.. వాటికి ఇచ్చిన ఫ్రీ హిట్లతో కలిపి మొత్తం 38 పరుగులు సమర్పించుకొన్నారు. ఇందులో 18.5 ఓవర్లో శానక ఇచ్చిన క్యాచ్ కూడా నోబాల్ రూపంలో వృథాగా మారి పోయింది. దీంతో చివరి ఓవర్లో శానక రెచ్చిపోయి ఒక్కడే 19 పరుగులు సాధించాడు. దీంతో ఆ జట్టు 206 పరుగులను చేరుకొంది. టీ20ల్లో 200 పరుగులు మానసికంగా ప్రత్యర్థులను దెబ్బతీసే స్కోరు. నోబాల్స్ లేకపోతే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది.
పాండ్యా నీకిది తగునా..!
ఈ మ్యాచ్ ఓటమిలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పాత్రను విస్మరించలేం. బౌలింగ్ వనరుల వినియోగంలో ప్రణాళికా లోపం కచ్చితంగా కనిపిస్తోంది. తొలి ఓవర్ వేసిన పాండ్యా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన అర్ష్దీప్ తొలి ఓవర్లో 19 పరుగులు సమర్పించుకున్నాడు. సహజంగా అతడి ఆత్మవిశ్వాసంపై ఇది ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో అతడిని 19వ ఓవర్ వరకు పక్కన పెట్టాడు. సాధారణంగా టీ20ల్లో 19, 20వ ఓవర్లు బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడతారు. అలాంటి సమయంలో అర్ష్దీప్ చేతికి బంతి ఇచ్చాడు.. అప్పటికే భీకర షాట్లతో రెచ్చిపోయిన శానక అర్ష్దీప్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో రెండు ఓవర్లకు 6.50 ఎకానమీతో 13 పరుగులే ఇచ్చిన కెప్టెన్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్లో కూడా వివిధ కారణాలతో చివరి ఓవర్ వేయడానికి పాండ్యా ఇష్టపడలేదు. రెండో మ్యాచ్లో అలాంటి కారణాలు ఏమీ లేకపోయినా కీలక సమయంలో బంతిని తీసుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు