Chennai vs Mumbai: చెన్నై x ముంబయి.. ఈరోజు ఓడితే ధోనీసేన ఇంటిముఖమే
భారత టీ20 లీగ్లో అత్యంత గొప్ప జట్లుగా పేరున్న చెన్నై, ముంబయి ఈరోజు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్లో అత్యంత గొప్ప జట్లుగా పేరున్న చెన్నై, ముంబయి నేడు మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. చెన్నైకి టెక్నికల్గా ఏదో చిన్న అవకాశం ఉంది. అయితే, ఈ రోజు జరిగే మ్యాచ్లో ముంబయి గెలిస్తే.. చెన్నై దారులు కూడా పూర్తిగా మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొందాం..
చెన్నై ఒకటి అలా ఒకటి ఇలా..
ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్లా అడుగుపెట్టిన చెన్నై తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. తొలి నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత ఐదో మ్యాచ్లో విజయం సాధించింది. ఇక అక్కడి నుంచైనా వరుస విజయాలు సాధిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలిస్తోంది. ఐదో మ్యాచ్లో బెంగళూరుపై తొలి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ జట్టు తర్వాత మళ్లీ గెలుపోటములతో దాగుడు మూతలు ఆడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.
ఓపెనర్లే కీలకం..
ఇక చెన్నై ఇప్పటి వరకు గెలిచిన నాలుగు మ్యాచ్ల్లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే.. ఇద్దరే రెండు మ్యాచ్లు గెలిపించారు. సూపర్ ఫామ్లో ఉన్న వీరు ఇటీవల రెండు శతక భాగస్వామ్యాలు జోడించి ఆ జట్టు భారీ స్కోర్లు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా కాన్వే ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనే 77 సగటుతో 231 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ శతకాలు ఉండటం విశేషం. మరోవైపు టోర్నీ ఆరంభంలో తడబడిన రుతురాజ్ కొద్ది రోజుల నుంచి పుంజుకొన్నాడు. ఈ క్రమంలోనే ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో నేటి మ్యాచ్లో ముంబయి వీరిద్దర్నీ కట్టడి చేస్తే సగం మ్యాచ్ గెలిచేసినట్లే. ఓపెనర్ల తర్వాత అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు అడపా దడపా భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అయితే, కెప్టెన్ ధోనీ మాత్రం ఫినిషర్గా చివర్లో దంచికొడుతున్నాడు.
ముంబయి ఆశలు లేకున్నా..
ఇక ముంబయి ఈ టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా ఆడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలే సాధించి అన్నింటికన్నా ముందే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. అలాంటిది ఇటీవల రాజస్థాన్, గుజరాత్ జట్లపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతున్న వాటికి షాకిచ్చింది. ఈ విజయాలు ముంబయికి ఎలాగూ కలిసిరాకపోయినా ఆ ఫలితాలు ఇతర జట్లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నేడు చెన్నైతో జరిగే మ్యాచ్లోనూ ముంబయి గెలిస్తే ధోనీసేన అవకాశాలను పూర్తిగా దెబ్బతీసినట్లే. దీంతో చెన్నై కూడా ప్లేఆఫ్స్కు చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది.
బుమ్రా ఒక్కడు మెరిస్తే..
ఈ సీజన్లో ముంబయి ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఏమాత్రం ఆకట్టుకోలేదనే సంగతి తెలిసిందే. ఇషాన్ మూడు అర్ధ శతకాలు సాధించినా అవి జట్టు విజయాలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. వీరిద్దరి తర్వాత నమ్మకం ఉన్న ఆటగాడు సూర్యకుమార్. అతడు ఈ సీజన్లో బ్యాటింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా గాయం కారణంగా ఇటీవలే మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక ఆ జట్టులో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడు తిలక్ వర్మ ఒక్కడే. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా తనవంతు పరుగులు చేస్తున్నాడు. మరోవైపు పోలార్డ్, డానియల్ సామ్స్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు అంతంతమాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై సరిగ్గా ఆడితే.. ముంబయిపై విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే, బౌలింగ్లో బుమ్రాను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే గత మ్యాచ్లోనే అతడు 5 వికెట్లతో చెలరేగి ఫామ్లోకి వచ్చాడు. అతడు మరోసారి రాణిస్తే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!