IPL 2023: ఢీ అంటున్న దిల్లీవాలాలు..!
ఇద్దరూ దిల్లీ వాలాలే.. పాక్తో మ్యాచ్ అంటే వీరిద్దరూ కదం తొక్కాల్సిందే.. మైదానంలో దూకుడులోనూ ఏమాత్రం తగ్గరు. విజయం కోసం చివరి వరకు పోరాడటంలో వెనుకంజ వేయరు. ఇన్ని సారూప్యతలున్న ఇద్దరూ విరోధుల వలే ప్రవర్తించి ఐపీఎల్ జరిమానాకు గురయ్యారు.
ఇంటర్నెట్డెస్క్ : గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), కోహ్లీ (Virat Kohli) ఇద్దరూ దిల్లీ నుంచి వచ్చిన వారే. దూకుడులో ఏమాత్రం తగ్గని ఆటగాళ్లు.. మైదానంలో విజయమే ఊపిరిగా పోరాడుతారు. వీరిద్దరి మధ్య ఒకప్పుడు అద్భుతమైన మధురజ్ఞాపకాలు ఉన్నాయి. ఓ సందర్భంలో గంభీర్ తనకు వచ్చిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును జూనియర్ అయిన కోహ్లీకి ఇవ్వాలని వేదికపైనే కోరాడు. 2009లో శ్రీలంకతో జరిగిన వన్డేలో వీరిద్దరు కలిసి 224 పరుగుల భాగస్వామ్యాన్ని జట్టుకు అందించారు. ఆ మ్యాచ్లో శ్రీలంక విసిరిన 316 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించింది. గంభీర్ 150 పరుగులు చేయగా.. కోహ్లీ 114 బంతుల్లో 107 పరుగులు బాదాడు. వన్డేల్లో విరాట్ తొలి శతకం అది. కోహ్లీ ఎంతో ప్రతిభావంతుడని.. భవిష్యత్తులో 100 శతకాలు పూర్తి చేస్తాడని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పటికే గంభీర్ జట్టులో సీనియర్ ఆటగాడు. 2007 టీ20 ప్రపంచకప్లో 54 బంతుల్లో 75 పరుగులు చేసి భారత్కు విజయాన్ని అందించాడు. అటువంటి అద్భుతమైన అనుబంధం ఉన్న ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
- 2013లో ఓ ఐపీఎల్ మ్యాచ్ ఈ బంధాన్ని బీటలు వార్చింది. ఆ ఏడాది బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ-కేకేఆర్ జట్లు తలపడ్డాయి. ఆర్సీబీకి కోహ్లీ నాయకత్వం వహించగా.. కేకేఆర్కు గంభీర్ కెప్టెన్గా ఉన్నాడు. ఆర్సీబీ విజయానికి 11 ఓవర్లలో 80 పరుగులు అవసరమైన సమయంలో కేకేఆర్ బౌలర్ బాలాజీ బంతికి కోహ్లీ ఔటయ్యాడు. దీంతో కేకేఆర్ ఆటగాళ్లు సంబరాలు చేసుకొన్నారు. గౌతమ్ గంభీర్ వైపు నుంచి ఏవో కామెంట్లు వినిపించగానే డగౌట్కు వెళుతున్న కోహ్లీ ఒక్కసారిగా భగ్గుమన్నాడు. ఆ సమయంలో కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం నడిచింది. అక్కడే ఉన్న రజత్ భాటియా, ఇతర ఆటగాళ్లు, అంపైర్లు వారిని శాంతింపజేశారు.
- 2016లో మరోసారి వీరిద్దరి మధ్య ఐపీఎల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఏడాది ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 183 పరుగులు సాధించింది. గంభీర్ 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ విజయం దిశగా సాగుతోంది. అప్పటికే కోహ్లీ క్రీజులోనే ఉన్నాడు. 19వ ఓవర్లో కోహ్లీ పరుగు తీసి నాన్స్ట్రైకర్ వైపు చేరుకోగా.. గంభీర్ దూకుడుగా బంతిని అతడివైపు విసిరాడు. ఈ ఘటన మరోసారి వివాదానికి కారణమైంది. ఈ మ్యాచ్లో కోహ్లీ 51 బంతుల్లో 75 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకొన్నాడు.
- గతేడాది దాదాపు 1,020 రోజుల తర్వాత విరాట్ అంతర్జాతీయ శతకం సాధించడంపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ స్థానంలో మరెవరైనా జట్టులో ఉండి.. మూడేళ్లు శతకం సాధించకపోతే అతడు జట్టులో కొనసాగేవాడు కాదు’’ అని వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యాతగా మారిన తర్వాత కూడా గంభీర్ చాలా సార్లు విరాట్ విషయంలో ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు.
- అయితే, తమ మధ్య వ్యక్తిగత వైరం లేదని.. కేవలం మ్యాచ్ వరకే దూకుడుతనం పరిమితమని గంభీర్ 2016లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైదానం బయట విరాట్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నాడు. మరో వైపు మంగళవారం ఉదయం కోహ్లీ (Virat Kohli) తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘మనం వినేదంతా అభిప్రాయం మాత్రమే.. వాస్తవం కాదు. మనం చూసేదంతా దృష్టికోణం మాత్రమే.. నిజం కాదు’’ అని మార్క్స్ అరిలియస్ (రోమన్ చక్రవర్తి) అన్న మాటలను విరాట్ పోస్ట్ చేశాడు. దీంతో గంభీర్ (Gautam Gambhir)తో వాగ్వాదానికి సంబంధించి సోషల్మీడియాలో వైరల్ అవుతున్న కథనాలకు సమాధానంగానే కోహ్లీ ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్