Israel: 1500 మంది హమాస్ మిలిటెంట్లు హతం.. ఇజ్రాయెల్ సైన్యం వెల్లడి
Israel Hamas Conflict: తమ దేశంలోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. తమ భూభాగంలో ఇప్పటివరకు 1500 మంది హమాస్ ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించింది.
జెరూసలెం: తమ దేశంపై మెరుపు దాడికి దిగిన హమాస్ (Hamas) మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం (Israel Army) దీటుగా ప్రతిఘటించింది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులను ఎక్కడికక్కడ ఏరిపారేసింది. దాదాపు 1500 మంది ముష్కరులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించింది. సరిహద్దులు కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చినట్లు తెలిపింది. (Israel - Hamas conflict)
‘‘గాజా స్ట్రిప్ (Gaza Strip) చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించాం. దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు చొరబడిన ప్రాంతాలను తిరిగి మా అధీనంలోకి తీసుకున్నాం. సరిహద్దుల వెంబడి కూడా పరిస్థితి పూర్తిగా మా నియంత్రణలోకి వచ్చింది’’ అని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి రిచర్డ్ హెచ్ మీడియాకు వెల్లడించారు. అంతేగాక, గత రాత్రి నుంచి ఒక్క హమాస్ ఉగ్రవాది కూడా సరిహద్దులు దాటలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ చొరబాట్లు జరిగే అవకాశముందని తెలిపారు.
రంగులు మార్చి.. ఏమార్చి.. ఇజ్రాయెల్పై దాడికి హమాస్ వ్యూహం..!
ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన అత్యంత పాశవిక మారణహోమంలో మృతుల సంఖ్య 900కు చేరుకుంది. అటు గాజాలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కు పెరిగినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. మరోవైపు, సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య నాలుగో రోజు పోరు కొనసాగుతోంది.
ఇజ్రాయెల్కు అమెరికా మందుగుండు..
ఇదిలా ఉండగా.. హమాస్ దాడిని ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్కు అన్ని విధాలా అండగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా (USA) ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు కీలకమైన మందుగుండు, మిలిటరీ పరికరాల డెలివరీని ప్రారంభించింది. ఇప్పటికే, విమాన వాహకనౌక, యుద్ధ నౌకలను అమెరికా ఇజ్రాయెల్ తీరానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో నేరుగా కాలుపెట్టే (అమెరికా సైన్యాన్ని పంపడంపై స్పందిస్తూ) ఉద్దేశం తమకు లేదని అమెరికా జాతీయ భధ్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్