HBD GANGULY: ‘ఫియర్లెస్’ కెప్టెన్.. హ్యాపీ బర్త్డే గంగూలీ భాయ్!
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పుట్టిన రోజు నేడు. తన కెప్టెన్సీతో భారత జట్టును పటిష్ఠంగా మార్చిన గంగూలీ క్రికెట్ జర్నీ ఇలా..
భారత క్రికెట్ గమనాన్ని మార్చిన ఘనత సౌరభ్ గంగూలీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు టీమ్ఇండియా ఆటతీరు కాస్త నెమ్మదిగా ఉండేది. ఇక గంగూలీ సారథిగా వచ్చిన తర్వాత దూకుడు మంత్రంతో దూసుకెళ్లింది. ప్రత్యర్థులు సై అంటే.. తాను కూడా సై సై అంటూ జట్టును ముందుండి నడిపించాడు. టాలెంటెడ్ యువకులను ప్రోత్సహించడంలోనూ వెనుకడుగు వేసేవాడు కాదు. అలాంటి గంగూలీ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగానూ సేవలందించాడు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా మారిన సౌరభ్ గంగూలీ 51వ బర్త్డే నేడు. ఈ సందర్భంగా అతడి క్రికెట్ ప్రయాణంపై ఓ కన్నేద్దాం..
అన్నయ్య ప్రోద్బలంతోనే..
(ఫొటో సోర్స్: ట్విటర్)
వాస్తవానికి గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టంలేదు. అయితే, అన్నయ్య స్నేహశీష్ గంగూలీ అప్పటికే మంచి పేరున్న బెంగాల్ క్రికెటర్. అతడి ప్రోత్సాహంతోనే గంగూలీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 1990-91 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు. ఫలితంగా వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. ఆడిన ఏకైక మ్యాచ్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి దేశవాళీ క్రికెట్లో ఆడి రాణించాడు. 1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 171 పరుగులు చేయడంతో మరోసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లాండ్తో జరిగిన లార్డ్స్ టెస్టులో రాహుల్ ద్రవిడ్తో కలిసి గంగూలీ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో 131 పరుగులు సాధించి.. లార్డ్స్లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన మూడో మ్యాచ్లో కూడా శతకం బాదాడు. సచిన్తో కలిసి 255 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో నాటి నుంచి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు.
అదొక విప్లవం..
సచిన్ తరవాత వన్డే కెప్టెన్సీ బాధ్యతలను దాదా స్వీకరించాడు. తొలి సిరీస్లోనే బలమైన దక్షిణాఫ్రికాను 3-2 తేడాతో టీమ్ఇండియా ఓడించింది. ఆ తరవాత నాట్వెస్ట్ సిరీస్ విజయం గంగూలీ కెరీర్లోనే గొప్ప ఘనత. శ్రీలంక, ఇంగ్లాండ్, టీమ్ఇండియా తలపడిన ఈ ముక్కోణపు సిరీస్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. లార్డ్స్లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు ఓపెనర్గా వచ్చిన గంగూలీ 43 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. సెహ్వాగ్తో కలిసి తొలి వికెట్కు 106 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమ్ఇండియా మిడిలార్డర్ వైఫల్యంతో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే కైఫ్ (87*), యువరాజ్ (69) ఆదుకున్నారు. యువీ జట్టు స్కోరు 267 పరుగుల వద్ద ఔట్ అయ్యాక కైఫ్ లోయర్ఆర్డర్తో కలిసి పోరాటం చేశాడు. దీంతో భారత్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకున్నాక డ్రెస్సింగ్ రూమ్ బయట నుంచి దాదా చొక్కవిప్పి గాల్లో తిప్పిన దృశ్యం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
(ఫొటో సోర్స్: ట్విటర్)
2003 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా దాదా నాయకత్వంలో అండర్డాగ్స్గా బరిలోకి దిగింది. అయితే, అనూహ్య ప్రదర్శనతో మేటి జట్లను ఓడించి ఫైనల్స్కు చేరింది. అయితే, అక్కడ ఆస్ట్రేలియా దూకుడు ముందు నిలవలేకపోయింది. ఈ ఓటమి ప్రతి అభిమానిని కలచివేసింది. ఈ మ్యాచ్ తర్వాత అభిమానులు టీవీలు బద్దలు కొట్టిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే, గంగూలీ మాత్రం తన జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు. 2002లో దాదా టెస్టు సారథ్య బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్థాన్లో గొప్ప విజయాలను టీమ్ ఇండియా సాధించింది. అప్పట్లో అత్యధిక టెస్టు విజయాలు (21) సాధించిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు.
ఛాపెల్ వివాదంలో..
2005లో టీమ్ఇండియా ప్రధాన కోచ్గా గ్రేగ్ ఛాపెల్ను తీసుకురావడంలో గంగూలీనే కీలక పాత్ర పోషించాడు. విదేశీ కోచ్ అయితే బాగుంటుందని బీసీసీఐకి నచ్చజెప్పి మరీ తీసుకొచ్చాడు. గంగూలీ బ్యాటింగ్లో పలు మ్యాచ్ల్లో విఫలమవడంతో జట్టును నడిపించే స్థితిలో అతడు లేడని ఛాపెల్ బీసీసీఐకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ కొద్ది నెలలు జట్టుకు దూరమయ్యాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి తనదైన బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఫలితంగా 2007 వన్డే ప్రపంచకప్నకు ఎంపికయ్యాడు. కానీ, టీమ్ఇండియా బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలై గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆపై పలువురు సీనియర్ ఆటగాళ్లకు ఛాపెల్తో పొసగకపోవడంతో కోచ్ బాధ్యతల నుంచి అతను తప్పుకొన్నాడు.
అలా ముగించి.. ఇలా వచ్చి..
ఛాపెల్ వివాదంతో టీమ్ఇండియా మళ్లీ గడ్డుకాలం ఎదుర్కొంటుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. కానీ, అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో ధోనీ వంటి కొత్త లీడర్ యువ భారత జట్టును విజయపథంలో నడిపాడు. గంగూలీ వారసుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్తో దాదా ఆటకు గుడ్బై చెప్పాడు. టీమ్ఇండియా తరఫున 311 వన్డేలు, 113 టెస్టులు ఆడి 18వేలకు పైగా పరుగులు సాధించాడు. క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం.. 2015 నుంచి నాలుగేళ్లపాటు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా పనిచేశాడు. 2019 అక్టోబర్లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత నుంచి దేశీయ క్రికెట్లో పెనుమార్పులు చోటు చేసుకొన్నాయి. గతేడాది బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్లో దిల్లీ మెంటార్గా పనిచేస్తున్నాడు. మరోవైపు క్రికెట్ విశ్లేషకుడిగానూ వ్యవహరిస్తున్నాడు.
అది 2000వ సంవత్సరం... ఒకవైపు భారత క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం.. మరోవైపు కెప్టెన్సీకి సచిన్ రాజీనామా. దీంతో గందరగోళ పరిస్థితుల్లో టీమ్ఇండియా ఉంది. చర్చ మొత్తం భారత జట్టును నడిపించే నాయకుడు ఎవరనేది. నాటి వైస్ కెప్టెన్ అజయ్ జడేజాతో పాటు అనిల్ కుంబ్లే కూడా రేసులో ఉన్నారు. అయితే, వీరిని కాదని అశోక్ మల్హోత్రా ఆధ్వర్యంలోని సెలెక్టర్ల బృందం సంచలన నిర్ణయం తీసుకొంది. అదే భారత క్రికెట్లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి నాంది. టీమ్ ఇండియా పురోగతికి పునాది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన