మైక్రోసాఫ్ట్ ఆరోపణలు అర్థరహితం
ఐరోపాలోని పలు ప్రభుత్వాల ఈ మెయిళ్లను తమ దేశానికి చెందిన హ్యాకింగ్ గ్రూపు హ్యాక్ చేసిందని మైక్రోసాఫ్ట్ నివేదిక పేర్కొనడాన్ని చైనా తప్పుబట్టింది.
అమెరికా సైబర్ కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లించే చర్య: చైనా
హాంకాంగ్: ఐరోపాలోని పలు ప్రభుత్వాల ఈ మెయిళ్లను తమ దేశానికి చెందిన హ్యాకింగ్ గ్రూపు హ్యాక్ చేసిందని మైక్రోసాఫ్ట్ నివేదిక పేర్కొనడాన్ని చైనా తప్పుబట్టింది. ఇది తప్పుడు సమాచారమని, అమెరికా సైబర్ కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లించడానికే ఆ సంస్థ ఈ ఆరోపణలు చేసిందని విమర్శించింది. స్టార్మ్-0558 పేరుతో ఉన్న గ్రూపు 25 ప్రభుత్వ సంస్థలకు చెందిన ఈ మెయిళ్లను హ్యాక్ చేసిందని, అందులో ఐరోపాలోని ప్రభుత్వాల ఈ మెయిళ్లు ఉన్నాయని మంగళవారం మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. తమ మెయిళ్లలో అసాధారణ కార్యకలాపాలను గుర్తించి వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ‘ఇది గూఢచర్యంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామం. నిఘా వర్గాలు ఇటువంటి సమాచారాన్ని సేకరిస్తుంటాయి’ అని మైక్రోసాఫ్ట్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు చార్లీ బెల్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వ ఈ మెయిళ్లనూ చైనా గ్రూపు హ్యాక్ చేసిందని వాషింగ్టన్ పోస్టు నివేదిక పేర్కొంది. ఈ ఆరోపణలను చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఖండించారు. ‘ఈ ఆరోపణలను ఏ సంస్థ చేసిందన్నది కాదు. అసలు ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాకర్ అమెరికా అన్నది ఎప్పటికీ మారని వాస్తవం. ఆ దేశమే అత్యధిక సైబర్ చౌర్యానికి పాల్పడుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు