Virat: విరాట్కు మళ్లీ టెస్టు కెప్టెన్సీ? మాజీ చీఫ్ సెలక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టు జట్టు కెప్టెన్గా విఫలమవుతుండటంతో అతడిని తొలగించాలనే డిమాండ్లూ వస్తున్నాయి. అతడి స్థానంలో మరొకరిని నియమించాలనే వాదనా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) టెస్టు జట్టు సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్లో వ్యక్తిగతంగానూ, జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి. అతడిని తప్పించి మరొకరిని కెప్టెన్గా నియమించాలనే డిమాండ్లూ వస్తున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మను తప్పిస్తే.. అతడి స్థానంలో మళ్లీ విరాట్ కోహ్లీకే (Virat Kohli) అవకాశం ఇవ్వాలని సూచించాడు. అలా చెప్పడానికి అజింక్య రహానెను ఉదాహరణగా చూపిస్తూ ఎంఎస్కే వివరించాడు.
ఇదీ చదవండి.. విండీస్తో మ్యాచ్లు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
‘‘విరాట్ కోహ్లీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అజింక్య రహానె జట్టులోకి తిరిగి వచ్చి వైస్ కెప్టెన్ అయ్యాడు. కాబట్టి విరాట్ కెప్టెన్సీ ఎందుకు చేపట్టకూడదు? అయితే, సారథ్యంపై విరాట్ కోహ్లీ ఏమన్నాకుంటున్నాడో తెలియదు. రోహిత్ను కాదని వేరేవారిని నియమించాలని సెలక్టర్లు భావిస్తే మాత్రం విరాట్ వైపు మొగ్గుచూపాలి. ఇక రిషభ్ పంత్ కూడా మంచి ఆప్షనే. కానీ, అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. వచ్చి కుదురుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల్లో మరే ఇతర భారత వికెట్ కీపర్లు చేయని విధంగా పరుగులు సాధించాడు. అతడు మళ్లీ జట్టులోకి వచ్చాక పరిశీలించాలి’’ అని ప్రసాద్ తెలిపాడు.
ప్రస్తుతం భారత్ విండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్లో రోహిత్ వ్యక్తిగతంగా రాణించకపోతే మాత్రం విమర్శలు మరింత తీవ్రమవుతాయి. టెస్టు కెప్టెన్సీ పోవడమే కాకుండా జట్టులో స్థానం కూడా గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సంక్షిప్త వార్తలు
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!