IPL 2023: ఐపీఎల్ స్టంప్స్ అంత ఖరీదా..!
ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు అర్ష్దీప్ చివరి ఓవర్లో ఇద్దరు ముంబయి బ్యాటర్లను ఔట్ చేశాడు. ఆ రెండు బంతులకు వికెట్లు విరిగిపోయాయి. దీంతో టోర్ని నిర్వాహకులకు లక్షల్లో నష్టం వాటిల్లిందని కథనాలు వెలువడ్డాయి. నిజంగా అంత ఖరీదైన వికెట్లు వాడుతున్నారా..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఐపీఎల్ (IPL 2023) టోర్నీలో పంజాబ్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ వేసిన చివరి ఓవర్.. ఐపీఎల్లో అత్యంత ‘ఖరీదైనది’గా మీడియా, నిపుణులు చెబుతున్నారు. ఖరీదంటే ఇక్కడ ఎక్కువ పరుగులు ఇవ్వడం కాదు.. రెండు వికెట్లు తీసుకోవడం..! అది కూడా యార్కర్లతో మిడిల్స్టంప్స్ను విరగ్గొట్టి మరీ విజయం అందించడం. ఆ విరిగిన స్టంప్స్ ధర ఎంత లేదన్నా లక్షల్లో ఉంటుంది. మీడియా మాత్రం ఐపీఎల్ నిర్వాహకులకు రూ.60 లక్షల వరకు నష్టం ఉంటుందని కథనాల్లో పేర్కొంది. అంటే ఈ లీగ్లో ముగ్గురు ఆటగాళ్ల కనీస ధరకు సమానం..!
క్రికెట్లో తొలిసారి రూల్స్ రాసుకొన్న 1744 సంవత్సరంలో కేవలం రెండు స్టంప్స్ మాత్రమే ఉండేవి. వాటిపై ఒక పెద్ద బెయిల్ పెట్టి ఆడేవారు. కానీ, బంతి రెండు స్టంప్స్ మధ్య నుంచి వెళ్లి.. బెయిల్ పడకుండా ఉన్న సందర్భాలు చోటుచేసుకున్నాయి. దీంతో 1775లో లంపీస్టీవెన్సన్ అనే వ్యక్తి తొలిసారిగా మూడు స్టంప్స్ను ఆటకు పరిచయం చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆ నియమం ఆటలో స్థిరపడిపోయింది. కాకపోతే చెక్కతో చేసిన ఈ స్టంప్స్, బెయిల్స్ అప్పుడప్పుడు బంతి తాకినా కిందపడేవి కాదు. దీంతో బ్యాటర్లు బతికిపోయేవారు. 2008లో ఆస్ట్రేలియాకు చెందిన బీబీజీ స్పోర్ట్స్ అనే కంపెనీ కెమెరాలను అమర్చిన స్టంప్స్ను పరిచయం చేసింది. ఆ తర్వాత సదరు కంపెనీని స్టంప్స్ కామ్ లిమిటెడ్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 2008 మార్చిలో జరిగిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్లో వీటిని తొలిసారి వినియోగించారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ గ్రేడ్ క్రికెటర్ బ్రాంటే ఎకెర్మెన్ తొలిసారి ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్ను తయారు చేశాడు. తన కుమార్తె వద్ద ఉన్న చిన్న ఆటబొమ్మను చూసి స్ఫూర్తి పొంది దీనిని రూపొందించారు. వీటిల్లో అమర్చిన సూక్ష్మమైన మైక్రోప్రాసెసర్ బెయిల్స్, స్టంప్స్ మధ్య కదలికలను సెకన్లో 1000వ వంతులో గుర్తిస్తుంది. అది కూడా బెయిల్ రెండు వైపులా స్వల్ప కదలిక ఉండాలి. బెయిల్స్లోని మైక్రోప్రాసెసర్ స్టంప్స్కు సంకేతాలను పంపుతుంది. అప్పుడు దానిలోని లైట్లు కూడా వెలుగుతాయి. ఆ తర్వాత వీటిని జింగ్ కంపెనీ తయారు చేయడం మొదలుపెట్టింది. 2012 బిగ్బాష్ లీగ్లో తొలిసారి జింగ్ స్టంప్స్ను, బెయిల్స్ను వాడారు. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జింగ్ పేటెంట్ ఉన్న ఎలక్ట్రానిక్ క్రికెట్ వికెట్ వ్యవస్థకు ఆమెదముద్ర వేసింది. 2014 అండర్-19 ప్రపంచకప్లో దీనిని తొలిసారి ఐసీసీ వినియోగించింది. ఇక ఐపీఎల్లో 2016 నుంచి ఈ రకం స్టంప్స్ను వినియోగించడం మొదలుపెట్టారు.
ఇవి ఖరీదైనవేనా..
జింగ్ సంస్థ ఆట అవసరాలకు అనుగుణంగా పలు రకాలుగా స్టంప్స్ను తయారు చేస్తోంది. ఆయా స్థాయిలను బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. ఓ ఆంగ్లపత్రిక ప్రతినిధి ఈ సంస్థకు ఫోన్ చేసి ధర అడగ్గా.. కంపెనీ ప్రతినిధి కచ్చితంగా చెప్పలేదు. కానీ, ‘చౌకగా మాత్రం లభించవు’ అని పేర్కొన్నారు. దీనిపై జింగ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఈ వికెట్ల రూపకర్త బ్రాంటే ఎకెర్మెన్ మాట్లాడుతూ.. ‘‘వీటి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు ప్రతిసారి కచ్చితంగా పనిచేసేట్లు ఉండాలి. మేము వీటిల్లో అన్నిటిని పలు మార్లు పరీక్షించి స్టంప్స్ తయారు చేస్తాము. అందుకే కచ్చితంగా చౌకకాదు’’ అని పేర్కొన్నారు. బీసీసీఐ ఎంత చెల్లించిందన్నది కూడా గోప్యంగా ఉంచారు.
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో వాడే వికెట్ సెట్ ధర 40 వేల డాలర్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. అదే స్థానిక క్రికెట్లకు వాడే సెట్ ధరలు కొన్ని వేలల్లోనే ఉంటాయని వెల్లడించారు. కానీ, ఈ రెండింటి నాణ్యత వేర్వేరుగా ఉంటుందని తెలిపారు. ఇకపోతే బీసీసీఐ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు బోర్డులు జింగ్ సంస్థ నుంచి నేరుగా వికెట్లను కొనుగోలు చేయకండా కేవలం అద్దెకు మాత్రమే తీసుకొనే అవకాశం ఎక్కువగా ఉంది.
గతంలో క్రికెట్ మ్యాచ్ గెలవగానే క్రీడాకారులు జ్ఞాపకం కోసం మ్యాచ్లో స్టంప్స్ను తీసుకొనేవారు. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. 2015 ప్రపంచకప్ మ్యాచ్లో ధోని సారథ్యంలో భారత్ సేన పాకిస్థాన్ను ఓడించింది. ఆ తర్వాత భారత సారథి ధోని తన అలవాటు ప్రకారం వికెట్ను తీసుకొంటుండగా అంపైర్ ఇయాన్ గౌల్డ్ అడ్డుకొన్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం క్రీడాకారులు స్టంప్స్ను తీసుకోవడం అనేది క్రికెట్లో ఓ చరిత్రగా మిగిలిపోయిందన్నది స్పష్టమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు