ట్యాపింగ్ వెనక ప్రముఖులు!
ఫోన్ట్యాపింగ్ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది.
ఉన్నతస్థాయి నుంచే ఆదేశాలు..
పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు
చంచల్గూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు
ఈనాడు - హైదరాబాద్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులూ దీని వెనక ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం లభించింది. అయితే సున్నితమైన అంశం కావడంతో మరింత లోతుగా ఆరా తీసి పకడ్బందీ ఆధారాలతో కేసును బలోపేతం చేయాలని నిర్ణయించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో ఇప్పటివరకు అతడితోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే మరికొందరిని అరెస్టు చేయనున్నారు. ఈ జాబితాలో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు విశ్రాంత, ప్రస్తుత పోలీస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురు నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మంగళవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఆక్సిలరేటెడ్ పదోన్నతిపై ఆరా
వాస్తవానికి ప్రణీత్రావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. 2018లో ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్గా చేరిన ఆయన 2023లో డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి పొందారు. ఇందుకోసం మావోయిస్టు కార్యకలాపాల సమాచారం అందించినట్లు నివేదిక రూపొందించారు. తొలుత ఈ నివేదికను రివ్యూకమిటీలో ఉన్నతాధికారి ఒకరు తిరస్కరించారు. ఆయన సెలవులో ఉన్న సమయంలో పదోన్నతికి మార్గం సుగమం చేయించుకున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదమూ ఉండటంతో అది సాధ్యమైంది. తాజాగా అతడి పదోన్నతిపై ఫిర్యాదులు అందడంతో అప్పటి దస్త్రాన్ని బయటికి తీశారు. పదోన్నతి ఇప్పించడంలో ఎవరి పాత్ర ఉంది..? ఒకవేళ అడ్డదారిలో పొందితే సహకరించిందెవరు..? అనే అంశాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ఏప్రిల్ 6 వరకు అదనపు ఎస్పీలకు రిమాండ్
ఈ వ్యవహారంలో అరెస్టయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఐపీసీ 120ఏ, 409, 427, 201, 34 ఆఫ్ సెక్షన్ 3 పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్లు నమోదు చేశారు. ఆదివారం ఉదయం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో వీరిని ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఏప్రిల్ 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. శనివారంతో దుగ్యాల ప్రణీత్రావు ఏడు రోజుల కస్టడీ ముగియడంతో ఆయన్నీ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రణీత్రావునూ జైలుకు తరలించారు.
శివార్లలో ఆపరేషన్లు.. సొమ్ము పక్కదారి
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏళ్ల తరబడి ఫోన్ట్యాపింగ్కు అలవాటు పడిన ప్రణీత్ బృందం నిర్వాకాలు గత శాసనసభ ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకున్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయటి ప్రాంతాలకు భారీగా తరలిస్తారని ఫోన్ ట్యాపింగ్ను విస్తృతం చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కదని ప్రణీత్ బృందం వ్యూహం మార్చి శివార్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ట్యాపింగ్లో గుర్తించిన హవాలా లావాదేవీలపై దృష్టిపెట్టి దొరికిన సొమ్మును భారీగా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తు బృందం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. -
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నికలను సజావుగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. -
ప్రచారం పరిసమాప్తం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూలు ప్రకటించింది. -
ఎప్సెట్ ఇంజినీరింగ్కు 2.4 లక్షల మంది హాజరు
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
దేశ ప్రగతికి మోదీ అవసరం
దేశ ప్రగతి కోసం మరోసారి ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భాజపా మాజీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అన్నారు. -
ఎనలేనిది.. అమ్మ త్యాగం..
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం.. ఇన్ని గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. -
‘చేనేత సంఘాల్లో 30 శాతానికి పైగా బోగస్’
గత ప్రభుత్వ హయాంలో టెస్కో నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణా కోసం జరిగిన చెల్లింపుల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛను చెల్లించాల్సిందే..
ఏపీ విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. -
‘ఎన్నికల్లో పౌరుల బాధ్యతల్ని వివరించాం’
భాజపాను ఓడించాలని ‘జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక’ సంయుక్తంగా చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. ఈనెల 1న ప్రారంభమైన యాత్ర 11 రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకుంది. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: బీఎంఎస్
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తిసెలవు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!