WI vs IND: విండీస్తో రెండో టీ20.. అతడికి అవకాశం వచ్చేనా?
వెస్టిండీస్ - భారత్ జట్ల మధ్య (WI vs IND) ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో ఓడిపోవడంతో సిరీస్ రేసులో వెనుకబడింది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి పుంజుకోవాలని టీమ్ఇండియా చూస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో ఐదు టీ20ల సిరీస్ను (WI vs IND) భారత్ ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20 మ్యాచ్లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయంపాలైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో డెబ్యూ బ్యాటర్ తిలక్ వర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు విఫలమై నిరాశపరిచారు. దీంతో రెండో టీ20 విజయం సాధించి సిరీస్ రేసులోకి రావాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉంది. మరి ఎవరిని ఉంచుతారు? పక్కన పెట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ఎవరు? కీలక విషయాలపై ఓ లుక్కేద్దాం..
అప్పటి వరకూ ఆడాలని ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
మూడో వన్డే మ్యాచ్లో చెలరేగి ఆడిన ఓపెనర్లు విండీస్తో తొలి టీ20లో మాత్రం తేలిపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ విఫలమైన క్రమంలో ఓపెనింగ్ స్థానాలు మారే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్ ఇషాన్కిషన్ను పక్కన పెట్టి ఐపీఎల్లో సంచలన ఆటతీరు ప్రదర్శించి.. టెస్టు అరంగేట్రంలోనే భారీ శతకంతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్కు స్థానం దక్కే అవకాశం ఉంది. అప్పుడు శుభ్మన్ గిల్తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. తొలి టీ20లో సంజూ శాంసన్ మెరుగ్గా ఆడలేకపోయాడు. అయినా రెండో టీ20లో అవకాశం ఇవ్వొచ్చు. మిగతా బ్యాటర్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండవు.
బౌలర్ల విషయంలో..
స్పిన్కు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉండటంతో సమస్యలు లేవు.. కానీ వారిని కెప్టెన్ హార్దిక్ పాండ్య వినియోగించుకున్న తీరే సరిగా లేదు. ఒకే ఓవర్లో కీలక వికెట్లను తీసిన చాహల్ను ఎనిమిది ఓవర్లపాటు బౌలింగ్కు ఆపాడు. అతడినే కంటిన్యూ చేయించి బౌలింగ్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్తో కూడిన స్పిన్ విభాగం పటిష్ఠంగానే ఉంది. అయితే, అక్షర్ పటేల్ బౌలింగ్లో విఫలమైనప్పటికీ.. బ్యాటింగ్లో కాస్త ఫర్వాలేదనిపించాడు. రిజర్వ్ బెంచ్పై వన్డేల్లో ప్రభావం చూపిన ముకేశ్ కుమార్ ఈసారి రాణించలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో ఉమ్రాన్ లేదా అవేశ్ ఖాన్ను బరిలోకి దింపినా ఆశ్చర్యం లేదు.
వారిద్దరితో జాగ్రత్త..
తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రోవ్మన్ పావెల్ కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మిగతా బ్యాటర్లలో ఓపెనర్ కేల్ మేయర్స్, హెట్మయేర్ డేంజరస్ ఆటగాళ్లు. వీరు క్రీజ్లో కుదురుకుంటే మాత్రం భారీ షాట్లు కొట్టేస్తారు. రెండో టీ20లో వీరితోనూ భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్పిన్కు అనుకూలంగా ఉన్న పిచ్పై కేవలం ఒక్క స్పిన్నర్తోనే బరిలోకి దిగినా విండీస్ విజయం సాధించింది. నలుగురు పేసర్లు కలిసి భారత బ్యాటర్లకు అడ్డుకట్ట వేశారు.
పిచ్, వాతావరణం
గయానాలో పిచ్ కూడా భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. తొలి మ్యాచ్లోలాగే స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. వెస్టిండీస్ చివరిసారి ఇక్కడ ఆడిన మ్యాచ్లో స్పిన్ చాలా కీలక పాత్ర పోషించింది. బంగ్లాతో జరిగిన ఆ వన్డే మ్యాచ్లో బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత టీ20లో తలపడ్డప్పుడూ అంతే. ఈ నేపథ్యంలో రెండో టీ20లో భారీ స్కోర్లు సందేహమే. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ గయానా వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ను వీక్షించాలంటే జియో సినిమా, ఫ్యాన్కోడ్ ఓటీటీలతోపాటు దూరదర్శన్ టీవీలో చూసే అవకాశం ఉంది.
తుది జట్లు
భారత్: శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్ / ఉమ్రాన్ మాలిక్
విండీస్: కేల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ ఛార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మయెర్, రోవ్మన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెఫెర్డ్, అకీస్ హుసేన్, అల్జారీ జోసెఫ్, ఓబెద్ మెకాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా, ముంబయి జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. -
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
41 ఏళ్ల ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్తో తనకు బలమైన బంధం ఉందని గంభీర్ వెల్లడించాడు. ఏ నిర్ణయం తీసుకొన్నా జట్టు శ్రేయస్సు కోసమేనని అతడు నమ్ముతాడన్నాడు. -
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారు. అతడు కూడా వారిని నిరాశపర్చకుండా దూకుడుగా ఆడేస్తున్నాడు. -
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తున్న క్రమంలో ముంబయి బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ సారథి అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. -
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
ఐపీఎల్ 17వ సీజన్లో వేటు ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడటంతో సస్పెన్షన్ తప్పలేదు. -
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు.