Wrestlers Protest: ‘మోదీజీ.. మా మన్ కీ బాత్ కూడా వినండి’: మహిళా రెజ్లర్లు
మహిళా రెజ్లర్ల బాధను చెప్పుకునేందుకు తమకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ (PM Modi)కి విజ్ఞప్తి చేశారు. మా ఆవేదన పెద్దలకు చేరడం లేదనకుంటా.. అందుకే మేమంతా ప్రధానిని కలిసి మా బాధను చెప్పాలనుకుంటున్నామని అన్నారు.
దిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)పై కేను నమోదు చేయాలని కోరుతూ ఏడుగురు మహిళా రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అతనిని అరెస్ట్ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే వీరంతా ప్రధాని మోదీని కలిసి తమ బాధను వివరిస్తామని తెలిపారు.
‘‘ ప్రధాని మోదీ సార్ మీరు బేటీ బచావ్.. బేటీ బచావ్ గురించి చెబుతారు. మన్ కీ బాత్ (Mann Ki Baat) ద్వారా అందరితో మాట్లాడుతారు. అలానే మా మన్ కీ బాత్ కూడా వినలేరా?. దేశం కోసం పతకాలు సాధించిన సమయంలో మమ్మల్ని ఇంటికి ఆహ్వానించారు. ఈ రోజు మా బాధ చెప్పుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ (Sakshi Malik) కోరారు. నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వినేశ్ ఫొగట్ (Vinesh Phogat) ప్రశ్నించారు. మా ఆవేదన పెద్దలకు చేరడం లేదనకుంటా.. అందుకే మేమంతా ప్రధానిని కలిసి మా బాధ వ్యక్తం చేయాలనుకుంటున్నామని అన్నారు.
‘‘శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను భోజనం కూడా సిద్ధం చేసుకోనివ్వడంలేదు. బ్రిజ్ భూషణ్ పరపతి గురించి చెప్పి మమ్మల్ని కొందరు భయపెట్టాలని చూస్తున్నారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదు. క్రీడాకారులుగా ఐకమత్యంగా రెజ్లర్లకు మద్దతు పలకాలని కోరుతున్నాం’’ అని బజరంగ్ పునియా (Bajaran Punia) విజ్ఞప్తి చేశారు. మరోవైపు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దిల్లీ పోలీసులకు (Delhi Police) నోటీసులిచ్చింది. దీనిపై దిల్లీ పోలీసులు స్పందిస్తూ.. కేసు నమోదుకు ముందు కొంత ప్రాథమిక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ