olympics: ఒలింపిక్స్ ప్రారంభోత్సవం.. గతమెంతో ఘనం!
ఒలింపిక్స్ మహాక్రీడోత్సవం ప్రారంభమైంది. కానీ.. ప్రతిసారి అంగరంగవైభంగా జరిగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక.. కరోనా మహమ్మారి కారణంగా సాదాసీదాగా జరిగిపోయింది. గతేడాదే నిర్వహించాల్సిన ఒలింపిక్స్ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తితో అసలు ఈ క్రీడలు
ఒలింపిక్స్ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. కానీ.. ప్రతిసారి అంగరంగవైభవంగా జరిగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక.. కరోనా మహమ్మారి కారణంగా సాదాసీదాగా జరిగిపోయింది. గతేడాదే నిర్వహించాల్సిన ఒలింపిక్స్ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తితో అసలు ఈ క్రీడలు జరుగుతాయా? అనే సందేహాలు కలిగాయి. జపాన్ ప్రజలే ఒలింపిక్స్ను నిర్వహించొద్దని వ్యతిరేకించారు. అయినా.. కరోనా నిబంధనలు పాటిస్తూ ఒలింపిక్స్ను నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్లో భాగమైన ప్రారంభోత్సవాన్ని ఉండిలేనట్టుగా నిర్వహించేసింది. క్రీడాభిమానుల కేరింతలు లేవు.. సినీతారల సందడి లేదు. కొద్దిమంది ప్రేక్షకులు, అతిథుల మధ్య అలా అలా కానిచ్చేశారు. అయితే, గత ఒలింపిక్స్ క్రీడల్లో జరిగిన కొన్ని గొప్ప ప్రారంభోత్సవాలు, విశేషాలపై ఓ లుక్కేద్దాం..!
టోక్యో, జపాన్ - 1964
ప్రస్తుతం ఒలింపిక్స్కు ఆతిథ్యమిస్తోన్న జపాన్.. 1964లోనూ ఈ మహాక్రీడలను నిర్వహించింది. ఆసియాలో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చిన తొలిదేశం కూడా జపానే. క్రీడలను శాటిలైట్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయడం కూడా టోక్యో ఒలింపిక్స్ నుంచే ప్రారంభమైంది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భాగంగా వేలకొద్ది బెలూన్లను, 8వేల పావురాలను గాల్లోకి ఎగరవేశారు. ఐదు జెట్రాకెట్లు గాల్లో గింగిరాలు తిరుగుతూ ఒలింపిక్స్ రింగులను గీయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరో విశేషమేమిటంటే.. ప్రారంభోత్సవంలో ఒలింపిక్ జ్యోతిని హిరోషిమా బేబీగా గుర్తింపు పొందిన యోషినోరి సాకాయ్ వెలిగించాడు. హిరోషిమాపై అణుబాంబు పడిన రోజునే యోషినోరి జన్మించాడు. అందుకే అతడిని హిరోషిమా బేబి అని పిలుస్తుంటారు.
మాస్కో, రష్యా - 1980
1980లో రష్యా-అమెరికా మధ్య కోల్డ్వార్ జరుగుతుండటంతో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ను అమెరికా నిషేధించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు కన్నుకుట్టే విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్స వేడుకను ఘనంగా నిర్వహించింది. మైదానం మధ్యలో కొందరు పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు నిల్చోడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే, స్టేడియం కార్డులను పరిచయం చేసిన ఘనత రష్యాకే చెందుతుంది. మైదానంలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన వెంటనే అక్కడ ఉన్న ప్రేక్షకులంతా కలిసి కార్డులతో నినాదాలు.. ఒలింపిక్స్ రింగులను ప్రదర్శించడం వేడుకలో హైలైట్గా నిలిచింది.
లాస్ ఏంజిలెస్, అమెరికా - 1984
అగ్రరాజ్యం అమెరికా 1984లో ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చింది. లాస్ ఏంజిలెస్ మెమోరియల్ కోలిజియం వేదికగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా 800 మంది మ్యూజిషియన్లు సంగీతం వాయిస్తూ క్రీడాకారులతోపాటు మార్చ్ చేశారు. 410 మంది బ్యాలెట్ డాన్స్ చేశారు. మ్యూజిషియన్లు 84 అతిపెద్ద పియానోలను వాయించారు. 300 మంది గాయకులు కలిసి పాట పాడారు. ఈ వేడుకలో ఓ వ్యక్తి జెట్ ప్యాకెట్ వేసుకొని గాల్లో ఎగురుతూ వచ్చి మైదానం మధ్యలో ల్యాండ్ కావడం ప్రారంభోత్సవ వేడుకలో మరుపురాని ఘట్టంగా చెబుతుంటారు.
బార్సిలోనా, స్పెయిన్ - 1992
స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక ఎంతో వైవిధ్యంగా నిర్వహించారనడంలో సందేహం లేదు. 67వేల మంది ప్రేక్షకుల మధ్య భారీ పప్పెట్స్(తోలుబొమ్మలు) సందడి చేశాయి. వందలాది కళాకారులు నీలి రంగు దుస్తులు వేసుకొని స్టేడియాన్ని సముద్రంగా మార్చగా.. అందులో భారీ ఓడను నడుపుతున్నట్లు చేసిన విన్యాసం అబ్బురపర్చింది. వేడుక చివర్లో పారాఒలింపిక్ ఆర్చర్ ఆంటోనియో రొబెల్లో బాణం ఎక్కుపెట్టి ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం విశేషం.
సిడ్నీ, ఆస్ట్రేలియా - 2000
సిడ్నీ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో కళాకారులు మంటలతో భారీ ప్రదర్శన ఇచ్చారు. ప్రేక్షకులంతా చేతికి ఎరుపు రంగు టార్చ్ బ్యాండ్తో స్టేడియమంతా వెలుగులు నింపారు. ఆ తర్వాత రంగురంగు సీతాకోకచిలుకల వేషధారణతో మరికొంత మంది చేసిన నృత్యప్రదర్శన కనులవిందుగా సాగింది. దేశాల వారీగా అథ్లెట్ల మార్చ్, ప్రారంభోత్సవ ప్రసంగం తర్వాత ఒలింపిక్స్ జ్యోతి వెలిగించే సమయంలో నీరు.. నిప్పుతో చేసిన విన్యాసం ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఏథేన్స్, గ్రీస్ - 2004
గ్రీస్లోని ఏథేన్స్లో ఒలింపిక్స్-2004 ప్రారంభోత్స వేడుక జరిగింది. గ్రీస్ అంటేనే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన నగరం. అందుకే ఆ దేశ చరిత్ర, అక్కడి ప్రజల సంస్కృతిని తెలిపే విధంగా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత అథ్లెట్ల మార్చ్.. ప్రారంభోత్సవ ప్రసంగం.. ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన జరిగాయి.
బీజింగ్, చైనా - 2008
చైనాలోని జీబింగ్ నేషనల్ స్టేడియంలో నిర్వహించిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో కనివినీ ఎరుగని విధంగా 2008 మంది డ్రమ్మర్స్ స్టేడియంలో డ్రమ్స్ వాయిస్తూ.. పాట పాడారు. ఆ దృశ్యం.. డ్రమ్స్ శబ్దాలు ప్రేక్షకుల్లో రోమాలు నిక్కపోడిచాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత అరవై అడుగుల ఎత్తులో రూపొందించిన గోళాకారపు వస్తువు చుట్టూ రోపుల సాయంతో కళాకారులు విన్యాసాలు చేశారు. చివర్లో ఒలింపిక్స్ జ్యోతి ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ(రోప్ సాయంతో) వచ్చి వెలిగించడం ఆకట్టుకుంటుంది.
లండన్, యూకే - 2012
లండన్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో బ్రిటన్ పారిశ్రామిక విప్లవం నుంచి చరిత్రలో నిలిచిపోయిన అనేక ఘట్టాలను ప్రదర్శించారు. లండన్ సింఫనీ ఆర్కేస్ట్రా బృందం సంగీత కచేరీ చేస్తుండగా.. మిస్టర్ బీన్(రోవన్ అట్కిన్సన్) వచ్చి చేసిన సందడి ఆద్యంతం నవ్వులు పూయించింది. క్రీడల నేపథ్యంలోనే మిస్టర్ బీన్ నటించిన హాస్యభరిత లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. జేమ్స్బాండ్ పాత్రధారి డానియల్ క్రెగ్తో కలిసి బ్రిటన్ రాణి ఎలిజెబెత్ హెలికాప్టర్లో వచ్చి స్టేడియంలో స్కైడైవింగ్ చేస్తూ దిగడం విశేషం.(నిజానికి ఆమె అసలైన ఎలిజబెత్ కాదు. ఆమె పాత్రలో మరో వ్యక్తి నటించారు). ఆ తర్వాత అసలైన ఎలిజెబెత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రదర్శనలకు స్లమ్డాగ్ మిలియనీర్ చిత్ర దర్శకుడు డ్యానీ బోయల్ దర్శకత్వం వహించారు.
రియో, బ్రెజిల్ - 2016
రియోలోని మారకానా స్టేడియంలో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితుల, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తక్కువ ఖర్చుతో.. ఉన్నంతలో గొప్పగా నిర్వహించాలని వేడుక నిర్వహకులు భావించారు. ఈ క్రమంలో అమెజాన్ అడవులు.. గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా నృత్య ప్రదర్శనలు, గాయకుల సంగీత కచేరీలు జరిగాయి. బ్రెజిల్లో ప్రముఖ మోడల్ గిసెలె బుడ్చెన్.. స్థానిక గాయకుడు డానియల్ జోబిమ్ పాట పాడుతుండగా ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ప్రారంభోత్సవ కార్యక్రమం ముగింపులో ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన మాత్రం ఒక్కో ఆతిథ్య దేశం విభిన్నంగా ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే