Canada: కెనడాలో పంజాబ్‌ యువతి హత్య.. భారత్‌కు పరారైన అనుమానితుడు..!

Eenadu icon
By International News Team Updated : 28 Oct 2025 13:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెనడాలో ఓ భారత యువతి దారుణ హత్యకు గురైంది. పంజాబ్‌కు చెందిన అమన్‌ప్రీత్‌ సైనీ ఇటీవల తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయింది. (Woman Murdered In Canada) ఈ కేసులో మరో భారతీయుడిని పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఇప్పటికే అతడు భారత్‌కు పారిపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

 పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన 27 ఏళ్ల సైనీ గత కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లి టొరంటోలో నివసిస్తున్నారు. గతవారం ఆమె లింకన్‌ ప్రాంతంలోని ఓ పార్కులో తీవ్ర గాయాలతో విగతజీవిగా కన్పించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సైనీని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించిన పోలీసులు.. మరో భారతీయుడు మన్‌ప్రీత్ సింగ్‌ను అనుమానితుడిగా పేర్కొన్నారు. అతడిని వాటెండ్‌గా ప్రకటిస్తూ గాలింపు చేపట్టారు. అతడి ఫొటోను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే అతడు దేశం విడిచి పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మన్‌ప్రీత్‌ ఆచూకీ కోసం కెనడా అధికారిక వర్గాలు భారత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 

Tags :
Published : 28 Oct 2025 13:11 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు