BANW vs INDW: బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం

బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది.

Published : 28 Apr 2024 19:30 IST

సిల్హెట్‌: బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సిల్హెట్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. షెఫాలీ వర్మ(31), యస్తికా భాటియా (36), హర్మన్‌ ప్రీత్‌(30), రిచా ఘోష్‌(23) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన బంగ్లా బ్యాటర్లను టీమ్‌ఇండియా బౌలర్లు ఏ దశలోనూ కుదురుకోనివ్వలేదు. రేణుకా ఠాకూర్‌ 3, పూజా వస్త్రాకర్‌ 2 వికెట్లతో విజృంభించడంతో.. ప్రత్యర్థి జట్టు 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు సారథి నిగర్‌ సుల్తానా (51) ఒక్కరే పోరాడినా ఫలితం లేకపోయింది. రేణుకా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచారు. రెండో టీ20 ఈ నెల 30న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని