Team India: సూర్యపై నమ్మకముంది.. పాండ్య ధోనీ కానక్కర్లేదు.. భారత్పై ఒత్తిడి ఎక్కువే!
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) నాలుగో స్థానంలో బరిలోకి దిగే ఆటగాడు ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అలాగే టీమ్ఇండియాను ఒత్తిడికి గురి చేసేలా ప్రత్యర్థులు మాటల వ్యూహం మొదలుపెట్టేశారు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్డిండీస్తో మూడో టీ20 మ్యాచ్లో (WI vs IND) కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) భారత్ను గెలిపించాడు. నేడు విండీస్తో నాలుగో మ్యాచ్ కోసం భారత్ సిద్ధమవుతోంది. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య వన్డేల్లో మాత్రం గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో వచ్చే వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) జట్టులో స్థానం దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సూర్యకుమార్పై నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
Ambati Rayudu: కరీబియన్ లీగ్లో రాయుడు
‘‘వన్డేల్లో రాణించడానికి సూర్య చాలా కష్టపడుతున్నాడు. దీనికోసం సీనియర్లతో తరచూ మాట్లాడుతూ సలహాలు తీసుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి పరుగులు చేయడం మొదలుపెడితే అద్భుతంగా ఆడేస్తాడు. దానికి ఉదాహరణగా గత ఐపీఎల్లో తొలి నాలుగైదు మ్యాచుల్లో పెద్దగా పరుగులు చేయలేదు. కానీ, ఆ తర్వాత చెలరేగుతూ హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే వన్డేల్లోనూ కాస్త కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్లు ఆడేయగలడు. అందుకే ఇలాంటి ఆటగాడికి మద్దతు అందించడం మా బాధ్యత. ఒకటీ రెండు మ్యాచుల్లో రాణించకపోయినా ఫర్వాలేదు. మ్యాచ్లను ఎలా గెలవాలనేది మిగతా ఆటగాళ్లకు తెలుసు. మూడో టీ20లో సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అయితే వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
అలా ఎందుకు ఆలోచిస్తారు? : ఆకాశ్ చోప్రా
మూడో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్య సిక్స్ కొట్టడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధోనీతో పోలుస్తూ ట్రోలింగ్ చేశారు. ఒక మ్యాచ్లో ధోనీకి విన్నింగ్ షాట్ కొట్టే అవకాశం వచ్చినా విరాట్ కోహ్లీకి ఛాన్స్ ఇచ్చి మరీ అందరితో ప్రశంసలు అందుకొన్నాడు. కానీ, హార్దిక్ మాత్రం చాలా బంతులు మిగిలి ఉన్నప్పటికీ సింగిల్ ఇద్దామనే ఆలోచన చేయకపోవడం గమనార్హం. తాజాగా ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘‘ధోనీని మార్గదర్శకంగా భావించే హార్దిక్ పాండ్య.. అతడిలా కానక్కర్లేదు. అసలు టీ20ల్లో మైలురాళ్లు గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచన ఉంటుంది. గతంలో ధోనీ డిఫెన్స్ ఆడి మరీ విన్నింగ్ షాట్ను కొట్టే అవకాశం విరాట్కు ఇచ్చిన సంఘటన నాకు గుర్తుంది’’ అని చోప్రా తెలిపాడు.
స్వదేశంలో వరల్డ్ కప్.. అంచనాలు అధికం: పాక్ మాజీ పేసర్
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ కోసం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. అయితే, టీమ్ఇండియాను ఒత్తిడికి గురి చేసేలా ప్రత్యర్థి జట్ల మాజీ క్రికెటర్లు తమ వ్యాఖ్యలకు పదును పెడుతూనే ఉన్నారు. పాకిస్థాన్ మాజీ పేసర్ సర్ఫరాజ్ నవాజ్ కూడా భారత్ కంటే తమ జట్టే నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పటికీ భారత్ జట్టు కాంబినేషన్ కుదరలేదు. ఆసియా కప్ మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అయినా, టీమ్ఇండియా మిడిలార్డర్లో ఎవరు ఉంటారు? ఎవరు ఆడతారు? అనే విషయాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కెప్టెన్లు మారుతూ వస్తున్నారు. ఆటగాళ్ల కాంబినేషన్ ఇంకా కుదరలేదు. కొత్త ప్లేయర్లను ప్రయత్నిస్తున్నారు. అలాగే ఐసీసీ ట్రోఫీని నెగ్గి పదేళ్లవుతుందనే విషయం కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్వదేశంలో జరగనుండటం కూడా అదనపు ఒత్తిడికి గురి చేస్తుంది. అయితే, కొందరు సీనియర్ ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉండటం భారత్కు కలిసిరానుంది’’ అని నవాజ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం