బీటెక్ రెండో ఏడాదే కొలువు బాట
చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలల దీపం.. సాఫ్ట్వేర్ కొలువు. బీటెక్ నాలుగో సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుంది? మంచి కంపెనీలో ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుంది? అన్నదే వారి ఆందోళన.. ఆదుర్దా! కానీ.
ఎంపికైన వారికి స్టైపెండ్.. ఆ తర్వాత ఆకర్షణీయ వేతనం
ఈనాడు, హైదరాబాద్: చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలల దీపం.. సాఫ్ట్వేర్ కొలువు. బీటెక్ నాలుగో సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుంది? మంచి కంపెనీలో ఎన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుంది? అన్నదే వారి ఆందోళన.. ఆదుర్దా! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇప్పుడు బీటెక్ నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించే వరకు కూడా ఆగాల్సిన పనిలేదు. మెరికల్లాంటి ఇంజినీరింగ్ విద్యార్థులను ఐటీ కంపెనీలే కళాశాలలకు వచ్చి, కోర్సు పూర్తవకముందే.. రెండో ఏడాదిలోనే ఎగరేసుకుపోతున్నాయి.ఇంజినీరింగ్లో ప్రవేశం పొందుతున్న వందలాది విద్యార్థులు కోర్సులు పూర్తవకుండానే ముందస్తు కొలువులను సొంతం చేసుకుంటున్నారు. బీటెక్ రెండో ఏడాదిలోనే వివిధ కంపెనీల ఇంటర్న్షిప్నకు ఎంపికవుతుండగా.. వారిలో కనీసం 90 శాతం మంది బీటెక్ పూర్తయిన వెంటనే ఆయా కంపెనీల్లో శాశ్వత ఉద్యోగాలు దక్కించుకుంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, సర్వీస్ నౌ, ప్రావిడెన్స్ తదితర సంస్థలు కొన్ని నెలల క్రితం పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఇటీవల ఫలితాలను వెల్లడించాయి. హైదరాబాద్లోని 10-15 కళాశాలల విద్యార్థులు వందల సంఖ్యలో ప్రాంగణ నియామకాల ద్వారా ఆయా సంస్థల్లో ఇంటర్న్షిప్నకు ఎంపికయ్యారు. పలు సంస్థలు బీటెక్ రెండో ఏడాది రెండో సెమిస్టర్ విద్యార్థులకు కోడింగ్, ఆంగ్లం తదితర పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసుకుంటున్నాయి. వారు మూడో ఏడాదిలో రెండు నుంచి నాలుగు నెలలు ఆయా కంపెనీలకు వెళ్లి ఇంటర్న్షిప్ చేస్తారు. ఇందుకు కళాశాలలు విద్యార్థులకు హాజరు మినహాయింపును ఇస్తున్నాయి. ఇంటర్న్షిప్ కాలానికి వివిధ కంపెనీలు నెలకు రూ.30 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు స్టైపెండ్ ఇస్తున్నట్లు వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ప్రాంగణ నియామకాల డైరెక్టర్ పార్థసారథి తెలిపారు.
కొన్ని కళాశాలల్లో ఎంపికలు ఇలా..
* ఎంవీఎస్ఆర్ కళాశాలలో ఇటీవలే మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన ముగ్గురు విద్యార్థులు మైక్రోసాఫ్ట్ ఎంగేజ్ ఇంటర్న్షిప్నకు ఎంపికయ్యారు. వీరికి నెలకు రూ.1.25 లక్షల చొప్పున స్టైపెండ్ అందుతుంది.
* వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలలో 58 మంది విద్యార్థులు బీటెక్ రెండో ఏడాదిలోనే ‘జేపీ మోర్గాన్’లో ఇంటర్న్షిప్నకు ఎంపికయ్యారు. వారికి నెలకు రూ.70 వేల స్టైపెండ్ అందనుంది. వీరి బీటెక్ కోర్సు 2024 మే నాటికి పూర్తవుతుంది.
* వాసవి కళాశాల నుంచి ‘సర్వేస్ నౌ సమ్మర్’ ఇంటర్న్షిప్నకు ఎనిమిది మంది ఎంపికవగా.. వారికి నెలకు రూ.70 వేల చొప్పున స్టైపెండ్ అందుతుంది. అందులో ఒకరిని చదువు పూర్తయిన తర్వాత ఏడాదికి రూ.33 లక్షలతో కొలువులోకి తీసుకుంటామని ముందే ఆ కంపెనీ చెప్పిందని కళాశాల ప్రాంగణ నియామకాల అధికారి కిశోర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
19 జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 13, శాయంపేటలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాణిజ్యపన్నులు X ఆబ్కారీ
తెలంగాణలో ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖల మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది. పన్ను చెల్లింపుల్లో ఆబ్కారీశాఖ ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో వాణిజ్యపన్నుల శాఖ సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా నిలవగా... తాజాగా హాలోగ్రామ్ల అమ్మకాలకు సంబంధించి రూ.54 కోట్ల జీఎస్టీ చెల్లించాలని షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. -
ఈడీ ఛార్జిషీట్పై నేడు విచారణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుంది. -
ఓటేశారు.. తిరిగొచ్చారు..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు ఓటు వేయడానికి వెళ్లిన వారందరూ సోమవారం పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. -
పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆదేశించారు. -
నేడు విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
విశాఖ నుంచి సికింద్రాబాద్కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపింది. -
మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి కన్నుమూత
నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినయ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. నిందితుడు అరుణ్ రెడ్డికి బెయిల్
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ప్రసంగ వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుడు అరుణ్ రెడ్డికి దిల్లీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్న పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!