Ashwin on windies Stadiums: కనీసం పిచ్పై గ్రాస్ లేదు.. నెట్స్ కూడా పాతవే: అశ్విన్
వెస్టిండీస్ మైదానాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) విమర్శలు చేశాడు. మరింత మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ‘మేం విలాసాలు కోరుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించండి చాలు’.. ఇదీ అని వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) చేసిన విన్నపం. ఇదే అంశంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించాడు. అశ్విన్ కూడా విండీస్తో టెస్టు సిరీస్లో (WI vs IND) ఆడిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సరైన వసతులు కల్పించడంలో విఫలమైందని, మైదానాల్లో మౌలిక సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నాడు.
‘‘వెస్టిండీస్లో క్రికెట్ వృద్ధి చెందాలంటే తొలుత మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. అండర్-10, అండర్-12, అండర్-14 ఆటగాళ్లకు కూడా మంచి నెట్స్, మైదానం ఉండేలా చూడాలి. అప్పుడే వారిలో ఆసక్తి పెరిగి క్రికెట్ ఆడేందుకు ముందుకొస్తారు. ఇది టాలెంట్తో కూడిన గేమ్. బాగా శ్రమించాలి. అయితే మైదానాల్లో మౌలిక సదుపాయాలు అత్యంత అవసరం. వెస్డిండీస్ భౌగోళికంగా విభిన్నంగా ఉంటుంది.
ఆ వరల్డ్ కప్ మ్యాచ్లను చూడొద్దనుకున్నా.. కానీ: రోహిత్
బార్బడోస్లో టెస్టు మ్యాచ్ సందర్భంగా నెట్స్లో ప్రాక్టీస్ చేశాం. కనీసం పచ్చిక కూడా లేదు. ఆ నెట్స్ కూడా చాలా పాతవి. అయితే, నేను ఇలా చెప్పడానికి కారణం మాత్రం తప్పుబట్టడానికి కాదు. మౌలిక వసతులు నాసికరంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు విండీస్ ఆటగాళ్లు కూడా ఎంతని కష్టపడాలి? ఇలాంటి పిచ్ల పై ప్రాక్టీస్ చేసిన తర్వాత.. వారు భారత్ వంటి మంచి పిచ్లపై ఆడేందుకు అవస్థ పడతారు. ఆ పరిస్థితులకు అలవాటు పడటం కష్టమవుతుంది. విండీస్ పిచ్లు చాలా మందకొడిగా ఉంటాయి. మైదానాల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. అయితే, విండీస్లో మాత్రం పచ్చికను తొలగించి రోలర్తో అటు ఇటూ తిప్పేసి అదే నిర్వహణగా భావిస్తున్నారు. ఈ విషయంపై టెస్టు సిరీస్ సందర్భంగానూ మాట్లాడా. అలా చేయడం చాలా సులువే. కానీ పిచ్ నిర్జీవంగా మారి మందకొడిగా ఉంటుంది’’ అని అశ్విన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
-
హైవేపై తుపాకితో రీల్..వివాదంలో యూట్యూబర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు