Barack Obama: బరాక్ ఒబామా ప్రవేశంపై రష్యా నిషేధం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) సహా 500 మంది అమెరికన్లపై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్ విషయంలో మాస్కోపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడింది.
మాస్కో: ఉక్రెయిన్ (Ukraine)పై దండయాత్ర సాగిస్తున్న రష్యా (Russia)పై మరింతగా ఆంక్షల చట్రం బిగించాలని పశ్చిమ దేశాలు నిర్ణయించారు. అయితే, దీనికి స్పందించిన మాస్కో.. ప్రతిచర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama), ప్రముఖ కమెడియన్ స్టీఫెన్ కోల్బెర్గ్ (Stephen Colbert) సహా 500 మంది అమెరికన్లు తమ దేశంలోకి అడుగుపెట్టకుండా రష్యా నిషేధం విధించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ జాబితా విడుదల చేసింది.
ఈ జాబితాలో 45 మంది యూఎస్ (USA) చట్టసభ సభ్యులు, మాజీ రాయబారులు ఉన్నారు. వ్యక్తుల పరంగా ఏయే కారణాలతో వీరిపై నిషేధం విధించారన్న విషయాన్ని మాస్కో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. అయితే, రష్యాపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, ఉక్రెయిన్ (Ukraine)కు ఆయుధాలు సరఫరా చేయడం వంటి కారణాలతో ఈ నిషేధం అమలు చేసినట్లు పేర్కొంది.
ఈ ఆంక్షలతో పాటు.. రష్యా (Russia) చెరలో ఉన్న వాల్స్ట్రీట్ జర్నల్ ఇవాన్ గెర్ష్కోవిచ్కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని అమెరికా చేసిన అభ్యర్థనను కూడా తిరస్కరించినట్లు మాస్కో విదేశాంగ శాఖ వెల్లడించింది. గత నెల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఆ పర్యటనను కవర్ చేసేందుకు రష్యన్ జర్నలిస్టులకు అగ్రరాజ్యం వీసాలను తిరస్కరించింది. ఆ చర్యకు ప్రతిస్పందనగానే.. ఇవాన్కు కాన్సులర్ యాక్సెస్ను తిరస్కరిస్తున్నట్లు మాస్కో తెలిపింది. గూఢచర్యం కేసులో ఇవాన్ను ఈ ఏడాది మార్చిలో రష్యా పోలీసులు అరెస్టు చేశారు.
రష్యాపై ఇప్పటికే విధించినవాటికి అదనంగా మరిన్ని నిషేదాజ్ఞలు అమల్లోకి తీసుకురావాలని పశ్చిమదేశాలు నిర్ణయించాయి. తాజాగా జపాన్లో జరుగుతున్న శక్తిమంతమైన జీ-7 (G-7) దేశాల సదస్సులో దీనిపై తీర్మానం తీసుకురానున్నాయి. తాజా ఆంక్షల్లో భాగంగా రష్యాకు చెందిన దాదాపు 70 కంపెనీలపై అమెరికా (America) నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. జీ-7లోని ఇతర సభ్యదేశాలూ అదే బాటలోనే నడవనున్నట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పారు. రష్యాను మరింతగా ఏకాకిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మాస్కో ప్రతిచర్యకు దిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!