Justice NV Ramana: తెలుగోడి గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటండి
తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని, విమర్శించే బానిస
మన వారిని మనం విమర్శించుకునే బానిస మనస్తత్వం విడనాడాలి
తెలుగు భాష, సంస్కృతులను గౌరవించండి
డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు - హైదరాబాద్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా గురువారం రామినేని
ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారాన్ని అందుకుంటున్న భారత్ బయోటెక్
సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల
తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తోటి తెలుగువారిపై చులకన భావాన్ని విడనాడాలని, విమర్శించే బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని సూచించారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అయినా మన దేశంలో తయారైందంటూ కొందరు నిరుత్సాహపరిచారని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఫిర్యాదు చేశారని, గుర్తింపురాకుండా పలు ప్రయత్నాలు చేశారని అన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకుండా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మనవాళ్లు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నించారన్నారు. తెలుగువాళ్లలో ఐక్యత అవసరమని, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనవారితో కలిసి తెలుగువారి గొప్పదనాన్ని తెలియజేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో గురువారం జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృమూర్తిని, మాతృభాషను, దేశాన్ని గౌరవించడం సంప్రదాయమన్నారు. బాధ్యతగల వ్యక్తులు సమాజం కోసం పనిచేయాల్సి ఉందంటూ గురజాడ చెప్పిన ‘దేశమంటే మనుషులోయ్’ అన్న గేయాన్ని వినిపించారు. తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని, కనీసం ఇంట్లో అయినా మాట్లాడే అవకాశం కల్పించాలని, సాహిత్యాన్ని చదవడంతోపాటు తెలుగు నాటకాలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు తదితరాలను ప్రోత్సహించాలన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా నాగలి
అందుకుంటున్న నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు.
చిత్రంలో రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం
కృష్ణ ఎల్ల దంపతులు కష్టాలతో ఎదిగారు
అవార్డు గ్రహీతల్లో చాలా మంది తన జీవన గమనంలో సుపరిచితులని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. వారికి పురస్కారాలు ప్రదానం చేయడం గొప్ప అవకాశమన్నారు. వారు ఇతరుల సహకారంతో కాకుండా కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల పలు కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. అమెరికాలో చిన్నచిన్న ఉద్యోగాలు చేశారని తెలిపారు. కృష్ణ పరిశోధనలు చేస్తున్నపుడు సుచిత్ర ఉద్యోగం చేస్తూ అండగా నిలిచారన్నారు. దేశానికి ఏదైనా సేవ చేయాలని ఇక్కడికి వచ్చి పలు కష్టాలు ఎదుర్కొని ఒకానొక దశలో వెనక్కి వెళ్లిపోవాలనుకున్నారన్నారు. అయితే మనోనిబ్బరంతో నిలబడి కరోనా వ్యాక్సిన్ను తయారు చేసి భారత కీర్తిపతాకను గగన వీధుల్లో ఎగురవేశారన్నారు. అవార్డు అందుకున్న డాక్టర్ మస్తాన్ 20 ఏళ్లుగా తనతోపాటు మరో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా మలయాళీ అయిన సుమ గత జన్మలో తెలుగువారై ఉంటారని, తెలుగు గొప్పదనాన్ని చాటుతున్న సుమ ఈ తరానికి ఆదర్శప్రాయమన్నారు. బండ్లమూడి శ్రీనివాస్ శిరిడీలో వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆహారం అందజేస్తున్నారన్నారు. అత్యంత సన్నిహితుడైన బ్రహ్మానందం హాస్యనటుడనుకోరాదని, డైనమేట్లాంటి వ్యక్తి అన్నారు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిని తనకు కల్పించారని, కష్టపడి పైకి వచ్చారని తెలిపారు.
పురస్కారం స్వీకరిస్తున్న సినీనటుడు బ్రహ్మానందం
డాక్టర్ దుర్గా పద్మజ పలువురికి సేవలందించారని, ఎస్వీ రామారావు సినిమా రంగానికి చేసిన సేవలు మరువలేనివన్నారు ఆయన సేవలను మనం సరిగా వాడుకోలేదనిపిస్తోందన్నారు. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు వ్యవసాయ కుటుంబంలో పుట్టారని, కరోనా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు, గ్రామీణ మహిళలకు అండగా నిలిచారన్నారు. రామినేని దంపతులు 1950 ప్రాంతంలోనే ఆమెరికా వెళ్లినా హిందూ ధర్మాన్ని, సంస్కృతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మూలాలను మర్చిపోకుండా పిల్లలకు, సంస్కృతిని, భాషను నేర్పించారన్నారు. ఆ పిల్లలే నేడు మహావృక్షాలుగా నిలబడి దేశవ్యాప్తంగా ప్రముఖులను గుర్తించి 20 ఏళ్లకుపైగా అవార్డులను అందజేయడం గొప్పవిషయమని అభినందనలు తెలిపారు.
పురస్కారం స్వీకరిస్తున్న వ్యాఖ్యాత సుమ
టీకాల తయారీలో భారత నాయకత్వం గర్వకారణం: కృష్ణ ఎల్ల
టీకాల తయారీలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణమని భారత్ బయోటెక్ వ్యవస్థాపక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్ల అన్నారు. రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారాన్ని గురువారం స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇతర దేశాల మీద ఆధార పడుతున్నామన్నారు. ఆవిష్కరణల వైపు అడుగులు వేయలేకపోతున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు వచ్చిందని, తాను 20 ఏళ్ల క్రితమే దీన్ని నమ్మానని గుర్తు చేశారు. ఎంచుకున్న మార్గంలో ఎంతటి ప్రమాదం ఎదురైనా ముందుకే వెళ్లాలన్నారు. భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ, ఓర్పు విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తనకు తానే సాటి అన్నారు. అంతగొప్ప వ్యక్తిని చూసి ఎంతో నేర్చుకుంటున్నానని తెలిపారు. టీకా తయారీ ఘనత తమది మాత్రమే కాదని.. అది భారత్ బయోటెక్లో పనిచేసే 2000 మంది ఉద్యోగుల కష్టంతో సాధించిన విజయమన్నారు. నాబార్డు ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజు మాట్లాడుతూ సామాజికసేవ చేస్తున్న వారికి అవార్డులు అందించటం హర్షణీయమన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ జస్టిస్ ఎన్వీ రమణ పక్కవాళ్ల కష్టం, సమన్యాయం తెలిసిన మనిషి అన్నారు. వ్యాఖ్యాత సుమ మాట్లాడుతూ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ మహిళా సాధికారికతకు పెద్దపీట వేశారన్నారు. కార్యక్రమంలో రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం, మాజీ మంత్రి చంద్రమోహన్రెడ్డి, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, రామినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజుకు నాగలి బహూకరించారు.
అవార్డు గ్రహీతలు వీరే
* రామినేని విశిష్ఠ పురస్కారం (2021): డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల.
* రామినేని విశిష్ఠ పురస్కారం (2020): నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు
* విశేష పురస్కారం (2021): హాస్యనటుడు బ్రహ్మానందం, ప్రొఫెసర్ దుర్గా పద్మజ, సినీ జర్నలిస్టు ఎస్.వి.రామారావు
* విశేష పురస్కారం (2020): యాంకర్ సుమ, డాక్టర్ మస్తాన్ యాదవ్, బండ్లమూడి శ్రీనివాస్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధించిన వైకాపా ప్రభుత్వం.. చివరికి ఆయన, ఆయన సతీమణి ఓటు హక్కు లేకుండా చేసింది. -
జనచైతన్య సంస్థల డైరెక్టర్ శకుంతల కన్నుమూత
జనచైతన్య గ్రూప్ సంస్థల వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ మాదల శకుంతల(86) గుంటూరు రాజేంద్రనగర్లోని స్వగృహంలో సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. -
19 జిల్లాల్లో వర్షాలు..
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 13, శాయంపేటలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాణిజ్యపన్నులు X ఆబ్కారీ
తెలంగాణలో ఆబ్కారీ, వాణిజ్యపన్నుల శాఖల మధ్య వివాదం తార స్థాయికి చేరుకుంది. పన్ను చెల్లింపుల్లో ఆబ్కారీశాఖ ఎగవేతకు పాల్పడిందనే అనుమానంతో వాణిజ్యపన్నుల శాఖ సోదాలు నిర్వహించడం ఆసక్తికరంగా నిలవగా... తాజాగా హాలోగ్రామ్ల అమ్మకాలకు సంబంధించి రూ.54 కోట్ల జీఎస్టీ చెల్లించాలని షోకాజ్ నోటీస్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. -
సీబీఎస్ఈ ఫలితాల విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12 తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. అబ్బాయిలపై అమ్మాయిలు పైచేయి సాధించారు. -
ఈడీ ఛార్జిషీట్పై నేడు విచారణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుంది. -
ఓటేశారు.. తిరిగొచ్చారు..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు ఓటు వేయడానికి వెళ్లిన వారందరూ సోమవారం పోలింగ్ ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు. -
పంట నష్టాలపై నివేదికకు మంత్రి తుమ్మల ఆదేశం
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆదేశించారు. -
నేడు విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
విశాఖ నుంచి సికింద్రాబాద్కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపింది. -
మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి కన్నుమూత
నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినయ్నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. నిందితుడు అరుణ్ రెడ్డికి బెయిల్
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్ షా ప్రసంగ వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టు అయిన నిందితుడు అరుణ్ రెడ్డికి దిల్లీ కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్న పాత్రికేయులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక