Virat Kohli: కోహ్లీతో పెట్టుకోవద్దు.. కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్: రవిశాస్త్రి
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీతో పెట్టుకోవద్దని, అతడు తిరిగి ఫామ్ అందుకున్నాడని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు...
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీతో పెట్టుకోవద్దని, అతడు తిరిగి ఫామ్ అందుకున్నాడని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. విరాట్ తన ఆటతో విమర్శకులందరికి సమాధానం చెప్పాడన్నాడు. గతరాత్రి గుజరాత్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ (73; 54 బంతుల్లో 8x4, 2x6) ధాటిగా ఆడి అందర్నీ అలరించిన సంగతి తెలిసిందే. చూడచక్కని షాట్లతో గుజరాత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన అతడు క్రీజులోనూ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. దీంతో కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ ప్రపంచానికి చాటిచెప్పాడని శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
‘కోహ్లీ ఏంటో నిరూపించుకున్నాడు. అదృష్టంకొద్దీ బెంగళూరు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి అతడి ఆటను చూడొచ్చు. ఒకవేళ దిల్లీతో వెనుకబడితే మనమంతా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ ఆటతో కేవలం తన విమర్శకులకే కాకుండా ప్రపంచానికి కూడా తనతో పెట్టుకోవద్దని చాటి చెప్పాడు. ఆటలో సత్తా ఉంటే కుర్రాళ్లు ఎలా ఆడాలో అదే నేర్పిస్తుంది’ అని ఓ క్రీడా ఛానల్తో అన్నాడు. కాగా, ఇటీవలే కోహ్లీ ప్రదర్శనపై స్పందించిన రవిశాస్త్రి కొంత కాలం అతడిని విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. అయితే, ఇదే విషయాన్ని విరాట్ కూడా తాజాగా ప్రస్తావించాడు. గుజరాత్తో మ్యాచ్కు ముందు హర్భజన్సింగ్తో మాట్లాడిన సందర్భంగా శాస్త్రి చేసిన వ్యాఖ్యలను విరాట్ గుర్తుచేసుకున్నాడు. తనను రవిశాస్త్రి చాలా దగ్గరి నుంచి చూశాడని, ఆయన మాటలను పరిగణనలోకి తీసుకొని విశ్రాంతి తీసుకునేందుకు ఆలోచిస్తానన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!