Ambati Rayudu: కరీబియన్‌ లీగ్‌లో రాయుడు

టీమ్‌ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు అంబటి రాయుడు కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ఆడనున్నాడు.

Updated : 12 Aug 2023 09:13 IST

ముంబయి: టీమ్‌ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు అంబటి రాయుడు కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో ఆడనున్నాడు. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియట్స్‌తో అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రవీణ్‌ తంబె తర్వాత ఈ లీగ్‌లో పాల్గొంటున్న రెండో భారత ఆటగాడు రాయుడే. ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన 37 ఏళ్ల రాయుడు.. అమెరికాలో నిర్వహించిన మేజర్‌ క్రికెట్‌ లీగ్‌ (ఎంఎల్‌సీ)లో సీఎస్కేకు చెందిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌కు ఆడేందుకు సంతకం చేశాడు. అయితే భారత క్రికెటర్లు రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే విదేశీ లీగ్‌లలో ఆడకుండా నిర్ణీత కాల వ్యవధి విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించడంతో ఎంఎల్‌సీకి రాయుడు దూరంగా ఉన్నట్లు తెలిసింది. కానీ ఈ విషయంపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని