తెలంగాణకు గుజరాత్ పల్లీనూనె
పచ్చళ్ల తయారీ సీజన్ కావడంతో వేరుసెనగ(పల్లీ) నూనెకు భారీగా డిమాండు పెరిగింది. తెలంగాణలో ఈ నూనె తయారీ లేకపోవడంతో ఏపీ నుంచి ఇక్కడి వ్యాపారులు కొనేవారు. కానీ అక్కడ గత నెలలో కరెంటు కోతల వల్ల ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్ నుంచి ‘తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల
ఏపీలో కరెంటుకోతలతో తగ్గిన ఉత్పత్తి
పచ్చళ్ల సీజన్ కావడంతో అధికంగా తెప్పించిన ఆయిల్ఫెడ్
ఈనాడు, హైదరాబాద్: పచ్చళ్ల తయారీ సీజన్ కావడంతో వేరుసెనగ(పల్లీ) నూనెకు భారీగా డిమాండు పెరిగింది. తెలంగాణలో ఈ నూనె తయారీ లేకపోవడంతో ఏపీ నుంచి ఇక్కడి వ్యాపారులు కొనేవారు. కానీ అక్కడ గత నెలలో కరెంటు కోతల వల్ల ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్ నుంచి ‘తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’(ఆయిల్ఫెడ్) పెద్దయెత్తున తెప్పిస్తోంది. గుజరాత్కన్నా తెలంగాణ, ఏపీలోనే నాణ్యమైన వేరుసెనగలు పండుతాయి. కానీ ఇక్కడ పంట పెద్దగా లేకపోవడంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో గుజరాత్ నూనెమిల్లులపైనే ఆధారపడాల్సి వచ్చింది. పచ్చళ్ల తయారీకి ఎక్కువమంది టోకుగా కొనడంతో పాటు పొద్దుతిరుగుడు నూనె ధర ఏకంగా రూ.200 దాటడంతో పల్లీనూనె వాడకంవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నందున దీని అమ్మకాలు పెరిగినట్లు సమాఖ్య పరిశీలనలో తేలింది. డీజిల్ ధర పెరుగుదలతో రవాణా కిరాయిలు కూడా నూనె ధరలో కలిపి ప్రజల నుంచి వ్యాపారులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా నెలకు 800 టన్నుల పల్లి నూనెను విక్రయించే ఆయిల్ఫెడ్ గతనెలలో 1300, ఈ నెలలో 2 వేల టన్నులను విక్రయిస్తోంది. దీని ధర లీటరకు రైతు బజార్లలో రూ.171 ఉండగా బయటి మార్కెట్లో రూ.180కి అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు సాధారణంగా పొద్దుతిరుగుడు నూనెను అధికంగా కొంటాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో ఈ నూనె ధర ఏకంగా రూ.200కి చేరింది. ప్రస్తుతం రైతుబజార్లలో ఆయిల్ఫెడ్ ‘విజయ’ బ్రాండు పేరుతో విక్రయించే పొద్దుతిరుగుడు ప్రీమియం వంటనూనె లీటరురూ.196గా ఉంది.
పామాయిల్పైనే ఆశలు...
మనదేశానికి ఇండోనేసియా, మలేసియా దేశాల నుంచి పామాయిల్ దిగుమతి అవుతోంది. కానీ గత నెలలో ఈ నూనె ఎగుమతిపై ఇండోనేసియా ఆంక్షలు విధించడంతో దీని ధర లీటరుకు అదనంగా రూ.10 వరకూ నెలవ్యవధిలోనే పెరిగింది. తిరిగి ఈ నెల 23 నుంచి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తేస్తామని తాజాగా ప్రకటించడంతో నూనె వ్యాపారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండోనేసియా నుంచి తిరిగి ఎగుమతులు ప్రారంభమైతే ధర ఇక్కడ తగ్గుతుందని, లభ్యత పెరిగితే ఇతర వంటనూనెల ధరలు తగ్గేసూచనలున్నట్లు ఆయిల్ఫెడ్ తాజా అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
19 జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 13, శాయంపేటలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాణిజ్యపన్నులు X ఆబ్కారీ
తెలంగాణలో ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖల మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది. పన్ను చెల్లింపుల్లో ఆబ్కారీశాఖ ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో వాణిజ్యపన్నుల శాఖ సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా నిలవగా... తాజాగా హాలోగ్రామ్ల అమ్మకాలకు సంబంధించి రూ.54 కోట్ల జీఎస్టీ చెల్లించాలని షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. -
ఈడీ ఛార్జిషీట్పై నేడు విచారణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుంది. -
ఓటేశారు.. తిరిగొచ్చారు..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు ఓటు వేయడానికి వెళ్లిన వారందరూ సోమవారం పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. -
పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆదేశించారు. -
నేడు విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
విశాఖ నుంచి సికింద్రాబాద్కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపింది. -
మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి కన్నుమూత
నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినయ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. నిందితుడు అరుణ్ రెడ్డికి బెయిల్
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ప్రసంగ వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుడు అరుణ్ రెడ్డికి దిల్లీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్న పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది.
తాజా వార్తలు (Latest News)
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి