నీ భర్త ఎక్కడ?.. నిక్కీ హేలీపై ట్రంప్ పరిహాసం
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీని ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. ఆమె భర్త ఎక్కడంటూ పరిహాసమాడారు. నిక్కీ భర్త మేజర్ మైఖేల్ హేలీ.. సైనిక విధుల్లో భాగంగా విదేశాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సైనిక కుటుంబాలను అవమానిస్తున్నారన్న భారత అమెరికన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీని ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. ఆమె భర్త ఎక్కడంటూ పరిహాసమాడారు. నిక్కీ భర్త మేజర్ మైఖేల్ హేలీ.. సైనిక విధుల్లో భాగంగా విదేశాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ సైనిక కుటుంబాలను ట్రంప్ ఆవమానిస్తున్నారని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ట్రంప్, హేలీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతోంది. మేజర్ మైఖేల్ హేలీ.. గత ఏడాది జూన్ నుంచి ‘హార్న్ ఆఫ్ ఆఫ్రికా’ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలియని ట్రంప్.. శనివారం దక్షిణ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రస్తావన తెచ్చారు. ‘‘ఆమె (నిక్కీ) భర్త ఎక్కడ? ఆయన దూరంగా ఉన్నారు. ఆమె భర్తకు ఏమైంది’’ అని ప్రశ్నించారు. గ్లోబలిస్టులు, యుద్ధోన్మాదుల అభ్యర్థి నిక్కీ అని ఆరోపించారు.
ట్రంప్ విమర్శలకు నిక్కీ ఘాటుగా బదులిచ్చారు. ‘‘డొనాల్డ్..! ఏదైనా చెప్పాలనుకుంటే.. నా వెనుక కాకుండా.. చర్చా వేదికలో నా ఎదుటే చెప్పండి. సైన్యంలో నా భర్త సేవలు నాకు గర్వకారణం. 75 ఏళ్లు పైబడ్డ రాజకీయ నేతలకు మానసిక సామర్థ్య పరీక్షలు అవసరమని ఎప్పుడో చెప్పా. వాటిలో ట్రంప్ పాస్ కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, ఒక సైనికుడి సేవలను గేలి చేస్తే.. అధ్యక్ష పదవి సంగతి అటుంచండి.. డ్రైవింగ్ లైసెన్సు పొందే నైతికహక్కు కూడా మీకు ఉండదు. మైఖేల్.. దేశం కోసం సేవలు అందిస్తున్నారు. సైనిక కుటుంబాలను పదేపదే అవమానించే వారు దేశ సర్వసైన్యాధిపతి పదవిని చేపట్టడానికి అర్హులు కారు’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.