Team india: హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Womens World Cup) గెలవడంలో కీలకపాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లైన హర్మన్ ప్రీత్ కౌర్, అమన్జ్యోత్ కౌర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) రూ.11 లక్షలు చొప్పున నగదు రివార్డ్ను ప్రకటించింది. అలాగే జట్టు ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలికి రూ.5 లక్షల రివార్డ్ ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని వారికి త్వరలోనే అందించనున్నట్లు తెలిపింది.
పీసీఏ అధ్యక్షుడు అమర్జిత్ సింగ్ మెహతా, గౌరవ కార్యదర్శి సిద్ధాంత్ శర్మ.. టీమ్ఇండియా విజయంలో హర్మన్ ప్రీత్ కౌర్, అమన్జ్యోత్ కౌర్, ఫీల్డింగ్ కోచ్ మునీష్ బాలి పాత్రను ప్రశంసించారు. వారి ప్రదర్శన పంజాబ్కు మాత్రమే కాకుండా యావత్ భారత్కు గర్వకారణమని కొనియాడారు. ‘ఈ ప్రపంచ కప్ విజయం భారతదేశానికి గర్వకారణం. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిలో పంజాబ్కు చెందిన వారుండటం ఆనందదాయకం. వారి అంకితభావం, ప్రదర్శన మన రాష్ట్రానికే కాకుండా, భారత క్రికెట్కూ గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి.’ అని అన్నారు.
టీమ్ఇండియా కెప్టెన్గా వ్యహరిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ స్వస్థలం పంజాబ్లోని మోగా. ఆమె సారథ్యంలోనే టీమ్ఇండియా తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. అటు బ్యాటర్గానూ, ఇటు కెప్టెన్గా రాణించింది. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో షెఫాలీ వర్మ చేతికి బంతిని అందించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. షెఫాలీ సైతం తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వరుస ఓవర్లలో రెండు వికెట్లను కూల్చి.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పడంలో సాయపడింది. స్లో బంతులు సంధించి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించింది. వారు స్వేచ్ఛగా పరుగులు చేయకుండా కట్టడి చేసింది. అలాగే మొహాలికి చెందిన అమన్జ్యోత్ కౌర్ సైతం తన ఆల్రౌండ్ ప్రతిభతో టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్రను పోషించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్.. భారత్ ఏ స్క్వాడ్ ప్రకటన.. చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) 2025 ప్రారంభం కానుంది. - 
                                    
                                        

వన్డే వరల్డ్ కప్ విజయం.. అమాంతం పెరిగిన భారత క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ!
కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ భారత మహిళల జట్టు (Team India) వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. - 
                                    
                                        

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
మహిళల వన్డే వరల్డ్ కప్ను తొలిసారిగా భారత జట్టు (Team India) కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. - 
                                    
                                        

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా (Team India) 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారతజట్టు విశ్వవిజేతగా నిలిచింది. - 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ముందుగా మేము అణు పరీక్షలను పునరుద్ధరించం: పాక్
 - 
                        
                            

ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 - 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 


