జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
పిడుగుపాటుకు ఒకరు, వడదెబ్బతో మరొకరి మృతి
మిర్యాలగూడలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం
ఈనాడు, హైదరాబాద్- కల్హేర్, పలిమెల, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని 11 మండలాల్లో 44.1 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలు వేడితో అల్లాడాయి. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో 5.4 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కుభీరు మండలంలో 3.2, కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో 3, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో 2.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున అకాల వర్షానికి పలువురు రైతుల ధాన్యం తడిసిపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), సూర్యాపేట జిల్లా సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), నల్గొండ జిల్లా కనగల్, నార్కట్పల్లి మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్పల్లిలో సోమవారం సాయంత్రం రేణుక(30) అనేక వివాహిత పిడుగుపాటుకు గురై మృతిచెందారు. అలాగే భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రానికి కుమ్మరి అనిత(45) వడదెబ్బతో మృతిచెందినట్లు పోలీసు కేసు నమోదైంది. అడ్డగూడూరు మండలం కంచనపల్లిలో పిడుగుపాటుకు భాషబోయిన లింగయ్య పాడిగేదె మృతిచెందింది. మంగళ, బుధవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!