ODI WC 2023: సెలెక్టర్ల దృష్టిలో తిలక్ తప్పక ఉంటాడు: రాబిన్ ఉతప్ప
అరంగేట్రం చేసిన తొలి సిరీస్లోనే అదరగొట్టేసిన తిలక్ వర్మ (Tilak Varma) పేరు ఇప్పుడందరి నోటా మారుమోగుతోంది. భారత జట్టులో నాలుగో స్థానంలో అతడు సరిగ్గా సరిపోతాడనే వాదనా తెరమీదకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ పర్యటనలో (WI vs IND) అరంగేట్రం చేసి అదరగొట్టేసిన భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆటతీరుపై అందరిలోనూ చర్చ మొదలైంది. భవిష్యత్తులో కీలక ప్లేయర్గా ఎదుగుతాడని ప్రశంసలు కురిపించారు. తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా అభినందిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ కోసం నాలుగో స్థానంలో ఆడే ఆటగాడి కోసం సెలెక్టర్ల దృష్టి తప్పకుండా తిలక్ వర్మపై ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
నాలుగులో నిలబడేదెవరు ... యువీ వారసుడి కోసం కొనసాగుతున్న వేట
‘‘సుదీర్ఘకాలం జట్టు కోసం ఆడించాలనే భావన సెలెక్టర్లకు ఉంటే యువ క్రికెటర్లపై దృష్టిసారించాలి. పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు కోసం ఆడేవారిని పరిగణనలోకి తీసుకోవాలి. అందులో తొలుత తిలక్ వర్మ గురించి తప్పకుండా చర్చిస్తారని భావిస్తున్నా. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లోనూ వైవిధ్యం చూపిస్తున్నాడు. విండీస్తో చివరి టీ20 మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీశాడు. అంతేకాకుండా ఎడమచేతివాటం బ్యాటర్ కావడం కూడా కలిసి రావచ్చు’’ అని ఉతప్ప వ్యాఖ్యానించాడు.
హార్దిక్.. ఇదేం ఆట?: జాఫర్
కీలకమైన ఐదో టీ20 మ్యాచ్లో దారుణ ప్రదర్శనతో కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన సంగతి తెలిసిందే. హార్దిక్ ఆడిన తీరే ఆందోళన కలిగించేలా ఉందని మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ వ్యాఖ్యానించాడు. ‘‘ హార్దిక్ పాండ్య అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. క్రీజ్లోనూ స్వేచ్ఛగా ఉండలేకపోయాడు. సిక్స్లు కొట్టాల్సిన అవసరం లేదు కానీ కనీసం స్ట్రైక్ను రొటేట్ చేస్తే బాగుండేది. విండీస్తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి తర్వాత భారీ షాట్లతో చెలరేగాడు. కీలకమైన ఐదో టీ20లోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించాల్సింది. ఆసియా, వన్డే ప్రపంచకప్లో మిడిలార్డర్లో పరుగులు చేయాల్సిన బాధ్యత హార్దిక్పై ఉంటుంది’’ అని జాఫర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!