Tamilisai: బడ్జెట్‌లో నా ప్రసంగం లేకపోవడం సమస్య కాదు: గవర్నర్‌ తమిళిసై

తన ప్రసంగం లేకుండానే తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావడం పెద్ద సమస్య కాదని, తనకు ప్రజాసంక్షేమమే ముఖ్యమని భావించి, ఆ అంశాన్ని అంత తీవ్రంగా పరిగణించలేదని రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి

Updated : 14 Mar 2022 06:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: తన ప్రసంగం లేకుండానే తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావడం పెద్ద సమస్య కాదని, తనకు ప్రజాసంక్షేమమే ముఖ్యమని భావించి, ఆ అంశాన్ని అంత తీవ్రంగా పరిగణించలేదని రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆదివారం కోయంబత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవికి మీ పేరును సైతం పరిశీలిస్తున్నారన్న విషయం నిజమేనా అని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా తమిళిసై సమాధానాన్ని దాటవేశారు. పుదుచ్చేరి-బెంగళూరు-హైదరాబాద్‌ల మధ్య ప్రయాణికుల విమానాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమవుతున్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని