భారత్కు ఎప్పుడో ఆధారాలిచ్చాం
భారత్ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.
నిజాల నిరూపణలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం
నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో, వాషింగ్టన్, దిల్లీ: భారత్ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన ఆరోపణలపై ఆధారాలను చాలా వారాల క్రితమే భారత్కు ఇచ్చామని, నిజాల నిరూపణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కెనడా పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్యోదంతంతో చెలరేగిన వివాదంపై ఈ మేరకు తాజాగా స్పందించారు. ‘సీరియస్ అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం. రెండు దేశాలూ ఈ కేసులో నిజాన్ని తేల్చడం ముఖ్యం. దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. నిజ్జర్ విషయంలో కెనడా ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట సమాచారాన్ని చెప్పలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి దిల్లీలో స్పష్టంచేశారు.
కెనడాలోని హిందువులపై విద్వేషాన్ని రగిల్చేలా ఆన్లైన్లో జరుగుతున్న ప్రచారాన్ని కెనడా మంత్రులు, రాజకీయనాయకులు ఖండించారు. హిందువుల్ని తాము స్వాగతిస్తున్నామని, వారు కెనడాలో సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. నిజ్జర్ మత నాయకుడు కాదని, ఉగ్రవాదేనని దిల్లీలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1980-90 మధ్య పంజాబ్లో సుమారు 200 మందిని హతమార్చిన దీపా హెరన్వాలాతో నిజ్జర్కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపాయి. 1996లో కెనడాకు పారిపోవడం నుంచి ఎక్కడెక్కడ ఏయే కార్యకలాపాలు నిర్వహించిందీ వివరించాయి. హరియాణాలోని సిర్సాలో డేరా సచ్ఛాసౌధా ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడికి పన్నాగం పన్నినా, భారత వీసా మంజూరుకాకపోవడం వల్ల రాలేదని తెలిపాయి.
జవాబుదారీ ముఖ్యం: బ్లింకెన్
ప్రస్తుత వివాదం విషయంలో కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారు. ‘మేం జవాబుదారీని చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగడం, వాస్తవాలు వెలుగులోకి రావడం ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ట్రూడో ఆరోపణలు తీవ్ర కలవరం కలిగించాయన్నారు. భారత్పై ట్రూడో ఆరోపణలు చేయడానికి ముందు ‘ఫైవ్ ఐస్’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు నిఘా వర్గాల సమాచారం అందిందని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ ధ్రువీకరించారు.
అమెరికా మొగ్గు భారత్వైపే: పెంటగాన్ మాజీ అధికారి
ఖలిస్థాన్ నేత హత్యోదంతంలో భారత్కు బాసటగానే అమెరికా నిలిచే అవకాశం ఉందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అభిప్రాయపడ్డారు. ‘రెండు మిత్రదేశాల విషయంలో ఒకరికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే అమెరికా మొగ్గు భారత్ వైపే ఉంటుంది. ఎందుకంటే నిజ్జర్ ఒక ఉగ్రవాది. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైంది. కెనడా ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం’ అని చెప్పారు. ‘ఈ ఘర్షణ భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం. ఘర్షణే కావాలనుకుంటే అది ఏనుగుతో చీమ పోరాటంలాగే ఉంటుంది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనేది వాస్తవం. చైనాను ఎదుర్కొనే విషయంలో వ్యూహాత్మకంగా భారత్తో మా బంధం చాలా ముఖ్యమైంది’ అని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
భారీగా కురిసిన వర్షాలతో అఫ్గానిస్థాన్(Afghanistan) అల్లాడిపోతోంది. దాంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. -
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు
జెలెన్స్కీ(Volodymyr Zelenskyy) హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ క్రమంలో అత్యంత ప్రముఖులకు భద్రత కల్పించే స్టేట్ గార్డ్ విభాగాధిపతిని పదవి నుంచి తప్పించింది. -
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు