రూ.లక్ష సాయం పథకానికి రూ.400 కోట్లు

కులవృత్తులు చేసుకునే బీసీలకు పరికరాల కొనుగోలుకు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి రూ.400 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

Published : 12 Jul 2023 04:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: కులవృత్తులు చేసుకునే బీసీలకు పరికరాల కొనుగోలుకు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి రూ.400 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని బీసీ కార్పొరేషన్‌ ద్వారా వెచ్చించాలని ఆదేశించింది. ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి అర్హుల ఎంపికకు ప్రభుత్వం ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహిస్తోంది. త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి వారి పేర్లను గ్రామ పంచాయతీ బోర్డులపై అంటించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని