కాంగ్రెస్లో మూడు కమాండ్ల పాలన
వందేళ్లకు పైగా చరిత్ర అని చెప్పుకొనే కాంగ్రెస్కే వారంటీ అయిపోయిందని, అది ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్లో ఒకటి, బెంగళూరులో ఇంకొకటి, దిల్లీలో మరొకటి
వీరిలో ఒకరిమాట మరొకరు వినరు... ఒకరి హామీలు వేరొకరు నెరవేర్చరు
ఓట్ల కొనుగోలుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు
ప్రపంచానికి తెలుగువారి సత్తా చాటిన ఎన్టీఆర్, కేసీఆర్
ఖమ్మం, సత్తుపల్లి సభల్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఈటీవీ ఖమ్మం: వందేళ్లకు పైగా చరిత్ర అని చెప్పుకొనే కాంగ్రెస్కే వారంటీ అయిపోయిందని, అది ఇచ్చే హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హస్తం పార్టీ పీనుగుతో సమానమని విమర్శించారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్లో రూ.1,390 కోట్లు, సత్తుపల్లిలో రూ.142 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్ వద్ద నెలకొల్పిన దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం, సత్తుపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.
‘‘కాంగ్రెస్లో మూడుచోట్ల కమాండింగ్ వ్యవస్థలున్నాయి. అవి.. హైదరాబాద్లో లోకల్ కమాండ్, బెంగళూరులో న్యూ కమాండ్, దిల్లీలో హై కమాండ్. వీరిలో ఒకరిమాట మరొకరు వినరు. ఒకరు ఇచ్చిన హామీలు వేరొకరు నెరవేర్చరు. పార్టీని చూస్తే కప్పల తక్కెడ. ఎవరైనా పైకి ఎదుగుదామనుకుంటే మరో నలుగురు కిందకు లాగేస్తారు. అలాంటి పార్టీ ఉమ్మడి ఏపీని ఆరు దశాబ్దాలు పాలించింది. నాడు చేసిన దగా, మోసాలను ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ఎన్నికల వేళ ఆరు వారంటీలంటూ కొత్త వేషాలతో ఆ నేతలు ముందుకొస్తున్నారు. ఆ హామీలను దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అనేది తెలంగాణవాసులకు చెప్పాలి. గ్యారంటీలపై ఊదరగొట్టే నేతలకు సీటు దక్కుతుందన్న నమ్మకమే లేదు’’ అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా జరగడం లేదని ఆ పార్టీ ఎంపీ ఒకరు ఆరోపిస్తున్నారని, అది నిజమని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనే లక్ష్యంతో కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.వందల కోట్లు పంపుతున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్ని కోట్లు వెదజల్లినా అమ్ముడు పోయేందుకు రాష్ట్రం అంగడి సరకు కాదన్నారు. ఈ నిజం తెలిసేలా బెంగళూరు, దిల్లీ కమాండ్లకు ప్రజలు గట్టి సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పంచే దొంగ సొమ్ము తీసుకుని భారాసకు ఓటేయాలని అన్నారు.
ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టం
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఆయన స్థాయికి సీఎం పదవి చాలా చిన్నదన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ఎన్టీఆర్, తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన శిష్యుడు సీఎం కేసీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారు. భారాస అధినేత హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం’ అన్నారు. సత్తుపల్లిలో జరిగిన ‘ప్రగతి నివేదన’ సభా వేదికగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై పరోక్ష విమర్శలు గుప్పించారు. భారాసకు చెందిన మాజీ నేతలిద్దరూ తమ బాధలే జిల్లా ప్రజల బాధలుగా చిత్రీకరిస్తున్నారన్నారు. వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ తనకు టికెట్ రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారన్నారు. కానీ ఇదే కారణంతో ఆ నేతలు మాత్రం కేసీఆర్ని విమర్శించి పార్టీ మారారన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా మంత్రిని చేశామని, నిన్నటి వరకు దేవుడిగా కొలిచిన సీఎం ఇప్పుడు దయ్యం ఎలా అయ్యారని తుమ్మలను ప్రశ్నించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినతితో సత్తుపల్లి నియోజకవర్గానికి సీఎం ‘దళితబంధు’ ప్రకటించారన్నారు. హుజూరాబాద్ తరహాలో పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షం కారణంగా మంత్రి భద్రాచలం పర్యటన రద్దయింది. కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, మేయర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.
రాముడైనా.. కృష్ణుడైనా మనకు ఎన్టీఆరే
ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఆయన ఆరాధ్య దైవం. మనకు రాముడైనా.. కృష్ణుడైనా ఎన్టీఆరే.
కేటీఆర్
తెలంగాణలో ఎన్నికల కోసం కర్ణాటకలో బిల్డర్లపై పన్ను
‘స్కాంగ్రెస్’కు తిరస్కరణ తప్పదు
ట్విటర్లో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని, తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను విధిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను విధిస్తోందని ఆయన శనివారం ఎక్స్(ట్విటర్) ద్వారా ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కామ్ల వారసత్వంతో ‘స్కాంగ్రెస్’గా మారిందని, కర్ణాటక రాష్ట్ర నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇక్కడి ప్రజలు స్కాంగ్రెస్ను తిరస్కరిస్తారని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. -
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నికలను సజావుగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. -
ప్రచారం పరిసమాప్తం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూలు ప్రకటించింది. -
ఎప్సెట్ ఇంజినీరింగ్కు 2.4 లక్షల మంది హాజరు
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
దేశ ప్రగతికి మోదీ అవసరం
దేశ ప్రగతి కోసం మరోసారి ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భాజపా మాజీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అన్నారు. -
ఎనలేనిది.. అమ్మ త్యాగం..
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం.. ఇన్ని గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. -
‘చేనేత సంఘాల్లో 30 శాతానికి పైగా బోగస్’
గత ప్రభుత్వ హయాంలో టెస్కో నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణా కోసం జరిగిన చెల్లింపుల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛను చెల్లించాల్సిందే..
ఏపీ విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. -
‘ఎన్నికల్లో పౌరుల బాధ్యతల్ని వివరించాం’
భాజపాను ఓడించాలని ‘జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక’ సంయుక్తంగా చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. ఈనెల 1న ప్రారంభమైన యాత్ర 11 రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకుంది. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: బీఎంఎస్
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తిసెలవు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్