లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది.
ఆర్అండ్బీ ఏఈ అప్పీలు కొట్టివేత
ఈనాడు, హైదరాబాద్: లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. ముడుపుల కేసులో ఏసీబీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ వరంగల్ జిల్లా పరిధిలోని ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజినీరు ఎస్.రాఘవేందర్ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ సమయంలో రిమాండ్లో ఉన్న కాలాన్ని మినహాయించి మిగిలిన శిక్షను అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఆ వివరాలివీ.. రామగూడెం నుంచి పండవారిగూడేనికి ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణ పనిని కాంట్రాక్టర్ గడువులోగా పూర్తిచేశారు. ఆర్అండ్బీ ఏఈగా ఉన్న రాఘవేందర్ పని పూర్తయినట్లు ఎంబుక్లో నమోదు చేశారు. చేసిన పనికి.. రూ.2 లక్షల నగదు, 34 టన్నుల బియ్యాన్ని కాంట్రాక్టరుకు అప్పగించాలి. అయితే రూ.లక్ష నగదు, 19 టన్నుల బియ్యం పెండింగ్లో ఉండటంతో ఏఈ రాఘవేందర్ను కాంట్రాక్టర్ సంప్రదించారు.
ఆ మొత్తం విడుదలకు రూ.30 వేలు డిమాండ్ చేసి చివరికి రూ.20 వేలకు ఏఈ అంగీకరించారు. దీనిపై కాంట్రాక్టరు ఏసీబీకి ఫిర్యాదు చేయగా 2003 ఆగస్టులో ట్రాప్ చేసి రాఘవేందర్పై కేసు నమోదు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపి నిందితుడైన రాఘవేందర్కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. దీన్ని సవాలు చేస్తూ రాఘవేందర్ హైకోర్టులో అప్పీలు దాఖలుచేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె.సురేందర్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఆ మొత్తాన్ని రుణంగా తీసుకున్నానని, ప్రభుత్వ భూమిలో కాంట్రాక్టరు ఆక్రమణలను తొలగించినందుకు కక్షతో ఫిర్యాదు చేశారన్న అప్పీలుదారు వాదనతో న్యాయమూర్తి విభేదించారు. ఆక్రమణలు తొలగించారని కక్ష పెట్టుకున్న వ్యక్తి నుంచి రుణం తీసుకుంటున్నానన్న వాదన అసంబద్ధంగా ఉందని పేర్కొన్నారు. రుణంగా తీసుకున్నట్లు ప్రామిసరీ నోటుగానీ, రసీదుగానీ చూపలేదని, అప్పీలును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నికలను సజావుగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. -
ప్రచారం పరిసమాప్తం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూలు ప్రకటించింది. -
ఎప్సెట్ ఇంజినీరింగ్కు 2.4 లక్షల మంది హాజరు
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. -
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
దేశ ప్రగతికి మోదీ అవసరం
దేశ ప్రగతి కోసం మరోసారి ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భాజపా మాజీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అన్నారు. -
ఎనలేనిది.. అమ్మ త్యాగం..
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం.. ఇన్ని గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. -
చేనేత సంఘాల్లో 30 శాతానికి పైగా బోగస్
గత ప్రభుత్వ హయాంలో టెస్కో నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణా కోసం జరిగిన చెల్లింపుల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛను చెల్లించాల్సిందే..
ఏపీ విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. -
‘ఎన్నికల్లో పౌరుల బాధ్యతల్ని వివరించాం’
భాజపాను ఓడించాలని ‘జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక’ సంయుక్తంగా చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. ఈనెల 1న ప్రారంభమైన యాత్ర 11 రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకుంది. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: బీఎంఎస్
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తిసెలవు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది. -
వేసవిలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా
వేసవిలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఇంజినీర్లకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) అభినందనలు తెలిపింది.