WI vs IND: భారత్కు గెలవాలి అనే కసి మరింత అవసరం: వెంకటేశ్ ప్రసాద్
వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు చాలా సాధారణ ఆటతీరు కనబర్చిందని టీమ్ఇండియా మాజీ ఫాస్ట్బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ టూర్ (WI vs IND)లో టెస్టు, వన్డే సిరీస్లను సునాయసంగా కైవసం చేసుకున్న టీమ్ఇండియా (Team India).. ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో మాత్రం తడబడుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై సిరీస్లో 0-2 తేడాతో వెనకబడి పోయింది. సిరీస్ చేజిక్కించుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. రెండో టీ20లో చివర్లో భారత్కు విజయం సాధించే అవకాశం వచ్చినా మరోసారి పట్టు విడిచి ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఆటతీరుపై భారత మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) బౌలర్లను వినియోగించుకున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) కూడా భారత జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ
‘‘విండీస్తో రెండో టీ20లో భారత్ చాలా సాధారణంగా ఆడింది. 2007 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఐపీఎల్ (2008లో) ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 7 సార్లు టీ20 ప్రపంచకప్ జరగ్గా.. మనం (భారత్) ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేకపోయాం. ఫైనల్కు ఒకేసారి చేరాం. భారత జట్టుకు గెలవాలి అనే కసి మరింత అవసరం’’ అని వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్లో రాసుకొచ్చాడు. రెండో టీ20లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలర్లను వినియోగించుకున్న తీరును కూడా వెంకటేశ్ ప్రసాద్ తప్పుబట్టాడు. కీలక సమయంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ను పోటీలోకి తెచ్చిన యుజువేంద్ర చాహల్తో పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి సమయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. వెస్టిండీస్, భారత్ మధ్య మూడో టీ20 ఆగస్టు 8న జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!