Prithvi Shaw: టీమ్‌ ఇండియాలో ఎంపిక గురించి ఆలోచించడంలేదు: పృథ్వీషా

తాను టీమ్‌ ఇండియాలో ఎంపికపై ఏమాత్రం ఆలోచించడంలేదని యువ క్రికెట్‌ పృథ్వీ షా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు.

Updated : 10 Aug 2023 12:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత యువ క్రికెటర్‌ పృథ్వీషా (Prithvi Shaw ) జాతీయ జట్టులో  ఎంపిక కాకపోవడంపై స్పందించాడు. తనను జాతీయ జట్టులోకి తీసుకొనే విషయంలో భారత సెలక్టర్ల అభిప్రాయంపై తాను ఏమాత్రం బాధపడటంలేదని చెప్పాడు. జులై 2021 తర్వాత షా భారత జట్టు తరపున బరిలోకి దిగలేదు. అయితే, అతడు జాతీయ జట్టులో సెలక్షన్‌ గురించి మాత్రం ఆలోచించడం లేదట. నార్తంప్టన్‌షైర్‌ (Northamptonshire) తరపున ఆడుతూ క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నానని అంటున్నాడు. 

ఈడెన్‌ గార్డెన్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో అగ్నిప్రమాదం..!

‘‘భారత క్రికెట్‌ జట్టు సెలక్టర్లు నా గురించి ఏం అనుకుంటున్నారని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కానీ, ఇక్కడ ఆడుతున్న సమయాన్ని ఆద్భుతంగా ఆస్వాదించాలనుకుంటున్నాను. ఇక్కడి ఆటగాళ్లు, సపోర్టింగ్‌ స్టాఫ్‌తో చక్కటి సమయం గడుపుతున్నాను. నార్తంప్టన్‌షైర్‌ నాకు ఈ అవకాశం ఇచ్చింది. వారు నన్ను చాలా బాగా చూసుకొంటున్నారు. నేను ఎంజాయ్‌ చేస్తున్నాను’’ అని షా పేర్కొన్నాడు.

షా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. యూకే దేశవాళీ క్రికెట్‌ వన్డేకప్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీషా సంచలన ఇన్నింగ్స్‌తో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా (244; 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్స్‌లు) బాదేశాడు. దీంతో నార్తంప్టన్‌షైర్‌ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 415 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. షా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. ఈ మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌ 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే లిస్ట్ ఎ క్రికెట్‌లో ఆరో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. మ్యాచ్‌ అనంతరం షా మాట్లాడుతూ ‘‘నేడు వాతావరణం భారత్‌లో వలే ఎండగా ఉంది. ఈ రోజు నా పూర్తి శక్తిసామర్థ్యాలను బయటకు తెచ్చి ఆడాను. ఈ రోజు నాకు పూర్తిగా కలిసొచ్చింది. నేను వెనుదిరిగి చూసుకోను’’ అని అన్నారు. అంతకు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో షా 34, 26 స్కోర్లు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని