Team India: అతడే మ్యాచ్ను 50% గెలిపిస్తాడు.. యశస్వి అద్భుతమే కానీ...: కైఫ్
ఇప్పుడంతా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) మీదనే చర్చ. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే, సీనియర్లు విరాట్, రోహిత్ లేకుండానే పాండ్య నాయకత్వంలో తలపడుతోంది.
రాహుల్, శ్రేయస్ పునరాగమనం చేస్తే...
వెస్టిండీస్ పర్యటనలో (WI vs IND) యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన ఇస్తున్నారని భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ (Kaif) అభినందించాడు. అయితే, వచ్చే వన్డే ప్రపంచకప్లో మాత్రం యువకులు కాకుండా సీనియర్లతోనే బరిలోకి దిగితే బాగుంటుందని సూచించాడు. స్టార్ పేసర్ బుమ్రా (Bumarh) తిరిగి పుంజుకొని వస్తే టీమ్ఇండియాకు లాభిస్తుందని పేర్కొన్నాడు. అతడే మ్యాచ్ విన్నర్గా అభివర్ణించాడు. జట్టులో బుమ్రా ఉంటే సగం మ్యాచ్ను అతడే గెలిపిస్తాడని కైఫ్ వ్యాఖ్యానించాడు.
‘‘వెస్టిండీస్తో భారత్ వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోవడం వల్ల నష్టమేం లేదు. దానిపై చర్చ కూడా అనవసరం. సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ స్పందనలను చూశా. అయితే, వీటన్నింటితో సంబంధం లేకుండా మన జట్టు అద్భుతంగా ఆడిందని మాత్రం చెప్పగలను. కీలక ఆటగాళ్లు లేకుండానే విండీస్ జట్టుతో పోరాడుతోందని గమనించాలి. ఇక వరల్డ్ కప్ నాటికి సీనియర్ బౌలర్ బుమ్రా ఫిట్నెస్ సాధిస్తే భారత్కు ఎంతో ప్రయోజనం. అతడు ఉంటే టీమ్ఇండియా 50% మ్యాచ్ గెలిపించేస్తాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి పునరాగమనం చేస్తే భారత్ బలంగా మారుతుంది. మరోవైపు కొత్త ప్లేయర్లు కూడా చోటు కోసం రేసులో ఉన్నారు. మరీ ముఖ్యంగా యశస్వి జైస్వాల్ అద్భుత ప్రతిభ కలిగిన ఆటగాడు. ఇషాన్ కిషన్ కూడా ఉన్నప్పటికీ అతడికి కూడా కష్టమే అవుతుంది’’ అని కైఫ్ తెలిపాడు.
కనీసం పిచ్పై గ్రాస్ లేదు.. నెట్స్ కూడా పాతవే: అశ్విన్
వారి వ్యూహం అదే: అశ్విన్
‘‘వన్డే ప్రపంచ కప్లో భారత్ను టార్గెట్ చేస్తూ ఫేవరేట్ జట్టుగా చెబుతుంటారు. ఇదంతా కొందరు ప్రదర్శించే వ్యూహం. వారి జట్ల మీద ఉన్న ఒత్తిడిని తగ్గించి టీమ్ఇండియాపై దృష్టి పడేలా చేస్తుంటారు. ప్రతి ఐసీసీ ఈవెంట్కు ముందు ఇదే తంతు. ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా పటిష్ఠంగా ఉంది. కాబట్టి, ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఇక మెగా టోర్నీల సందర్భంగా అభిమానుల కోలాహలం భారీగా ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ పట్ల ఆసక్తిని వారే మార్చేస్తుంటారు. ఈసారి వన్డే ప్రపంచ కప్ మన దగ్గరే జరగనుంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చే క్రికెటర్లను సాదరంగా స్వాగతించాలి. మన ఆతిథ్యం అద్భుతంగా ఉండాలి’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
ద్రవిడ్ నుంచి హార్దిక్కు ఇంకాస్త సహకారం: పార్థివ్
‘‘ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను సమర్థవంతంగా నడిపించిన హార్దిక్కు విండీస్ పర్యటనలో చేదు అనుభవం ఎదురవుతోంది. తప్పిదాలు చేయడంతో జట్టు ఓటములను చవిచూడాల్సి వస్తోంది. గుజరాత్ తరఫున ఆడేటప్పుడు ఆశిశ్ నెహ్రా మద్దతుగా ఉండేవాడు. బౌలింగ్ విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ నడిపించేవాడు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ నుంచి కూడా ఇలాంటి మద్దతే హార్దిక్కు కావాలి. టీ20ల్లో క్షణంలోనే ఫలితం మారిపోతూ ఉంటుంది. ఒక్క పొరపాటు చేసినా ఓటమి చూడాల్సిన పరిస్థితి’’ అని పార్థివ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్