WI vs IND: విండీస్‌తో చివరి రెండు టీ20లు.. అమెరికాకు చేరుకున్న టీమ్‌ఇండియా

వెస్టిండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలో ఫ్లోరిడాలో జరగనున్నాయి. వీటి కోసం టీమ్ఇండియా (Team India) ఫ్లోరిడాకు చేరుకుంది.

Updated : 10 Aug 2023 18:40 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలో ఫ్లోరిడాలో జరగనున్నాయి. వీటి కోసం టీమ్ఇండియా (Team India) ఫ్లోరిడాకు చేరుకుంది. ఆటగాళ్లు వెస్టిండిస్‌ నుంచి బయలుదేరి ఫ్లోరిడాలోని మియామి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వీడియోను సామాజిక మ్యాధమం ట్విటర్‌(X)లో బీసీసీఐ పంచుకుంది. ఆగస్టు 12, 13 తేదీల్లో నాలుగు, ఐదు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. భారత్ గతంలో కూడా ఫ్లోరిడాలో మ్యాచ్‌లు ఆడింది. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అన్నీ విండీస్‌తోనే జరిగాయి. 2016లో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రమే టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో ఒకటి రద్దుకాగా.. నాలుగింటిలో భారత్‌ విజయం సాధించింది. ఇటీవల అమెరికాలో నిర్వహించిన మేజర్ లీగ్ క్రికెట్ (MLC) టోర్నీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో భారత్, విండీస్‌ మ్యాచ్‌లకు కూడా అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. 

టీమ్‌ ఇండియాలో ఎంపిక గురించి ఆలోచించడంలేదు: పృథ్వీషా

ఇక టీ20 సిరీస్ విషయానికొస్తే.. తొలి రెండు టీ20ల్లో ఓటమిపాలైన టీమ్‌ఇండియా.. మూడో టీ20లో విజయం సాధించి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. మిగతా రెండు టీ20ల్లో నెగ్గితే సిరీస్ భారత్ వశమవుతుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న విండీస్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు సవాలు విసరడం ఖాయం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని