Suryakumar Yadav: అలా చెప్పేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు: సూర్యకుమార్
సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టీ20ల్లో టాప్ బ్యాటర్. మరి వన్డేల్లోకి వచ్చేసరికి మాత్రం నిరాశపరుస్తున్నాడు. అయితే, తన గణాంకాలను వెల్లడించడానికి మొహమాటం ఏదీ లేదని సూర్యకుమార్ వ్యాఖ్యానించడం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: ఎట్టకేలకు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తిరిగి ఫామ్లోకి వచ్చేశాడు. వెస్టిండీస్తో కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో (WI vs IND) తనదైన షాట్లతో చెలరేగి (44 బంతుల్లో 83) జట్టును గెలిపించడంలో ముఖ్య భూమిక పోషించాడు. మళ్లీ టీ20ల్లో తన మునుపటి ఫామ్తోపాటు 360 డిగ్రీల ఆటను ప్రదర్శించడంతో అభిమానులకు కనులవిందుగా మారింది. వచ్చే ప్రపంచ కప్లో సూర్య (SKY) ఆడితే బాగుంటుదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. కానీ టీ20లతో పోలిస్తే వన్డేల్లో సూర్య గణాంకాలు మెరుగ్గా లేవు. ఇదే విషయంపై తాజాగా సూర్యకుమార్ స్పందించాడు. తన గణాంకాలు మెరుగ్గా లేవని తనకూ తెలునని, అలా చెప్పడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.
‘‘నా వన్డే కెరీర్ గణాంకాల విషయంలో నిజాయతీగా ఉంటా. అందులో ఎలాంటి దాపరికాలు లేవు. బాగా లేవని చెప్పడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అయితే, అలాంటి పరిస్థితుల నుంచి ఎలా మెరుగు కావాలనేదానిపై శ్రమిస్తా. రోహిత్, ద్రవిడ్తో కూడా ఇదే విషయంపై చర్చించా. వారు కూడా ‘ఈ ఫార్మాట్లో నువ్వేమి ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. చివరి 10 లేదా 15 ఓవర్లలో బ్యాటింగ్కు వచ్చినప్పుడు జట్టు కోసం ఏం చేయగలవో అదే చేయాలని సూచించారు. నాకు ఇచ్చిన బాధ్యతలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది నా చేతుల్లోనే ఉంది’’ అని తెలిపాడు.
ఓడినా.. గెలిచినా దీర్ఘకాలిక ప్రణాళికల్లో మార్పులుండవు: పాండ్య
టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లో మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఇప్పటి వరకు 26 వన్డేలు ఆడిన సూర్య కేవలం 511 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. కెరీర్లో ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. ఎనిమిది పరుగులతో సరిపెట్టుకున్నాడు. అయితే, 51 టీ20ల్లో మూడు సెంచరీలు, 14 అర్ధశతకాలతో 1,780 పరుగులు చేయడం విశేషం. ఇక ఐపీఎల్లోనూ 139 మ్యాచుల్లో 3,249 పరుగులు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
-
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!