జీవో 317ను రద్దు చేయండి
జీవో 317ను రద్దు చేసి న్యాయం చేయాలంటూ కోరుతూ పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి ఇంటి ఎదుట ఉమ్మడి రంగారెడ్డి,
మంత్రి సబితారెడ్డికి వినతి
ఆందోళన చేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు
ఖైరతాబాద్, శ్రీనగర్కాలనీ, న్యూస్టుడే: జీవో 317ను రద్దు చేసి న్యాయం చేయాలంటూ కోరుతూ పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి ఇంటి ఎదుట ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పది మందిని మాత్రమే లోపలికి అనుమతించడంతో మిగిలినవారు రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు ఠాణాకు తరలించారు.
మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు
దంపతుల్ని ఒకేచోట ఉంచండి
దంపతులైన ఉద్యోగుల్ని ఒకేచోట ఉండేలా చూస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. పలు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సోమవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. స్పౌజ్ విషయంలో ముఖ్యమంత్రి ఒకలా స్పందిస్తే, అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు.
జోనల్ కేటాయింపుల్లో తప్పులు సరిచేయండి
ఈనాడు, హైదరాబాద్: ఎంపిక చేసుకున్న జోన్లకు కాకుండా ఇతర జోన్లకు కేటాయించడం సరికాదని, జోనల్ కేటాయింపుల్లో తప్పులు సరిచేయాలంటూ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సోమవారం బీఆర్కే భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. తొలుత ఎంపిక చేసుకున్న బహుళ జోన్లకే తమను కేటాయించాలని వారు కోరారు. ఆందోళన నిర్వహించిన వారిని పోలీసులు అరెస్టు చేసి సమీప ఠాణాలకు తరలించారు.
‘ఉపాధ్యాయుల అరెస్టు అప్రజాస్వామికం’
విద్యాశాఖ మంత్రి ఇంటికి, బీఆర్కే భవన్కు వెళ్లిన ఉపాధ్యాయులను అరెస్టు చేసి రోజంతా పోలీస్స్టేషన్లలో ఉంచడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం