నిందితుడిగా భాజపా నేత సంతోష్
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొత్తగా నిందితులుగా చేర్చింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్లు కూడా..
నందకుమార్ వద్ద రూ. 55 లక్షలు తీసుకున్న న్యాయవాది శ్రీనివాస్
రుణంగానే తీసుకున్నట్లు విచారణలో వెల్లడి
ఒక పార్టీ కీలక నేతతోనూ లావాదేవీలు!
ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసు
ఈనాడు - హైదరాబాద్
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కొత్తగా నిందితులుగా చేర్చింది. ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్లు నిందితులుగా ఉన్నారు. సంతోష్తోపాటు కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్లను నిందితుల జాబితాలో చేర్చుతున్నట్లు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో సిట్ తాజాగా మెమో దాఖలు చేసింది. విచారణకు రావాలంటూ వీరందరికీ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా.. శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ రాలేదు. ఈ నెల 21, 22 తేదీల్లో విచారణకు వచ్చిన శ్రీనివాస్.. మూడో రోజు గైర్హాజరయ్యారు. హైకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆయన నేడో రేపో మళ్లీ విచారణకు వస్తారని భావిస్తున్నారు. నిందితులతో శ్రీనివాస్కు గల సంబంధాలపై కొంత సమాచారాన్ని సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నలుగురిని నిందితులుగా చేర్చింది. నిందితుడు నందకుమార్కు, న్యాయవాది శ్రీనివాస్కు మధ్య ఆర్థిక లావాదేవీలను సిట్ గుర్తించింది. రాష్ట్రంలోని ఓ జాతీయ పార్టీ కీలకనేతతోనూ శ్రీనివాస్ భారీఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపారన్న అనుమానంతో సిట్ కూపీ లాగుతోంది. నందకుమార్ నుంచి శ్రీనివాస్ రూ.55 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు సేకరించింది. ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నానని, వడ్డీగా నెలకు రూ. 1.1 లక్షలు చెల్లిస్తున్నానని శ్రీనివాస్ సిట్ అధికారులకు చెప్పగా.. ఫోన్పే, గూగుల్పే ఖాతాల వివరాలు సమర్పించాలని సిట్ సూచించింది. నందకుమార్ పలు విడతలుగా ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు గుర్తించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితులు సింహయాజి, నందకుమార్తో కలిసి పలు ప్రాంతాలకు సంచరించినట్లు గుర్తించి వాటిపైనా సిట్ దృష్టి సారించింది. విచారణకు హాజరైనప్పుడు శ్రీనివాస్ కొత్త ఫోన్ను మాత్రమే తీసుకొచ్చినట్లు సమాచారం. పాత ఫోన్ పాడైపోవడంతో జూన్ నుంచి కొత్త ఫోన్ను వినియోగిస్తున్నట్లు ఆయన సిట్కు తెలిపారు. కానీ పాత ఫోన్లో కీలక ఆధారాలుంటాయని సిట్ అనుమానిస్తోంది. ఈసారి వచ్చినప్పుడు ఆయన సరైన వివరాలు సమర్పించకుంటే కఠినచర్యలకు దిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
29న రావాలని రఘురామకు పిలుపు
ఈ కేసులో కొత్తగా ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (వైకాపా) పేరు వెలుగు చూసింది. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సిట్ 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్నం.76లోని చిరునామాతో వాట్సప్ ద్వారా ఈ నోటీసు పంపినట్లు సమాచారం. నిందితులు రామచంద్రభారతి, నందకుమార్లు రఘురామతో దిగిన చిత్రాలు గతంలో వైరల్ అయిన నేపథ్యంలో నోటీసు ప్రాధాన్యం సంతరించుకొంది. కేసులో కీలకంగా భావిస్తున్న కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి ఆచూకీ లభించకపోవడంతో అతడి సంబంధీకులకు సిట్ 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అతడి సోదరుడు మనీలాల్, వ్యక్తిగత సహాయకులు శరత్, ప్రశాంత్, విమల్, అమృత ఇన్స్టిట్యూట్ సీఎస్వో ప్రతాపన్లకు తాఖీదులు పంపింది.
నేడు సిట్ ముందుకు న్యాయవాది
న్యాయవాది ప్రతాప్గౌడ్ శుక్రవారం సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈయనకు ఇప్పటికే సిట్ 41ఏ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించినా.. శుక్రవారం సిట్ విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆయనను అరెస్టు చేయొద్దని సిట్కు స్పష్టం చేసింది. నందకుమార్ భార్య చిత్రలేఖ కూడా శుక్రవారం సిట్ ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం.
నోటీసులు రాలేదు: ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: తెలంగాణ పోలీసుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు రాలేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు పంపారన్న ప్రచారం చూసి.. తమ న్యాయవాదిని ఏసీబీ కోర్టుకు పంపినట్లు తెలిపారు. కానీ న్యాయవాది తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు. నోటీసు వస్తే తగిన విధంగా స్పందిస్తానన్నారు. కలలో కూడా అటువంటి చెత్త పనుల్లో తాను భాగస్వామిని కానని ఆయన తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ ప్రశ్నిస్తుందనే భయంతోనే.. ఎంపీ విజయసాయిరెడ్డి తన ఫోన్ను ధ్వంసం చేసి అది పోయిందంటూ నాటకాలాడుతున్నారని రఘురామ ఆరోపించారు.
దిల్లీలో రోజూ ఎంతోమంది తనతో ఫొటోలు దిగుతారని.. తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందకుమార్ అలా ఎప్పుడు ఫొటో దిగారో తెలియదని, అతడితో తనకు పరిచయమే లేదని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇదీ సంగతి!
-
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!