Tilak Varma: నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ
కెరీర్లో రెండో మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన తిలక్ వర్మ (Tilak Varma) అరుదైన ఘనత సాధించాడు. అలాగే తొలి అర్ధ శతకాన్ని చిన్నారి సమైరాకి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ సమైరా ఎవరంటే?
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్పై టీ20లతో (WI vs IND) అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన హైదరాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలవడం గమనార్హం. మొదటి టీ20 మ్యాచ్లో 39 పరుగులు చేసిన తిలక్.. రెండో మ్యాచ్లో కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ (51) మార్క్ను తాకాడు. అయితే, రెండు మ్యాచుల్లోనూ టీమ్ఇండియా (Team India) ఓడిపోయినప్పటికీ అతడి ఇన్నింగ్స్లు మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తన తొలి హాఫ్ సెంచరీని కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి (Samaira) అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. దీనికిగల కారణం ఏంటో కూడా వెల్లడించాడు.
నాతో సహా.. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలి: హార్దిక్
‘‘రోహిత్ శర్మ - రితికా దంపతుల కుమార్తె సమైరాకి నా తొలి అర్ధశతకం అంకితం చేస్తున్నా. ముంబయి జట్టుతో ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో సమైరాతో అనుబంధం ఏర్పడింది. అంతర్జాతీయ కెరీర్లో నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని అంకితం ఇస్తానని తనకు ప్రామిస్ చేశా. ఇప్పుడు సంబరాలను ఆమెతో చేసుకుంటా’’ అని తిలక్ తెలిపాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డులకెక్కాడు. ఈ ఘనతను కేవలం 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అందుకున్నాడు. రోహిత్ శర్మ ఈ ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో సాధించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.