ప్రపంచమంతా ఆకలి కేకలు
మనిషి ఆకలితో అలమటించే పరిస్థితిని రూపుమాపాలనే లక్ష్యాన్ని అందుకోవడం కష్టసాధ్యమేనని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చిచెప్పింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని ఐరాస నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో ఎనిమిది
సుమారు 100 కోట్ల మందికి క్షుద్బాధ
ఆరోగ్యకరమైన ఆహారానికీ అత్యధికులు దూరమే
దేశంలో పౌష్టికాహారం కొనలేని స్థితిలో 70% మంది
ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి
మనిషి ఆకలితో అలమటించే పరిస్థితిని రూపుమాపాలనే లక్ష్యాన్ని అందుకోవడం కష్టసాధ్యమేనని ఐక్యరాజ్య సమితి నివేదిక తేల్చిచెప్పింది. 2030 నాటికి ఆకలి సమస్యను అధిగమించాలని ఐరాస నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడానికి మరో ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉండగా, ఏటా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతోందని ఆందోళన వెలిబుచ్చింది. ‘‘2021లో ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమస్యను ప్రపంచం నుంచి తరిమివేయాలని 2015లో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని(ఎస్.డి.జి) నిర్దేశించుకుంది. కాగా అప్పటి కంటే ఇప్పుడు 18 కోట్ల మంది ఎక్కువయ్యారు. 2019లో కరోనా వచ్చిన తర్వాతనే 15 కోట్ల మంది అధికమయ్యారు. దీంతోపాటు ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు..అంటే సుమారు 231 కోట్ల మంది ఓ మోస్తరు లేదా తీవ్రమైన ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని భరించే స్థితిలో లేని వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని’’ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్.ఎ.ఓ) తాజాగా ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్-2022 పేరుతో విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మంది పోషకాహార లోపానికి గురవుతారని, అంటే 2015లో ఉన్న స్థాయికి మళ్లీ చేరుకుంటామని ఆ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనూ సమస్య తీవ్రంగానే ఉందని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..
* ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 2004-06 సంవత్సరాల మధ్య 12.2 శాతం కాగా, 2019-21 మధ్య 3 శాతం మాత్రమే తగ్గి 9 శాతానికి చేరుకుంది. భారత్లో 2004-06 మధ్య 21.6 శాతం కాగా, 2019-21 మధ్య 16.3 శాతంగా ఉంది. చైనాలో అది 2.5, నేపాల్లో 5.5, పాకిస్థాన్లో 16.9 శాతంగా ఉంది.
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే పరిస్థితి లేని వారి సంఖ్య భారత్తో సహా అనేక దేశాల్లో ఎక్కువగా ఉంది.
* ఆరోగ్యకర ఆహారం తీసుకోవడానికి అవసరమయ్యే ఖర్చు ప్రపంచ తలసరి రోజుకు 2017లో 3.314 డాలర్లు. 2020 నాటికి అది 3.537 డాలర్లయింది. భారతదేశంలో 2.824 డాలర్ల నుంచి 2.97 డాలర్లకు(రూ.230) పెరిగింది. దేశంలో ఆ మాత్రం వెచ్చించలేని వారు 2017లో 74.9 శాతం ఉండగా, 2020 నాటికి 70.5 శాతమయ్యారు. అంటే దేశంలో 97 కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారం కోసం రోజుకు రూ.230 ఖర్చుచేసే స్థితిలో లేరు.
* ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు తగ్గడంతోపాటు ప్రజల సగటు ఆదాయం కూడా తగ్గింది. వీటన్నింటి ప్రభావం ఆహారభద్రతపై పడింది. ఉక్రెయిన్పై రష్యా దాడి తీవ్రతను పెంచింది.
* కరోనా తర్వాత పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆర్థిక అసమానతలు, సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, ఆహారం, ఎరువులు, ఇంధన ధరలు పెరగడం ఇలా అనేక అంశాలు ద్రవ్యోల్బణాన్ని పెంచాయి. మహిళలు, యువత, తక్కువ నైపుణ్యం గల కూలీలు, అసంఘటిత రంగంలోని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* వ్యవసాయానికి, ఆహార భద్రత విధానాలకు ప్రభుత్వాల నుంచి తగినంత మద్దతు లేదు. అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఆరోగ్యం కోసం చేయాల్సిన ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది.
- ఈనాడు హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
19 జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 13, శాయంపేటలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాణిజ్యపన్నులు X ఆబ్కారీ
తెలంగాణలో ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖల మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది. పన్ను చెల్లింపుల్లో ఆబ్కారీశాఖ ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో వాణిజ్యపన్నుల శాఖ సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా నిలవగా... తాజాగా హాలోగ్రామ్ల అమ్మకాలకు సంబంధించి రూ.54 కోట్ల జీఎస్టీ చెల్లించాలని షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. -
ఈడీ ఛార్జిషీట్పై నేడు విచారణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుంది. -
ఓటేశారు.. తిరిగొచ్చారు..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు ఓటు వేయడానికి వెళ్లిన వారందరూ సోమవారం పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. -
పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆదేశించారు. -
నేడు విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
విశాఖ నుంచి సికింద్రాబాద్కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపింది. -
మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి కన్నుమూత
నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినయ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. నిందితుడు అరుణ్ రెడ్డికి బెయిల్
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ప్రసంగ వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుడు అరుణ్ రెడ్డికి దిల్లీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్న పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!