పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ అమలు
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
విద్యార్థుల చేతులకు గోరింటాకు, పచ్చబొట్టు ఉండొద్దు
ఏపీ విద్యార్థులకు ఈ సంవత్సరమూయథావిధిగా ప్రవేశాలు
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి
ఈనాడు,హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానం (సీబీటీ)లో వచ్చే నెల 7,8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ..9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అన్ని పరీక్షలకు కలిపి ఇప్పటివరకు 3,54,843 మంది దరఖాస్తు చేసుకున్నారని, అగ్రికల్చర్, ఫార్మసీ దరఖాస్తుదారులకు సోమవారం నుంచే హాల్టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఇంజినీరింగ్ వారు మే 1వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈఏపీసెట్ నిర్వహణపై సోమవారం జేఎన్టీయూహెచ్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వీసీ కట్టా నరసింహారెడ్డి, సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్కుమార్, అరుణకుమారి తదితరులతో కలిసి లింబాద్రి వివరాలు వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించం
ఈ పరీక్షల్లో తొలిసారి ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం అమలుచేస్తున్నట్టు లింబాద్రి వెల్లడించారు. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు. అభ్యర్థులను 90 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమయ్యే సమయం దాటి నిమిషం ఆలస్యమయినా అనుమతించబోమని తెలిపారు. ‘‘సెల్ఫోన్ సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించం. నీళ్ల సీసాల వంటివీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించేది లేదు. విభజన చట్టం జూన్ 2వ తేదీ వరకు అమలులో ఉంటుంది. అంతకంటే ముందే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయినందున ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని’ లింబాద్రి స్పష్టం చేశారు. రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
అగ్రికల్చర్, ఫార్మసీకి 135.. ఇంజినీరింగ్కు 166 కేంద్రాలు
రాష్ట్రంలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో, ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలో మొత్తం 135 కేంద్రాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 166 కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్టికెట్, ఆన్లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ తెచ్చుకోవాలి. విద్యార్థి చదివిన కళాశాలకు చెందిన గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డు లేదా ఇతర ఆధారాల్లో ఒకటి తేవాలి. పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్టికెట్పై సంతకం చేయాలి.
హాల్ టికెట్ల డౌన్లోడ్ ఇలా..
హాల్టికెట్లు eapcet.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు, ఇంటర్ హాల్టికెట్ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదయ్ యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. -
మాట ఇచ్చా.. మాఫీ చేయాల్సిందే
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. -
మేడిగడ్డపై పీటముడి!
మరో రెండు వారాల్లోనే వర్షాకాలం ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. -
నెలాఖరులోగా కొత్త వీసీలు
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతుల (వైస్ ఛాన్సలర్ల) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అనుమతి ఇచ్చింది. -
ఏఐతో ఎంచక్కా వైద్యం
డయాబెటిక్ రెటీనోపతి.. కంటిచూపును శాశ్వతంగా దెబ్బతీసే వ్యాధి. మధుమేహుల్లో సుమారు 8-10 శాతం మంది దీని బారిన పడుతున్నారు. దీన్ని ముందస్తుగా గుర్తిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. -
తియ్యటి జొన్న.. ఇథనాల్లో మిన్న!
తెల్ల, పచ్చ జొన్నలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రజలు ఆహారంలో వాటిని భాగం చేసుకుంటారు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో రకం జొన్న పంట సాగుపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. -
బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
దిల్లీ మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. -
వేధించాడని జైలుశిక్ష... పెళ్లి చేసుకున్నాడని విముక్తి
ప్రేమ పేరిట ఓ అమ్మాయిని వేధించిన యువకుడికి కింది కోర్టు రెండున్నరేళ్ల శిక్ష విధిస్తే, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హైకోర్టు దాన్ని 3నెలలకు తగ్గించింది. -
సుంకం చెల్లించని మద్యం స్వాధీనంలో రికార్డు!
లోక్సభ ఎన్నికల సమయంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుంకం చెల్లించని మద్యం (ఎన్డీపీఎల్)తో పాటు ఇతర మాదకద్రవ్యాల స్వాధీనంలో తెలంగాణ ఆబ్కారీశాఖ రికార్డు సృష్టించింది. -
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలి
విద్యుత్ సంస్థల్లో గతంలో ఇచ్చిన పదోన్నతులను సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. -
కేయూలో తాత్కాలిక అధ్యాపకుల ఆందోళన
కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తాత్కాలిక అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 70 మంది అధ్యాపకులు ఒక్కసారిగా రిజిస్ట్రార్ మల్లారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు ఆయన్ను కాసేపు గదిలో బంధించారు. -
45% ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను పీఆర్టీయూ తెలంగాణ సంఘం కోరింది. -
పైలట్ శిక్షణ ఇవ్వడంలో జాప్యం.. అకాడమీకి జరిమానా
పూర్తి ఫీజు వసూలు చేసి పైలట్ శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేసిన ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ లిమిటెడ్కు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. -
తడిసిన ధాన్యం.. కర్షకుడి దైన్యం
అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. హనుమకొండ, వరంగల్లో మూడు రోజుల క్రితం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతో వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. -
15% స్థానికేతర కోటాపై సందిగ్ధత
ఏపీలో అమలు చేస్తున్న 15% స్థానికేతర(ఓపెన్) కోటాపై సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత విడుదల చేసే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లకు 15% కోటా ఉండదని ఇప్పటికే తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. -
ఎన్నికల విధుల వేతనాల్లో వ్యత్యాసాలు తొలగించాలి
లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకు అందించే వేతనాల్లో వ్యత్యాసాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. -
120 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి
వానాకాలం సీజన్లో 60.53 లక్షల ఎకరాల్లో సాగు కానున్న పత్తి పంటకు 120 లక్షల ప్యాకెట్ల బీజీ2 విత్తనాలను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. -
30 లక్షల టన్నులు దాటిన ధాన్యం సేకరణ
రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం 30 లక్షల టన్నులు దాటింది. 4.94 లక్షల మంది రైతులు వడ్లను విక్రయించారు. -
పోలీసు శాఖలో మరోమారు భారీగా బదిలీలు!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో మరోమారు పోలీసుశాఖలో భారీగా బదిలీల పర్వానికి తెరలేస్తోంది. -
జులై 5న సీపీజీఈటీ
రాష్ట్రంలోని పీజీ కళాశాలల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష(టీఎస్ సీపీజీఈటీ) జులై 5న జరగనుంది. -
ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుపై వివరాల సేకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదుపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.