IPL 2023: ఐపీఎల్ స్టంప్స్ అంత ఖరీదా..!
ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు అర్ష్దీప్ చివరి ఓవర్లో ఇద్దరు ముంబయి బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ రెండు బంతులకు వికెట్లు విరిగిపోయాయి. దీంతో టోర్ని నిర్వాహకులకు లక్షల్లో నష్టం వాటిల్లిందని కథనాలు వెలువడ్డాయి. నిజంగా అంత ఖరీదైన వికెట్లు వాడుతున్నారా..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఐపీఎల్ (IPL 2023) టోర్నీలో పంజాబ్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ వేసిన చివరి ఓవర్.. ఐపీఎల్లో అత్యంత ‘ఖరీదైనది’గా మీడియా, నిపుణులు చెబుతున్నారు. ఖరీదంటే ఇక్కడ ఎక్కువ పరుగులు ఇవ్వడం కాదు.. రెండు వికెట్లు తీసుకోవడం..! అది కూడా యార్కర్లతో మిడిల్స్టంప్స్ను విరగ్గొట్టి మరీ విజయం అందించడం. ఆ విరిగిన స్టంప్స్ ధర ఎంత లేదన్నా లక్షల్లో ఉంటుంది. మీడియా మాత్రం ఐపీఎల్ నిర్వాహకులకు రూ.60 లక్షల వరకు నష్టం ఉంటుందని కథనాల్లో పేర్కొంది. అంటే ఈ లీగ్లో ముగ్గురు ఆటగాళ్ల కనీస ధరకు సమానం..!
క్రికెట్లో తొలిసారి రూల్స్ రాసుకొన్న 1744 సంవత్సరంలో కేవలం రెండు స్టంప్స్ మాత్రమే ఉండేవి. వాటిపై ఒక పెద్ద బెయిల్ పెట్టి ఆడేవారు. కానీ, బంతి రెండు స్టంప్స్ మధ్య నుంచి వెళ్లి.. బెయిల్ పడకుండా ఉన్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. దీంతో 1775లో లంపీస్టీవెన్సన్ అనే వ్యక్తి తొలిసారిగా మూడు స్టంప్స్ను ఆటకు పరిచయం చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆ నియమం ఆటలో స్థిరపడిపోయింది. కాకపోతే చెక్కతో చేసిన ఈ స్టంప్స్, బెయిల్స్ అప్పుడప్పుడు బంతి తాకినా కిందపడేవి కాదు. దీంతో బ్యాటర్లు బతికిపోయేవారు. 2008లో ఆస్ట్రేలియాకు చెందిన బీబీజీ స్పోర్ట్స్ అనే కంపెనీ కెమెరాలను అమర్చిన స్టంప్స్ను పరిచయం చేసింది. ఆ తర్వాత సదరు కంపెనీని స్టంప్స్ కామ్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 2008 మార్చిలో జరిగిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్లో వీటిని తొలిసారి వినియోగించారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ గ్రేడ్ క్రికెటర్ బ్రాంటే ఎకెర్మెన్ తొలిసారి ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్ను తయారు చేశాడు. తన కుమార్తె వద్ద ఉన్న చిన్న ఆటబొమ్మను చూసి స్ఫూర్తి పొంది దీనిని రూపొందించారు. వీటిల్లో అమర్చిన సూక్ష్మమైన మైక్రోప్రాసెసర్ బెయిల్స్, స్టంప్స్ మధ్య కదలికలను సెకన్లో 1000వ వంతులో గుర్తిస్తుంది. అది కూడా బెయిల్ రెండు వైపులా స్వల్ప కదలిక ఉండాలి. బెయిల్స్లోని మైక్రోప్రాసెసర్ స్టంప్స్కు సంకేతాలను పంపుతుంది. అప్పుడు దానిలోని లైట్లు కూడా వెలుగుతాయి. ఆ తర్వాత వీటిని జింగ్ కంపెనీ తయారు చేయడం మొదలుపెట్టింది. 2012 బిగ్బాష్ లీగ్లో తొలిసారి జింగ్ స్టంప్స్ను, బెయిల్స్ను వాడారు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జింగ్ పేటెంట్ ఉన్న ఎలక్ట్రానిక్ క్రికెట్ వికెట్ వ్యవస్థకు ఆమెదముద్ర వేసింది. 2014 అండర్-19 ప్రపంచకప్లో దీనిని తొలిసారి ఐసీసీ వినియోగించింది. ఇక ఐపీఎల్లో 2016 నుంచి ఈ రకం స్టంప్స్ను వినియోగించడం మొదలుపెట్టారు.
ఇవి ఖరీదైనవేనా..
జింగ్ సంస్థ ఆట అవసరాలకు అనుగుణంగా పలు రకాలుగా స్టంప్స్ను తయారు చేస్తోంది. ఆయా స్థాయిలను బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. ఓ ఆంగ్లపత్రిక ప్రతినిధి ఈ సంస్థకు ఫోన్ చేసి ధర అడగ్గా.. కంపెనీ ప్రతినిధి కచ్చితంగా చెప్పలేదు. కానీ, ‘చౌకగా మాత్రం లభించవు’ అని పేర్కొన్నారు. దీనిపై జింగ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఈ వికెట్ల రూపకర్త బ్రాంటే ఎకెర్మెన్ మాట్లాడుతూ.. ‘‘వీటి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు ప్రతిసారి కచ్చితంగా పనిచేసేట్లు ఉండాలి. మేము వీటిల్లో అన్నిటిని పలు మార్లు పరీక్షించి స్టంప్స్ తయారు చేస్తాము. అందుకే కచ్చితంగా చౌకకాదు’’ అని పేర్కొన్నారు. బీసీసీఐ ఎంత చెల్లించిందన్నది కూడా గోప్యంగా ఉంచారు.
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో వాడే వికెట్ సెట్ ధర 40 వేల డాలర్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అదే స్థానిక క్రికెట్లకు వాడే సెట్ ధరలు కొన్ని వేలల్లోనే ఉంటాయని వెల్లడించారు. కానీ, ఈ రెండింటి నాణ్యత వేర్వేరుగా ఉంటుందని తెలిపారు. ఇకపోతే బీసీసీఐ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు బోర్డులు జింగ్ సంస్థ నుంచి నేరుగా వికెట్లను కొనుగోలు చేయకండా కేవలం అద్దెకు మాత్రమే తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంది.
గతంలో క్రికెట్ మ్యాచ్ గెలవగానే క్రీడాకారులు జ్ఞాపకం కోసం మ్యాచ్లో స్టంప్స్ను తీసుకొనేవారు. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. 2015 ప్రపంచకప్ మ్యాచ్లో ధోని సారథ్యంలో భారత్ సేన పాకిస్థాన్ను ఓడించింది. ఆ తర్వాత భారత సారథి ధోని తన అలవాటు ప్రకారం వికెట్ను తీసుకొంటుండగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ అడ్డుకొన్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం క్రీడాకారులు స్టంప్స్ను తీసుకోవడం అనేది క్రికెట్లో ఓ చరిత్రగా మిగిలిపోయిందన్నది స్పష్టమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కెరీర్ మలుపు తిరిగింది. -
ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. ఈసారి బెంగళూరును గెలిపించాడు..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇచ్చి బెంగళూరును గెలిపించాడు. -
Bengaluru Vs Punjab: సొంత మైదానంలో విజయం.. ఆనవాయితీని బెంగళూరు కొనసాగించేనా?
ఐపీఎల్లో బెంగళూరు రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్తో తలపడనుంది. -
Mumbai Indians: వరుసగా 12వ సారి.. ముంబయి తొలి మ్యాచ్ల చరిత్ర ఎలా ఉందంటే..?
ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆడిన తొలి మ్యాచ్లో గుజరాత్పై ఓటమిపాలైంది. ఇలా ఓటమితో సీజన్ను ప్రారంభించడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. -
IPL 2024: హోస్ట్ టీమే విన్నర్.. ‘ఫస్ట్’ బెస్ట్ వీరే!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఐదు మ్యాచుల్లో నాలుగు చివరి ఓవర్ వరకూ వెళ్లాయి.. -
Gujarat Vs Mumbai: పాత జట్టే పాండ్య ప్రత్యర్థి.. ‘నాన్-కెప్టెన్’ రోహిత్ ఏం చేస్తాడో?
ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. రాత్రి 7 గంటలకు ముంబయి, గుజరాత్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. -
Rajasthan vs Lucknow: లఖ్నవూతో మ్యాచ్.. యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగేనా?
సూపర్ సండేలో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలుత రాజస్థాన్ - లఖ్నవూ జట్లు జయపుర వేదికగా తలపడనున్నాయి. -
Cricket News: ఈసారైనా.. టైటిల్ కల నెరవేరేనా?
ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ కొనసాగుతోంది. తొలి ఎడిషన్ నుంచి ఆడుతున్న మూడు జట్లు మాత్రం ఒక్కసారి కూడా టైటిల్ను ముద్దాడలేకపోయాయి. -
Pat Cummins: కెప్టెన్ మారాడు.. హైదరాబాద్ కథ మారేనా?
కెప్టెన్ మార్పు జట్టు రాతను మారుస్తుందా? ఈ సీజన్లో సన్రైజర్స్ కథ సరికొత్తగా మొదలవుతుందా? నేడు కోల్కతాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
CSK vs RCB: ధోనీ పాత్ర ఏంటి..? ఆర్సీబీ వ్యూహమేంటి?
చెపాక్ వేదికగా సీఎస్కే-ఆర్సీబీ (CSK vs RCB) జట్ల మధ్య ఐపీఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది. -
IPL 2024: ఐపీఎల్లో ఎవరు బెస్ట్..? ఎందుకు?.. ‘గూగుల్ జెమిని’ ఏం చెప్పిందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యుత్తమ ప్లేయర్ల జాబితాను తీస్తే కొందరు ఉంటారు. అయితే.. గూగుల్ జెమిని ఏం చెప్పిందో తెలుసుకోండి.. -
IPL: ఐపీఎల్లో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు
ఐపీఎల్ (IPL) 2024 సీజన్కు మార్చి 22న తెర లేవనుంది. ఈ లీగ్లో ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు కొన్ని ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. -
IPL 2024: ఓవర్లో రెండు బౌన్సర్లు.. కొత్త నిబంధనలతో సరికొత్తగా ఐపీఎల్
ఐపీఎల్ 17వ సీజన్ను (IPL 2024) మరింత రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. మార్చి 22 నుంచి సీఎస్కే, ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్తో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. -
IPL 2024: ఐపీఎల్ టాప్ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!
ఐపీఎల్ (IPL) సందడి మొదలుకానుంది. అభిమానులకు క్రికెట్ మజాతోపాటు క్రికెటర్లు తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకునేందుకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది. -
IPL 2024: అందరి కళ్లూ వీరి పైనే.. ‘అన్క్యాప్డ్ ప్లేయర్ల’కు అవకాశం ఇస్తారా?
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండానే.. భారీ మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఐపీఎల్లో ఎలా ఆడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. అలాంటి వారిలో టాప్ ఎవరంటే? -
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు
గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. -
RCB: అమ్మాయిలు గెలిచారు.. ఇక వారి వంతు.. ఐపీఎల్లో ఏం చేస్తారో?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ ఏడాది శుభారంభం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) విజేతగా నిలిచి అదరగొట్టేసింది. -
Rishabh Pant: రిషభ్ పంత్ పటాకా పేలుతుందా?
టీ20లైనా, వన్డేలైనా, టెస్టులైనా.. ఫార్మాట్తో సంబంధం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్తో అలరించే రిషభ్ పంత్ (Rihabh Pant) మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. -
Virat Kohli: విరాట్ ఎదుట ఒక టోర్నీ.. టార్గెట్లు చాలా!
తన బ్యాటింగ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదని ప్రపంచానికి చెప్పడానికి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అద్భుతమైన వేదిక. అతడిపై రేకెత్తిన పలు సందేహాలను ఈ టోర్నీలో పటాపంచలు చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. -
Rohit Sharma: కెప్టెన్సీ లేని రోహిత్.. కోహ్లీలా రెచ్చిపోతాడా?
రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ ఐపీఎల్ (IPL 2024) సీజన్లో కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని అతడు.. తిరిగి బ్యాటింగ్లో ఒకప్పటి దూకుడును ప్రదర్శించాలని అభిమానులు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు