టీ20 తీరున ద్వైపాక్షిక సంబంధాలు
అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి.
భారత్-ఆస్ట్రేలియా స్నేహంపై నరేంద్ర మోదీ వ్యాఖ్య
బెంగళూరులో ఆస్ట్రేలియా కాన్సులేట్.. త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆల్బనీస్
ముగిసిన ప్రధానమంత్రి 3 దేశాల పర్యటన
సిడ్నీ/దిల్లీ: అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్-ఆస్ట్రేలియాలు ముందడుగు వేశాయి. రెండు దేశాల మధ్య విద్యార్థులు, పరిశోధకుల రాకపోకలు, వలసలకు సంబంధించి కీలక ఒప్పందాలు అక్షరరూపం దాల్చాయి. సిడ్నీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో ప్రధాని మోదీ బుధవారం వివిధ అవగాహనా ఒప్పందాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరికి సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సాకారం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పునరుత్పాదక రంగంలో భారీ అవకాశాలను సృష్టించే గ్రీన్ హైడ్రోజన్ కార్యదళంపై విధివిధానాల రూపకల్పనకు గాను ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ, ఆల్బనీస్లు మీడియాతో మాట్లాడారు. ‘‘పరస్పర విశ్వాసం, గౌరవంతో పాటు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య సజీవ వారధులుగా నిలుస్తున్నార’’ని ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘టీ20 మోడ్లోకి ప్రవేశించాయ’ంటూ క్రికెట్ పరిభాషలో వివరించారు. ఏడాది వ్యవధిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో ఆరుసార్లు భేటీ కావడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ‘గత ఏడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై దృష్టి సారించాం. ఇది రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సహకారంలో నూతన అవకాశాలకు బాటలు వేస్తుంద’ని పేర్కొన్నారు.
ఆల్బనీస్కు మోదీ ఆహ్వానం..
ఈ ఏడాది భారత్లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను వీక్షించేందుకు రావాల్సిందిగా ఆల్బనీస్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను మోదీ ఆహ్వానించారు. అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను చూడొచ్చని చెప్పారు. బెంగళూరులో త్వరలో తమ దేశ కాన్సులేట్ను ప్రారంభించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ వెల్లడించారు. సిడ్నీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లే, విపక్ష లిబరల్ పార్టీ నేత పీటర్ డ్యూటన్, ఇతర ప్రముఖులతోనూ విడివిడిగా భేటీ అయ్యారు.
వేర్పాటువాదులపై చర్యలకు ఆస్ట్రేలియా ప్రధాని హామీ
‘ఆస్టేలియాలో ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై జరుగుతోన్న దాడులు, వేర్పాటువాద(ఖలిస్థాన్)శక్తుల కార్యకలాపాల గురించి ఆల్బనీస్, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఆ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హానికలిగించే చర్యలను మేం ఏ మాత్రం అంగీకరించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్బనీస్ మరోసారి హామీ ఇచ్చారు’ అని మోదీ వెల్లడించారు.
త్రివర్ణాల్లో మెరిసిన ఒపెరా హౌస్
ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకుని సిడ్నీలోని ప్రసిద్ధ ఒపెరాహౌస్, హార్బర్ బ్రిడ్జ్లను భారత జాతీయ పతాకంలోని మూడు వర్ణాలతో మెరిసేలా అలంకరించారు. ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైందని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆతిథ్యమిచ్చిన ఆ దేశ ప్రజలు, ప్రధాని ఆల్బనీస్కు కృతజ్ఞతలు తెలిపారు. దిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారంతో ప్రధాని మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. జీ7, క్వాడ్ సదస్సుల్లో పాల్గొనేందుకు శుక్రవారం జపాన్ వెళ్లిన ఆయన ఆ తర్వాత పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!