Telangana Formation Day 2023: ‘దశ’దిశలా కీర్తిని చాటేలా
తెలంగాణ దశాబ్ది ప్రారంభ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం అవతరించాక అభివృద్ధి, సంక్షేమంతో సహా వివిధ రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో ఉత్సవాలను 21 రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబురాలు
తొమ్మిదేళ్ల పాలన ప్రస్ఫుటించేలా దశాబ్ది వేడుకలు
ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ దశాబ్ది ప్రారంభ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం అవతరించాక అభివృద్ధి, సంక్షేమంతో సహా వివిధ రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో ఉత్సవాలను 21 రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. శుక్రవారం ఈ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ ఉద్యమం ద్వారా స్వరాష్ట్రం సిద్ధించాక తన ముద్రను చాటుకొనేలా చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని చెబుతున్న ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో రంగంలో సాధించిన అభివృద్ధిని కళ్లకు కట్టేలా ఉత్సవాలను నిర్వహించనుంది. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సాగు, తాగు, పారిశ్రామిక, వైద్య తదితర రంగాల్లో చేసిన అభివృద్ధి, రైతుబంధు, రైతు బీమా, పరిపాలన వికేంద్రీకరణ ఇలా అనేక రంగాల్లో సాధించిన కృషిని వివిధ రూపాల్లో ప్రజలకు చెప్పనుంది. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం... దీని ద్వారా తెలంగాణలోకి అత్యధిక ప్రాంతానికి సాగు నీరు అందించడం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విస్తరణ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పెట్టుబడులు, వచ్చిన ఉద్యోగాలు, నూతన సచివాలయం, యాదాద్రి ఆలయ నిర్మాణం, 125 అడుగుల డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు, సమీకృత కలెక్టరేట్ భవనాలు, హరితహారం... ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. వరి సాగు, దిగుబడిలో తెలంగాణ అతి తక్కువ కాలంలో అనూహ్య ప్రగతి సాధించిన తీరునూ ఆవిష్కరించనుంది. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేశామంటూ దశాబ్ది ఉత్సవాల్లో చాటిచెప్పనుంది. వీటితోపాటు ఇలాంటి అనేక కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లనుంది. వాటిలో కొన్ని ప్రధానమైనవి ఇలా ఉన్నాయి...
సంక్షేమ పంథా
సంక్షేమ రంగంలో అన్ని వర్గాల ప్రజలకు జీవన భద్రత, భరోసా, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బర్రెలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, గిరిజన తండాలకు గ్రామ పంచాయతీల హోదా, గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బ్రాహ్మణులకు విదేశీ విద్యానిధి, ఇంటింటికీ రక్షిత నీటిని ఇచ్చే మిషన్ భగీరథ, చిన్న నీటి వనరులకు జీవం పోస్తూ మిషన్ కాకతీయ... వంటి పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. వీటికి ప్రతి సంవత్సరం రూ.50 వేల కోట్లకుపైగా వెచ్చిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేయూత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్య, సామాజిక వికాసంతోపాటు ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. దళితులను వ్యాపార వర్గంగా మార్చేందుకు దళితబంధును ప్రవేశపెట్టి రూ.10 లక్షలను ఇస్తోంది. ఇప్పటికే 38,323 మందిని గుర్తించి వారికి రూ.3,832.30 కోట్లను అందించింది.
మహిళాభివృద్ధి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతోపాటు తల్లీబిడ్డలకు అవసరమైన వస్తువులను ఉచితంగా అందించే కేసీఆర్ కిట్ పథకాన్ని 2017 జూన్ రెండు నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. గర్భిణుల్లో రక్తహీనత, పోషకార లోపాలను నియంత్రించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకానికి రూపకల్పన చేసింది. దవాఖానాలకు పరీక్షల కోసం వెళ్లే గర్భిణులు, శిశువులకు అమ్మ ఒడి రవాణా సేవలు అందించేందుకు 300 వాహనాలను సమకూర్చింది. ఆరోగ్యలక్ష్మి ద్వారా అంగన్వాడీల్లో గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని వేడివేడిగా అందిస్తోంది. ఆరు నెలల నుంచి 5 సంవత్సరాలలోపు పేద పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడకుండా బాలామృతం ప్లస్ పేరిట బలవర్ధక ఆహారాన్ని ఇస్తోంది.
వ్యవసాయం, అన్నదాతలకు అండదండలు
వ్యవసాయరంగ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుబంధు, రైతు బీమా, పంట రుణాలు మాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత విద్యుత్తు, గోదాముల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వంటి ఎన్నో చర్యలు తీసుకుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వ్యవసాయశాఖ ఎండాకాలంలోనే తెప్పించి, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచుతోంది. వాటిని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై అందజేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018 నుంచి మే 2023 నాటికి 10 విడతల్లో 65,00,588 మంది రైతులకు రూ.65,910.32 కోట్లను అందజేసింది. రైతులు మృతిచెందితే రైతుబీమా అమలు చేస్తోంది. ఇప్పటివరకు లక్ష రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల బీమా సాయం అందింది. వ్యవసాయానికి తొమ్మిదేళ్లుగా 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తోంది.
నీటి పారుదల
ప్రపంచంలోనే ఎత్తైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది. దీని కింద పాత ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్త ఆయకట్టుకు నీరిస్తోంది. ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడం, సింగూరు వెనకతట్టులో రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టి వెనకబడిన ప్రాంతాలకు నీరందించడం, హైదరాబాద్కు తాగునీటి సరఫరా... ఇలా అనేక లక్ష్యాలను ఈ పథకం ద్వారా సాధించింది. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ బ్యారేజి పనులు చివరి దశకు వచ్చాయి. తుపాకుల గూడెం బ్యారేజి నిర్మాణం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించింది. దాంతో చెరువుల్లో నీటితోపాటు భూగర్భ జలమట్టమూ గణనీయంగా పెరిగింది.
వైద్యం, ఆరోగ్యం
ప్రజల ఆరోగ్య సంరక్షణ, వైద్యారోగ్యరంగాల అభివృద్ధి లక్ష్యంగా నగరాల్లో బస్తీ, గ్రామాల్లో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసింది. కంటివెలుగు ద్వారా కంటిచూపు సమస్యల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉచిత కంటి పరీక్షలు చేయించి, కళ్లద్దాలను అందించింది. రాష్ట్రవ్యాస్తంగా 20 తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ల ద్వారా 60 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తోంది. తెలంగాణలో 2014 నాటికి 700 ఎంబీబీఎస్ సీట్లతో కేవలం అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి (ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, ఆదిలాబాద్ రిమ్స్). రాష్ట్రం ఏర్పడ్డాక సిద్దిపేట, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండం, నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్లలో కళాశాలలు మంజూరయ్యాయి. ప్రస్తుతం 26 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 4,440 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
పారిశ్రామిక, ఐటీ రంగాలు
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ పురోగమించింది. టీఎస్ ఐపాస్ ద్వారా తొమ్మిదేళ్లలో రూ.2,61,732 కోట్ల పెట్టుడులతో 23,065 పరిశ్రమలు రాగా 15.74 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఐటీ రంగంలోనూ ఎగుమతులు రూ. 1,83,569 కోట్లకు చేరగా... 7.78 లక్షల మందికి ఉపాధి లభించింది. ఇందులో 26.14% వృద్ధిరేటును సాధించింది. టీహబ్, టీవర్క్స్, టీఎస్ఐసీ వంటి వాటి ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమిచ్చింది. వీటితోపాటు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, రోడ్ల అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లో చేసిన ప్రగతి పనుల గురించి ప్రజలకు వివరించనుంది.
దశాబ్ది వేడుక.. ‘నవ’ధాన్యాల కానుక!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కళాకారులు నవధాన్యాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ పార్థసారథిరెడ్డి చిత్రాలను తీర్చిదిద్దారు. మొదట ప్లైవుడ్ షీట్లపై పెన్సిల్తో ఆర్ట్ వేసిన కళాకారులు జి.బాలకృష్ణ, ఆయన కుమార్తెలు నిర్మలాసాయిశ్రీ, సౌజన్య తదితరులు నవధాన్యాలను వినియోగించి వారి చిత్రాలకు చూడచక్కని రూపం కల్పించారు.
ఈనాడు, ఖమ్మం
త్రివర్ణ సాగరం
రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా త్రివర్ణ కాంతులతో వెలుగులీనుతున్న నాగార్జునసాగర్ డ్యాం
న్యూస్టుడే, నాగార్జునసాగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కవిత బెయిల్ పిటిషన్పై మీ స్పందన తెలపండి
భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను దిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. -
విమాన ఛార్జీల మోత
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావుకు అరెస్టు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు, ఏ6 మీడియా సంస్థ యజమాని శ్రవణ్కుమార్లకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ
వచ్చే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..రైతాంగ సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. -
సెప్టెంబరు 15లోపు ఇంజినీరింగ్ తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. -
వైద్యుడిగా పేరు నమోదు చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ డా.బల్మూరి వెంకట్ తెలంగాణ వైద్య మండలి (టీఎంసీఐ)లో తన పేరు నమోదు చేయించుకున్నారు. ఆయన కరీంనగర్లోని చల్మెడ వైద్య కళాశాలలో 2021లో ఎంబీబీఎస్, 2022లో అదే కళాశాలలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు. -
తూర్పు కనుమల్లోని 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి
తూర్పు కనుమల్లోని సుమారు 60 శాతం నీటి వనరుల్లో క్యాట్ఫిష్ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ(ఈ-డీఎన్ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. -
జ్యుడిషియల్ సర్వీసు నిబంధనల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి జారీ చేసిన నిబంధనల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
గురుకుల ‘జూనియర్’ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 35 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రాష్ట్రంలో 15 వరకు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 6.8 సెం.మీ., సత్తుపల్లిలో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఇలినోయీలో ప్రభాకర్రావు.. మియామీలో శ్రవణ్రావు
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. -
నోముల భగత్ క్వార్టర్కు సీల్ తొలగింపుపై అప్పీలు ఉపసంహరణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వార్టర్ (ఈఈ/19)కు వేసిన సీల్ను 48 గంటల్లో తొలగించాలన్న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ సందర్భంగా ఉపసంహరించుకుంది. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. -
నేటితో ముగియనున్న ఎప్సెట్
రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎప్సెట్ (ఇంజినీరింగ్) విభాగం పరీక్షలు శనివారం ఉదయం విడతతో ముగియనున్నాయి. రెండో రోజు ఉదయం విడతలో 94.3 శాతం, మధ్యాహ్నం విడతలో 94.8 శాతం మంది హాజరయ్యారు. -
వారంలో మేడిగడ్డపై నిపుణుల కమిటీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీకి వానాకాలం వరదల నుంచి ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టడంపై దృష్టిసారించాలంటూ జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సూచించారు. -
మన్నె క్రిశాంక్కు బెయిల్.. జైలు నుంచి విడుదల
‘ఓయూ సర్క్యులర్ మార్ఫింగ్’ కేసులో భారాస సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇదీ సంగతి!
-
ఓటుకు సొంతూరి బాట
ఓట్ల పండగ సమీపించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు అంతా ఒకేసారి పయనమవ్వడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. -
దివ్యాంగ అక్కాచెల్లెళ్లకు మోదీ పలకరింపు
నారాయణపేటలో శుక్రవారం జరిగిన భాజపా జనసభలో ప్రధాని మోదీ ఇద్దరు దివ్యాంగ అక్కాచెల్లెళ్లను ఆప్యాయంగా పలకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!