Canada: నిజ్జర్ హత్యకు సంబంధించి 90 సెకన్ల సీసీటీవీ పుటేజీ.. అమెరికా పత్రిక వెల్లడి
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన సీసీటీవీ క్లిప్ తాము చూశామని అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ఇద్దరు వ్యక్తులు సర్రేలోని గురుద్వారా వద్ద ఉగ్రవాది నిజ్జర్పై కాల్పులు జరిపిన దృశ్యాలు అందులో ఉన్నాయని పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: కెనడా(Canada)లోని ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి అమెరికా(USA)కు చెందిన ఓ పత్రిక సంచలన కథనం వెలువరించింది. నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియోను తాము చూసినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొంది. సమీపంలోని సీసీటీవీ నుంచి ఈ పుటేజీ లభించిందని తెలిపింది. దీనిలో దుండగులు రావడం.. నిజ్జర్ను తుపాకీతో కాల్చి తాపీగా వెళ్లిపోయిన దృశ్యాలు నిక్షిప్తమై ఉన్నాయని వెల్లడించింది.
దాదాపు 90 సెకన్ల నిడివిగల వీడియోలో నిజ్జర్ వినియోగించే గ్రేకలర్ పికప్ ట్రక్, ఓ తెల్లటి సెడాన్ కారు పక్కపక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అంతలోనే సెడాన్ వేగంగా పికప్ ట్రక్ ఎదుటకు వచ్చి ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో హుడెడ్ స్వెట్ షర్ట్లు వేసుకొన్న ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో నిజ్జర్ ఉన్న పికప్ ట్రక్ వద్దకు వచ్చారు. మరోవైపు సెడాన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఆ వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తిపై తూటాల వర్షం కురిపించారు. మొత్తం 50 తూటాలను కాల్చగా.. వీటిల్లో 34 నిజ్జర్ శరీరం లోకి దూసుకెళ్లాయి. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు సెడాన్ వెళ్లిన దిశగా వేగంగా పరిగెత్తారు. ఈ ఘటన రాత్రి 8.27 సమయంలో చోటు చేసుకుంది.
సమీపంలోని ఓ మైదానంలో ఫుట్బాల్ ఆడుతున్న భూపిందర్జీత్ సింగ్ అనే వ్యక్తి ఘటనా స్థలానికి పరిగెత్తుకొంటూ వచ్చి చూడగా.. అప్పటికే నిజ్జర్ కారులో అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు నాయకత్వం విషయంలో కెనడా రాయల్ మౌంటెడ్ పోలీసు, సర్రే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ బృందం మధ్య కొద్ది సేపు వాదనలు జరిగాయి. అది కూడా తీవ్ర జాప్యానికి కారణమైందని భూపిందర్ సింగ్ వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
భారత్ కీలక భాగస్వామే.. కానీ..!
నిజ్జర్ హత్య భారత్-అమెరికా మధ్య తీవ్రమైన దౌత్య వివాదానికి దారి తీసిన సమయంలో వాషింగ్టన్ పోస్టు ఈ కథనం ప్రచురించడం విశేషం. అత్యవసరమైతే తప్ప భారత పర్యటన చేయొద్దని తమ దేశ పౌరులకు కెనడా సోమవారం రెండోసారి ప్రయాణ సలహాను జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, కొందరు ఆందోళనలకూ పిలుపునిస్తున్నారని.. కాబట్టి భారత్లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని తమ దేశ పౌరులకు సూచించింది. ఖలిస్థాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
సొంత సైన్యంపైనే కాల్పులు జరపడంతో ఐడీఎఫ్కు భారీ నష్టం వాటిల్లింది. పొరపాటున జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. -
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
Fraud: అగ్రరాజ్యంలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇద్దరు అన్నదమ్ములు కేవలం 12 సెకన్లలోనే రూ.200 కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని దోచేశారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
Robert Fico: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
Pakistan: భారత్ సాధిస్తున్న పురోగతి.. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. -
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!