రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదంపై నిర్లక్ష్యమొద్దు
రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేత బాధ్యతలను విస్మరించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు భారత్ సూచించింది.
ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం తగదు
కెనడాకు భారత్ పరోక్ష చురకలు
భద్రతా మండలిని విస్తరించాల్సిందే
ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించిన మంత్రి జైశంకర్
ఐక్యరాజ్య సమితి: రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదం, ఉగ్రవాదం అణచివేత బాధ్యతలను విస్మరించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు భారత్ సూచించింది. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. కెనడాతో వివాదం నెలకొన్న నేపథ్యంలో ఐరాస వేదికగా భారత్ తన వాణిని గట్టిగా వినిపించింది. మంగళవారం ఐరాస 78వ సాధారణ అసెంబ్లీనుద్దేశించి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జై శంకర్ ప్రసంగించారు. ‘కొన్ని దేశాలు ఎజెండా నిర్ణయించి దానిని అందరూ అనుసరించాలన్న రోజులు పోయాయి. వర్ణ వివక్ష ఆధారంగా టీకాల్లో అన్యాయం చేసే విధానానికి చరమగీతం పాడాలి. వాతావరణ మార్పులపైనా చరిత్రాత్మక బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు. మార్కెట్ శక్తిని ఆహారం, ఇంధనాలను పేదలను కాదని పెద్దలకు అందేలా వినియోగించకూడదు’ అని జైశంకర్ పేర్కొన్నారు.
జీ20లాగే భద్రతా మండలిని విస్తరించాలి
ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చేందుకు భారత్ చేసిన కృషిని స్ఫూర్తిగా ఐరాస భద్రతా మండలిని విస్తరించాలని జైశంకర్ సూచించారు. ‘భారత్ తీసుకున్న చొరవవల్ల మొత్తం ఆఫ్రికా తన వాణిని జీ20లో వినిపించేందుకు అవకాశం దక్కింది. ఇలాంటి కీలక ముందడుగే స్ఫూర్తిగా పురాతన ఐరాసను సంస్కరించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిని విస్తరించాలి. సమర్థంగా పనిచేయడానికి, విశ్వసనీయతను సాధించడానికి మరింత మంది సభ్యులను మండలిలో చేర్చుకోవాలి. ఇతర దేశాల వాణిని వినడం, వారి అభిప్రాయాలను ఆలకించడం ఐరాసకు బలహీన అంశం కాదు. అది మూల సహకారానికి సంబంధించినది. కలిసి పని చేసినప్పుడే అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికీ కొన్ని దేశాలే ఎజెండాను నిర్ణయిస్తున్నాయి. వాటిని అన్ని దేశాలపై రుద్దుతున్నాయి. ఇది నిరంతరం కొనసాగడానికి వీల్లేదు. సవాలు చేయకుండా అదే విధానాన్ని కొనసాగించడమూ సరికాదు. పారదర్శక, సమానత్వ, ప్రజాస్వామ్య విధానాలు రావాలి. విధానాల నిర్ణయంలో అందరికీ భాగస్వామ్యం ఉన్నప్పుడే అంతటా అమలవుతాయి. భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలని భారత్ ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఇప్పుడు మేం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించాం. ప్రస్తుతమున్న భద్రతా మండలి 21వ శతాబ్దానికి ఏ మాత్రం సరిపోదు’ అని జైశంకర్ పేర్కొన్నారు.
‘భారత్ నుంచి నమస్తే’
ఐరాస సభలో ‘భారత్ నుంచి నమస్తే’ అంటూ చేతులు జోడించి మంత్రి జైశంకర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఐరాస సాధారణ అసెంబ్లీ హాలులో 17 నిమిషాలపాటు ఆయన ప్రసంగించారు. ‘ఆధునిక మూలాల్లోకి చొచ్చుకుపోయిన పురాతన సంప్రదాయ ప్రజాస్వామ్యం నుంచి ప్రస్తుత సమాజం కోసం మాట్లాడుతున్నా. అందుకే మా ఆలోచన, ఆచరణ, చర్యలు మరింత అథీకృతంగా, క్షేత్రస్థాయిలో ఫలితమిచ్చేవిగా ఉంటాయి. సంప్రదాయాలను, సాంకేతికతను మేళవించి మేం పని చేస్తున్నాం. ఇదే ప్రస్తుత ఇండియాను నిర్వచిస్తోంది. దటీజ్ భారత్’ అని జైశంకర్ పేర్కొన్నారు. దేశం అమృత కాలంలో ఉన్న వేళ చంద్రయాన్-3 విజయం ద్వారా దేశం ఏం చేయగలదో ప్రపంచానికి చాటామని చెప్పారు.
వారధిగా నిలుస్తున్నాం
ప్రపంచంలో ఉత్తర, దక్షిణాల మధ్య విభజనను రూపుమాపడానికి వారధిగా పని చేస్తున్నామని, తూర్పు, పశ్చిమాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుత మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు బలమైన దేశాలనూ ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నామని చెప్పారు. న్యూయార్క్లో ఉన్న ఆయన మంగళవారం దిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనివర్సిటీ కనెక్ట్ కార్యక్రమంలో వీడియో మాధ్యమంద్వారా మాట్లాడారు. దేశంలోని పరివర్తనను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు అనుసరించడానికి ముందుకొచ్చాయని తెలిపారు. ఒకే ప్రపంచం.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు అన్న భారత్ నినాదాన్ని ప్రపంచం విశ్వసించిందని, మన దేశాన్ని పరిష్కర్తగా చూస్తోందని పేర్కొన్నారు.
30 కల్లా నిధులు విడుదల కాకుంటే అమెరికాలో ఆర్థిక సంక్షోభమే!
వాషింగ్టన్: అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నిర్వహణకు కావలసిన నిధులను కాంగ్రెస్ (పార్లమెంటు) అయిదు రోజుల్లో, అంటే ఈ నెల 30 కల్లా విడుదల చేయకపోతే యావత్ ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. లక్షలాది ప్రభుత్వోద్యోగులకు జీతాలు, పౌర సేవలకు నిధులు లభ్యం కాకపోవడమే దీనికి కారణం. అమెరికా ప్రభుత్వంపై ఇప్పటికే 33 లక్షల కోట్ల డాలర్ల రుణభారం ఉండటంతో ప్రతిపక్ష రిపబ్లికన్లు ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. పాలక డెమోక్రాట్లకు ఆధిక్యత ఉన్న ఎగువ సభ సెనెట్లో రిపబ్లికన్ల మద్దతుతో తాత్కాలిక నిధుల విడుదల బిల్లును ఆమోదింపజేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సకాలంలో ప్రభుత్వానికి నిర్వహణ నిధులు అందకపోతే అమెరికా రుణ పరపతి రేటింగ్ పడిపోతుందని మూడీస్ హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం
నాలుగేళ్ల క్రితం ఇరాన్(Iran)కు చెందిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసీం సులేమానీ అమెరికా దాడిలో మృతి చెందాడు. దీనిపై అమెరికా(USA) నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
Hamas: దాడులకు ముందు భారీగా షార్ట్ సెల్లింగ్.. రూ.కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు!
హమాస్ దాడి సమాచారం ముందే తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు ఐదు రోజుల ముందు ఇజ్రాయెల్ కంపెనీల షేర్లను (Short Selling) భారీగా కొనుగోలు చేశారట. -
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత, మాజీ అధ్యక్షులు బైడెన్, ట్రంప్ రంగంలోకి దిగారు. -
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడాన్ని ఖండిస్తున్న మానవ, మహిళా హక్కుల సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై దాడులు జరిగినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. -
Pakistan: పాక్లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్ సయీద్ అనుచరుడి కాల్చివేత
Pakistan: పాక్లో ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
Israel: లెబనాన్కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం..!
ఇజ్రాయెల్ పొరపాటున జరిపిన దాడిలో లెబనాన్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ఐడీఎఫ్ క్షమాపణ చెప్పింది. -
Kim Jong Un: ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
Kim Jong Un: కిమ్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. తన కఠిన ఆంక్షలతో ప్రజలను వణికిస్తోన్న ఈ నియంత.. కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
థాయ్లాండ్లో చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి
థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 49 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. -
కెన్యాకు రూ.2,084 కోట్ల రుణం
వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను కెన్యాకు రూ.2,084 కోట్లు (250 మిలియన్ డాలర్లు) సమకూర్చాలని భారత్ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. -
ప్రపంచ సగటులో భారత్ ఉద్గారాలు సగమే
కార్బన్ డయాక్సైడ్ (సీవో2) వెలువరించడంలో 2022లో భారతదేశ సగటు 5% మేర పెరిగినా అది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడిన ‘గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు’ తేల్చింది. -
అలబామా వర్సిటీలో నేడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య చర్చ
అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య బుధవారం జరిగే చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా పాల్గొంటున్నారు. -
ఇజ్రాయెల్ది మానవ హననం
గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందని, ఆ దేశం తీరుతో పశ్చిమాసియా ప్రమాదంలో పడుతోందని ఖతార్, తుర్కియే ధ్వజమెత్తాయి. -
భారత్పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నకిలీ ఫేస్బుక్ ఖాతాలు
భారత్పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. -
మళ్లీ పేలిన ఇండోనేసియా అగ్నిపర్వతం
పశ్చిమ ఇండోనేసియాలోని మౌంట్ మెరపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం సంభవించిన దుర్ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం చోటుచేసుకుంది. -
రష్యా దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ వాసుల మృతి
ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్పై రష్యా మంగళవారం జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
ఖాన్ యూనిస్ రక్తసిక్తం
గాజాలోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేయడంతో అల్లకల్లోలమైంది. -
ఖలిస్థానీ ఉగ్రవాది లక్బిర్సింగ్ పాకిస్థాన్లో మృతి
పాకిస్థాన్లో నక్కిన మరో ఖలిస్థానీ ఉగ్రవాది మరణించాడు. నిషేధిత ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ నేత లక్బిర్సింగ్ అలియాస్ రోడే పాకిస్థాన్లోని రావల్పిండిలో తీవ్ర గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. -
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేలా బిల్లు
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు, దేశాల వారీగా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. -
శాకాహారంతో అల్జీమర్స్కు కళ్లెం!
భారత్, జపాన్, చైనాల్లో తినే శాకాహారం, సంప్రదాయ భోజనంతో అల్జీమర్స్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. -
WHO: ఆల్కహాల్, తీపిపానియాల వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్వో కొత్త సిఫార్సు
ఆల్కహాల్, తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంఖ్య కొత్త సిఫార్సు చేసింది. వీటి ఉత్పత్తులపై అధిక పన్నును విధించాలని ఒక మాన్యువల్ను విడుదల చేసింది. -
Hamas: ‘బందీలకు మత్తుమందు ఇచ్చి.. కృత్రిమ నవ్వులు తెప్పించి!’
బందీలు సంతోషంగా, ప్రశాంతంగా కనిపించేలా హమాస్ మిలిటెంట్లు వారికి మత్తుమందు ఇచ్చారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Tirumala: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
NTR 31: ఎన్టీఆర్తో సినిమా.. అంచనాలు పెంచేలా ప్రశాంత్ నీల్ అప్డేట్
-
Apply Now: ఫ్యాషన్ ప్రపంచం వైపు వెళ్తారా? ఇదిగో గొప్ప ఛాన్స్!
-
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
-
వాగుదాటుతూ ముగ్గురు గల్లంతు.. అల్లూరి జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు
-
Social Look: శ్రీదేవి డ్రెస్లో మెరిసిన ఖుషి కపూర్.. మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్